రోజువారీ విద్యుత్ గరిష్ఠ డిమాండ్.. వచ్చే పదేళ్లలో 77 శాతం వృద్ధి!
దేశంలో విద్యుత్ డిమాండ్, వినియోగం పెరుగుతున్నందున ఇంధన పొదుపుపై అందరూ దృష్టి పెట్టాలని జాతీయ విద్యుత్ ప్రణాళిక’ (ఎన్పీఎల్) ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది.
జాతీయ విద్యుత్ ప్రణాళిక ముసాయిదా విడుదల
ఈనాడు, హైదరాబాద్: దేశంలో విద్యుత్ డిమాండ్, వినియోగం పెరుగుతున్నందున ఇంధన పొదుపుపై అందరూ దృష్టి పెట్టాలని జాతీయ విద్యుత్ ప్రణాళిక’ (ఎన్పీఎల్) ముసాయిదాలో కేంద్రం స్పష్టం చేసింది. 2022-32 మధ్యకాలంలో దేశ విద్యుత్ అవసరాల మేరకు చేపట్టాల్సిన చర్యలను వివరించింది. దీనిపై అభ్యంతరాలు, సూచనలను ఈ నెల 22లోగా పంపాలని ప్రజలకు, విద్యుత్ సంస్థలకు బుధవారం లేఖ రాసింది. ప్రస్తుతం దేశంలో ఒకరోజు గరిష్ఠ విద్యుత్ డిమాండ్ 2.05 లక్షల మెగావాట్లుండగా అది 2026-27 నాటికి 2.72 లక్షలు, 2031-32 నాటికి 3.63 లక్షల మెగావాట్లకు (ప్రస్తుత డిమాండ్ కంటే 77 శాతం అధికం) చేరుతుందని అంచనా.
* ప్రస్తుతం దేశంలో అన్ని రకాలు కలిపి 4 లక్షల మెగావాట్లకు పైగా స్థాపిత ఉత్పత్తి సామర్థ్యమున్న విద్యుత్కేంద్రాలున్నాయి. 1.65 లక్షల మె.వా. సామర్థ్యమున్న విద్యుత్కేంద్రాలు నిర్మాణంలో ఉన్నాయి. మొత్తంగా 2022-27 మధ్యకాలంలో 2,28,541 మె.వా, 2027-32 మధ్యకాలంలో మరో 2.43 లక్షల మె.వా, విద్యుత్కేంద్రాల నిర్మాణం పూర్తిచేయాలి. ఇందుకోసం రూ.14,30,718 కోట్లు పెట్టుబడులు పెట్టాలి. ఇందులో 75 శాతం రుణాలుగా తీసుకోవాలి.
* ఎన్నో ఏళ్లుగా విద్యుదుత్పత్తి చేస్తున్న 4,629 మె.వా. సామర్థ్యం గల 11 థర్మల్ కేంద్రాలు 2027 మార్చి నాటికి మూతపడనున్నాయి. అదే సమయానికి మరో 25,950 మె.వా. సామర్థ్యంతో నిర్మిస్తున్న 19 ప్లాంట్లు అందుబాటులోకి రానున్నాయి.
* తెలంగాణలోని దామరచర్ల వద్ద నిర్మిస్తున్న 4,000 మె.వా, యాదాద్రి, రామగుండంలో 1,600 మె.వా. ప్లాంటు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.
* మూతపడేవాటిలో ఆంధ్రప్రదేశ్లోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎన్టీటీపీఎస్)లోని మొత్తం ఆరు ప్లాంట్ల కాలం తీరనుంది. వీటి సామర్థ్యం 1260 మె.వా. ఇదే ప్లాంటులో 5వ దశ కింద నిర్మిస్తున్న 800 మె.వా. ఉత్పత్తి 2026-27లోపు ప్రారంభం కానుంది.
* 2031-32 నాటికి దేశంలో 17,770 మె.వా. ఉత్పత్తి సామర్థ్యమున్న పంప్డ్ స్టోరేజీ విద్యుత్కేంద్రాలను నిర్మించాలి. వీటిలో 9,150 మె.వా. కేంద్రాలు ఏపీలోనే నిర్మిస్తారని అంచనా.
* ఏపీలోని పోలవరం ప్రాజెక్టు వద్ద 960 మె.వా. జలవిద్యుత్కేంద్రం కూడా పూర్తికానుంది.
* ఏపీలో 38,440, తెలంగాణలో 20,410 మెగావాట్ల సౌరవిద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు అవకాశాలున్నాయి.
* దేశంలో విద్యుదుత్పత్తి వల్ల 2020-21లో 910 మిలియన్ టన్నుల (మి.ట) కర్బన ఉద్గారాలు వెలువడగా 2032 నాటికి 1180 మి.ట.లు వస్తాయని అంచనా.
* గత ఆర్థిక సంవత్సరం (2021-22) నాటికి మొత్తం దేశ విద్యుదుత్పత్తి 1492 బిలియన్ యూనిట్లలో సంప్రదాయేతర ఇంధనం వాటా 21.54 శాతముంది.
* దేశంలో మొత్తం 748 గిగావాట్ల సౌర విద్యుదుత్పత్తికి అవకాశాలున్నాయి.
* 2031-32 నాటికి దేశంలో సంప్రదాయేతర ఇంధన (ఆర్ఈ) కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 5.69 లక్షల మెగావాట్లకు చేరుతుందని అంచనా. అప్పటికి దేశంలోని మొత్తం విద్యుత్ డిమాండులో 45.09 శాతం దీని నుంచే రానుంది.
* 2022 మార్చి ఆఖరు నాటికి... తెలంగాణలో ఆర్ఈ కేంద్రాల స్థాపిత ఉత్పత్తి సామర్థ్యం 7439.12, ఏపీలో10,885.16 మెగావాట్లు ఉంది.
* ఆర్ఈ, థర్మల్ విద్యుత్ సరఫరాలో గ్రిడ్ నిర్వహణ సమర్థత కోసం బ్యాటరీ ఇంధన నిల్వ సదుపాయాలను పెంచాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత