పరిమితంగా విద్యుత్ కొనుగోళ్లు
జాతీయస్థాయిలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్)లో కరెంటు అమ్మకం ధరలు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి.
ఇంధన ఎక్స్ఛేంజిలో ధరలు పెరగడమే కారణం
రాష్ట్రంలో 241 మిలియన్ యూనిట్లు దాటిన వినియోగం
మరిన్ని నిధుల కోసం డిస్కంల అభ్యర్థన
ఈనాడు, హైదరాబాద్: జాతీయస్థాయిలో విద్యుత్ డిమాండు పెరుగుతున్నందున భారత ఇంధన ఎక్స్ఛేంజి (ఐఈఎక్స్)లో కరెంటు అమ్మకం ధరలు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఒక యూనిట్ కరెంటు ధర రూ.12కు తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు రోజూవారీ విద్యుత్ కొనుగోళ్లను తగ్గించాయి. తాజాగా ఈ నెల 3న రాష్ట్రంలో 241.7 మిలియన్ యూనిట్ల (మి.యూ) కరెంటు వినియోగమైంది. గత 3 నెలల్లో రోజూవారీ వినియోగంలో ఇదే అత్యధికం. ప్రస్తుతం రోజూ 230 మి.యూ.ల కన్నా ఎక్కువ వినియోగం ఉంటోంది. కానీ వివిధ విద్యుత్ కేంద్రాల నుంచి లభ్యత 200 మి.యూ.లలోపే ఉన్నందున అదనంగా ఐఈఎక్స్లో రోజూ కొనాల్సి వస్తోంది. డిస్కంల వద్ద నిధులు పరిమితంగా ఉన్నందున ప్రస్తుతం రోజూ రూ.5 కోట్లను విద్యుత్ కొనుగోలుకు అదనంగా వెచ్చిస్తున్నాయి. ఈ సొమ్ముకు ఎంతొస్తే అంత కరెంటును కొంటున్నాయి. ప్రస్తుత యాసంగిలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతున్నందున రాష్ట్రంలో కరెంటు డిమాండు, వినియోగం మరింత పెరిగి రోజుకు 250 మి.యూ.లు దాటే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో కరెంటును ఐఈఎక్స్లో కొనేందుకు అదనంగా నిధులు కేటాయించాలని డిస్కంలు తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రస్తుతం వివిధ రాయితీల కింద నెలకు రూ.875 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు కేటాయిస్తోంది. ఇవి సరిపోవడం లేదని, మరో రూ.400 కోట్లయినా అదనంగా ఇస్తేనే గరిష్ఠ డిమాండును తీర్చేందుకు సరిపోయేలా కరెంటును కొనగలమని డిస్కంలు ప్రభుత్వానికి తెలిపాయి.
బిల్లులపై ఆదాయం పెరగాలి
రాష్ట్రంలో కరెంటు డిమాండు, వినియోగం పెరుగుతున్నా కరెంటు బిల్లులపై ఆదాయం పెరగడం లేదని, దీన్ని పెంచడంపై క్షేత్రస్థాయిలో ఇంజినీర్లు ఎక్కువగా దృష్టి పెట్టాలని తాజాగా ఒక సమావేశంలో ఉన్నతాధికారులు సూచించారు. ప్రతి కనెక్షన్కు ఎన్ని యూనిట్ల కరెంటు వినియోగమవుతుందో విద్యుత్ సహాయ ఇంజినీర్లు పరిశీలించి బిల్లు జారీ చేయడమే కాకుండా సొమ్ము వసూలయ్యేలా చూడాలని స్పష్టం చేశారు. వినియోగం పెరిగినప్పుడు అదే నిష్పత్తిలో ఆదాయం పెరిగేలా చూడటం ఇంజినీర్ల బాధ్యతని చెప్పారు. వ్యవసాయానికి వాడే విద్యుత్, పంపిణీ, సరఫరాలో నష్టం పోగా ఇస్తున్న కరెంటులో కేవలం 53.90 శాతానికే నెలనెలా బిల్లుల రూపంలో సొమ్ము వసూలవుతున్నాయని ఓ అధికారి వివరించారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన నిధులను ప్రభుత్వం సర్దుబాటు చేయకపోతే డిస్కంలకు ఆర్థిక ఇబ్బందులు తప్పవని ఆయన అభిప్రాయపడ్డారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!