దేశంలోనే గొప్ప క్షేత్రంగా కొండగట్టు
దేశంలో ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ బాగుందంటే.. అది కొండగట్టులోనే అనేలా ఇక్కడి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ అన్నారు.
ఎన్ని నిధులైనా వెచ్చిద్దాం
బృహత్తర ప్రణాళికతో కొత్తరూపు
అంజన్న ఆలయ అభివృద్ధిపై సమీక్షలో సీఎం కేసీఆర్
ఈనాడు, కరీంనగర్; న్యూస్టుడే- మల్యాల: దేశంలో ఆంజనేయస్వామి ఆలయం ఎక్కడ బాగుందంటే.. అది కొండగట్టులోనే అనేలా ఇక్కడి క్షేత్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేద్దామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘హనుమాన్ జయంతి ఇక్కడి క్షేత్రంలో గొప్పగా జరిగేలా.. దేశంలో సగం మంది భక్తులు ఈ దివ్యధామానికి వచ్చేలా ప్రాంగణాల్ని పూర్తిగా మార్చాలి. ఇప్పుడున్న ప్రధాన ఆలయం సహా పరిసరాల రూపురేఖల్ని మార్చేలా బృహత్తర ప్రణాళికను అమలు చేసి దేవాలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్దాలి’ అని అధికారులకు సూచించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి, హోదాలో తొలిసారిగా జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు క్షేత్రాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకోవడానికి ముందే హెలికాప్టర్ నుంచి పరిసరాలను గమనించారు. సిబ్బంది పూర్ణ కుంభ స్వాగతం పలికారు. సుమారు అరగంటపాటు ఆయన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ఉన్న ఉప ఆలయాలను దర్శించుకున్నారు. అర్చకులు శాలువా కప్పి, స్వామివారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను ఇచ్చి ఆశీర్వచనాల్ని అందించారు. తరువాత ఆలయ సమీపంలో సుమారు రెండు గంటలపాటు క్షేత్ర అభివృద్ధిపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆగమ శాస్త్రం ప్రకారం చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రముఖ ఆర్కిటెక్ట్ ఆనంద్సాయి ఇటీవల రూపొందించిన ప్రణాళికను, వివిధ మ్యాప్లను సీఎం పరిశీలించారు. వాస్తు నియమాలను అనుసరించి భక్తుల సౌకర్యార్థం ఆలయ పరిసరాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి సదుపాయాలు కల్పించాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. గుట్ట పైభాగంలో ఎకరం స్థలంలో ఉన్న గుడిని ఆధునికీకరించే ప్రణాళికను రూపొందించినట్లు అధికారులు చెప్పగా.. ఆ స్థలం సరిపోదని.. మూడెకరాల విస్తీర్ణం విధిగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.
మూలమలుపులను తొలగించాలి
‘‘ఎలాంటి ప్రమాదాలకు ఆస్కారం లేకుండా ప్రస్తుతం 1.8 కి.మీ.లు ఉన్న ఘాట్ రోడ్డును 3 కి.మీ.ల దూరం పెంచి మూలమలుపులను తొలగించాలి. జేఎన్టీయూ మీదుగా వచ్చే రహదారి వెడల్పుని ఇప్పుడున్న 7 మీటర్ల నుంచి 14 మీటర్లకు విస్తరించండి. ఈ రెండింటినీ పాత పుష్కరిణి వరకు పొడిగించాలి. సువిశాలమైన ప్రధాన ద్వారాన్ని నిర్మించాలి. అంజనాద్రి పేరుతో వేద పాఠశాలను ఏర్పాటు చేసేందుకు తగిన స్థలాన్ని ప్రణాళికలో పొందుపర్చాలి.
విద్యుత్తు ఉపకేంద్రం, దవాఖానా, ప్రయాణ ప్రాంగణం, అగ్నిమాపక కేంద్రం, కాటేజీలు, పోలీస్స్టేషన్, దీక్షా విరమణ మండపం పక్కనే కల్యాణకట్ట ఏర్పాటు చేయండి. గుట్టపై తాగునీటి వసతిని మెరుగుపర్చేలా సమీపంలోని సంతోల్ల లొద్ది నుంచి కొండపైకి నిరంతర నీటి సరఫరా చేపట్టాలి. అవసరమైతే వరద కాలువ ద్వారా కాళేశ్వర జలాలను గుట్టపైకి తెండి. మానసిక రోగులు ఉండేందుకు వీలుగా కేర్ టేకర్లతో కూడిన భవనాన్ని నిర్మించాలి. అటవీశాఖ అధికారులూ.. ఇక్కడి అభయారణ్యంపై తగిన దృష్టి పెట్టండి. అవసరమైనన్ని ఔషధ మొక్కలను నాటించాలి. మైసూర్ - ఊటీ మార్గంలోని నీలగిరి కొండల్లోని బందీపుర్ అభయారణ్యం మాదిరిగా మార్చండి.
త్వరలో మళ్లీ వస్తా...
వారం, పది రోజుల్లో మళ్లీ కొండగట్టుకు వస్తా. రాత్రి వేళ ఇక్కడే ఉండి అభివృద్ధిపై సమీక్షిస్తా. మూడేళ్లలో ఇక్కడి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చొరవ చూపిస్తా. అర్చకుల కోసం ఇళ్లను కట్టిస్తాం’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. సమీక్ష నిర్వహించే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో కుర్చీలను వేసి వేదికను ఏర్పాటు చేయడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వేదిక పైకి వెళ్లకుండా ముందు భాగంలో కుర్చీలో ఆసీనులై అధికారులు, ప్రజాప్రతినిధులతో చర్చించారు.
సమీక్ష నిర్వహణ సమయంలో ఆర్కిటెక్ట్ ఆనంద్సాయిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. మైక్ ద్వారా ఉన్నతాధికారులు పిలవడంతో పోలీసులు ఆయన్ని లోపలికి పంపించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, రాజ్యసభ సభ్యుడు దామోదర్రావు, ఎమ్మెల్సీలు ఎల్.రమణ, భానుప్రసాద్, ఎమ్మెల్యేలు రవిశంకర్, సంజయ్కుమార్, రసమయి బాలకిషన్, బాల్క సుమన్, జీవన్రెడ్డి తదితరులు ఉన్నారు.
వెయ్యి కోట్లయినా...
యాదాద్రి ఆలయానికి మించిన స్థలం ఇక్కడి గుట్ట ఆవరణలో ఉంది. సమీప భవిష్యత్తులో ప్రపంచాన్ని ఆకర్షించే గొప్ప ధార్మిక క్షేత్రంగా కొండగట్టును మార్చాలి. ఇందుకోసం ఇప్పటికే ప్రకటించిన రూ.100 కోట్లు కాకుండా అవసరమైతే మరో రూ.600 కోట్ల నుంచి రూ.వెయ్యి కోట్లను కేటాయించుకుందాం.
ఎంతో గొప్ప చరిత్ర ఉన్న ఆలయమిది. ప్రకృతి రమణీయత ఉట్టిపడేలా ఉన్న ఇక్కడి గుట్టకు లక్షల భక్తులు వచ్చేలా రూపురేఖల్ని మార్చాలి. దీక్షాపరులు ఒకేసారి 50వేల మంది వచ్చినా.. బస చేయడానికి.. మాల విరమణ చేయడానికి వసతి ఉండాలి. ఆలయానికి దగ్గరగా 86 ఎకరాల్లో సువిశాలమైన పార్కింగ్ను ఏర్పాటు చేయండి. ఇక్కడి పచ్చదనం, పర్యావరణాన్ని ఎట్టి పరిస్థితుల్లో దెబ్బతీయకూడదు. చెట్ల మధ్యనే భక్తుల కోసం అతిథి గృహాల నిర్మాణం చేపట్టాలి.
వైష్ణవ సంప్రదాయాన్ని అనుసరించి గర్భాలయం మినహా మిగతా ఆలయాన్ని పునర్నిర్మాణంతో విస్తరించాలి. యాదాద్రి ఆలయ నిర్మాణ సమయంలో సూక్ష్మ పరిశీలన, విస్తృతస్థాయి సమావేశాలు చేపట్టాం. అదే మాదిరిగా ఇక్కడి అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడదాం. తిరుమల పుణ్యక్షేత్రాన్ని గుర్తుచేసేలా ఇక్కడి ప్రాంగణాల్ని తీర్చిదిద్దాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. -
మావోయిస్టు నేతలపై రివార్డు
మావోయిస్టు అగ్రనేతల తలలకు రాష్ట్ర పోలీసులు వెల కట్టారు. వారి ఆచూకీ చెబితే లక్షల్లో రివార్డు ఇస్తామని ప్రకటించారు. -
కందులకు గరిష్ఠ ధర రూ.11,246
సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో కందులకు మంచి ధర పలుకుతోంది. మంగళవారం రైతులు మార్కెట్కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలికింది. -
సాగర్ నుంచి ఏపీకి నీటి విడుదల నిలిపివేత
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఆంధ్రప్రదేశ్కు మంగళవారం రాత్రి నుంచి నీటి విడుదల నిలిపివేస్తున్నట్లు కృష్ణా బోర్డు ఆ రాష్ట్ర ఈఎన్సీకి సమాచారం అందజేసింది. -
చెరువుల పరిరక్షణకు తీసుకున్న చర్యలేంటి?: హైకోర్టు
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలో చెత్త, నిర్మాణ వ్యర్థాలతో నిండిపోతున్న జల్పల్లి, ఉమ్దాసాగర్ చెరువులతోపాటు ఇతర చెరువుల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హైకోర్టు ప్రభుత్వానికి మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
కోర్టు ఆవరణలో నిందితులకు సంకెళ్లపై వివరణ ఇవ్వండి
రంగారెడ్డి జిల్లా కూకట్పల్లి జిల్లా కోర్టు ఆవరణలో నిందితులకు పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. -
రేకుల డబ్బాలు కావు.. నివాస గృహాలే!
ఇక్కడ కనిపిస్తున్నవి రేకుల డబ్బాలు అనుకుంటే పొరపాటే. అవి నివాస గృహాలే. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలోని పేదలకు 2008లో అప్పటి ప్రభుత్వం పేదలకు నివాస స్థలాల పట్టాలు పంపిణీ చేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యానిమేషన్ సినీ కథా రచయిత ఆత్మహత్య
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్