Hyderabad Metro: మెట్రో రెండో దశ... 62 కి.మీ.
రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా టికెట్ ధరలు పెంచకూడదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను కోరామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇప్పటికే కేంద్రానికి డీపీఆర్లు ఇచ్చాం
బడ్జెట్లో రూపాయీ కేటాయించకుండా వివక్ష
శాసనమండలిలో పురపాలక మంత్రి కేటీఆర్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా టికెట్ ధరలు పెంచకూడదని హైదరాబాద్ మెట్రో రైలు సంస్థను కోరామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆర్టీసీ గరిష్ఠ ధరలకు మించి టికెట్ ధర ఉండకూడదన్న నిబంధనకు లోబడాలని, ధరలు పెరిగితే సామాన్య ప్రజలు ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు. కేంద్ర మెట్రో చట్టం ప్రకారం హైదరాబాద్ మెట్రోరైలు టికెట్ ధరల పెంపు అధికారాన్ని ప్రాజెక్టు సంస్థకే కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టిందని చెప్పారు. మెట్రోరైలు రెండోదశలో 62 కి.మీ. మార్గాన్ని నిర్మించనున్నామని కేటీఆర్ తెలిపారు. ఆదివారం శాసనమండలిలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మెట్రోరైలుపై అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘‘ఇప్పటికే మైండ్స్పేస్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 31 కి.మీ. మార్గానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఎల్బీనగర్ నుంచి నాగోలు (5కి.మీ), బీహెచ్ఈఎల్ నుంచి లక్డీకాపూల్ (26కి.మీ) మార్గానికి డీపీఆర్లు రూపొందించి కేంద్రానికి అందజేశాం. బెంగళూరు, చెన్నై, యూపీలో అయిదు నగరాలు, గుజరాత్లో గాంధీనగర్ మెట్రోకు వేలాది కోట్లు కేటాయించిన కేంద్రం తెలంగాణపై పగబట్టినట్లు హైదరాబాద్కు మాత్రం బడ్జెట్లో నిధులు ఇవ్వలేదు. మొదటిదశ రైలు ప్రాజెక్టు కింద వ్యయం రూ.1,455 కోట్లలో ఇప్పటికీ రూ.255 కోట్లు విడుదల చేయలేదు. కేంద్రం వివేకంతో ఆలోచించి హైదరాబాద్ మెట్రోకు నిధులు ఇవ్వాలి. శంషాబాద్ ఎయిర్పోర్టుకు మెట్రోరైలు అంటే.. ఇది ఎయిర్పోర్టు ప్రయాణికుల కోసమేనా అన్న సందేహాలు వస్తున్నాయి. కరోనా తరువాత చాలామంది నగరానికి దూరంగా శంషాబాద్, షాద్నగర్ వైపు వెళ్లి నివసిస్తున్నారు. ఈప్రాజెక్టు సాధారణ ప్రజలందరికీ ఉపయోగకరమైంది. రూ.6,250 కోట్లతో రాష్ట్రప్రభుత్వం సొంత నిధులతో మూడేళ్లలో ప్రాజెక్టు నిర్మిస్తుంది.
అక్కడ కార్యాచరణపై త్వరలోనే ప్రణాళిక..
హైదరాబాద్ అభివృద్ధి కోసం హిమాయత్సాగర్, గండిపేట చుట్టూ గ్రామాల ప్రజలకిచ్చిన హామీ మేరకు ప్రభుత్వం జీవో నం.111 రద్దుచేసి జీవో నం.69 తీసుకువచ్చింది. 1920లో నిర్మించిన ఆ జలాశయాలు కాలుష్యంబారిన పడకుండా ప్రణాళికను రూపొందిస్తాం. ఆ ప్రాంతంలో అభివృద్ధిపై ఏర్పాటైన కమిటీ మంత్రి, సీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే రెండుసార్లు సమావేశమైంది. త్వరలోనే పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక వెల్లడిస్తాం. రాష్ట్రంలో భవన నిర్మాణాల క్రమబద్ధీకరణ తెదేపా, కాంగ్రెస్ హయాంలో రెండుసార్లు జరిగింది. మూడోసారి క్రమబద్ధీకరణకు 2015లో జీవో జారీచేయగా కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసు ఈనెల 16న విచారణకు రానుంది. ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమించుకుని తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కట్టుకున్నవారికి జీవో నం.58 కింద ఉచితంగా క్రమబద్ధీకరించాం. హైదరాబాద్లోనే లక్ష మందికి పట్టాలిచ్చాం. పట్టణాల్లో భవనాల అనుమతుల్లో అవినీతి, అక్రమాలను నియంత్రించేందుకు టీఎస్బీపాస్ అమల్లోకి తీసుకువచ్చాం.’’ అని మంత్రి తెలిపారు. గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయులపై భారాన్ని తగ్గించేందుకు డిప్యూటీ వార్డెన్లను నియమించే అవకాశం లేదని ఎమ్మెల్సీ రఘోత్తమ్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి కొప్పుల సమాధానమిచ్చారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్ పాస్ల్లో రాయితీ పెంచే విషయాన్ని పరిశీలిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటివరకు 76.19 లక్షల మంది బీసీలకు ఉపకారవేతనాల కింద రూ.2,724 కోట్లు, బోధన ఫీజుల కింద రూ.52.8 లక్షల మందికి రూ.6,300 కోట్లు ఖర్చు చేశామని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. 2014 నాటికి 19 బీసీ గురుకులాలు ఉంటే.. ప్రస్తుతం ఆ సంఖ్యను సీఎం కేసీఆర్ 310కి పెంచారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?