జోషిమఠ్లో భూకంపం వచ్చే ఆస్కారం
భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో తుర్కియేలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎన్జీఆర్ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్ సైంటిస్ట్ పూర్ణచందర్రావు తెలిపారు.
నాసిరకం నిర్మాణాలతోనే తుర్కియేలో తీవ్ర నష్టం
ఎన్జీఆర్ఐ శాస్త్రవేత్త పూర్ణచందర్రావు
ఈనాడు, హైదరాబాద్: భూకంపాలను తట్టుకునేలా నిర్మాణాలు లేకపోవడం, నాసిరకం నిర్మాణాలతో తుర్కియేలో తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఎన్జీఆర్ఐలోని భూకంప పరిశోధన కేంద్రం చీఫ్ సైంటిస్ట్ పూర్ణచందర్రావు తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘భూకంప తీవ్రత 7.8గా నమోదవడం, రాత్రివేళలో సంభవించడం వల్ల అక్కడ మృతుల సంఖ్య పెరిగింది. భూకంప కేంద్రం 18 కిలోమీటర్ల లోతులోనే ఉండటంతో తీవ్రత ఎక్కువగా కనిపించింది. 30 కిలోమీటర్ల లోతులో ఉండి ఉంటే తీవ్రత ఇంతలా ఉండేది కాదు. భూకంపం వస్తుందని ముందస్తు హెచ్చరికలు చేసే సాంకేతికత మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎప్పుడొస్తుంది? ఎన్నిసార్లు వస్తుందనే విషయమై పరిశోధనలు జరుగుతున్నాయి. జోషిమఠ్లో భూకంపం వచ్చే అవకాశముందని అంచనా. హిమాలయాల చుట్టూ పక్కల ప్రాంతంలో ఎక్కువ భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. 1897, 1905, 1934, 1950లో అక్కడ తీవ్ర భూకంపాలు సంభవించాయి. 1934 తర్వాత నేపాల్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో పెద్ద భూకంపం సంభవించలేదు. మున్ముందు ఆ ప్రాంతాల్లోనూ భూకంపాలొచ్చే ఆస్కారముంది. భూకంపాల తీవ్రతను తట్టుకునేలా ప్రత్యేక నిర్మాణాలపై ప్రభుత్వం ప్రమాణాలను నిర్దేశించింది. కొందరు వీటిని పట్టించుకోవడం లేదు. భూకంపాలను తట్టుకునేలా రెట్రోఫిట్టింగ్ ద్వారా పాత భవనాలను మరింత దృఢంగా చేసే అవకాశం ఉంది’’ అని పూర్ణచందర్రావు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా