ప్రకృతి ప్రకోపం.. నష్టం అపారం
ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కరవు, కొండ చరియలు విరిగిపడటం తదితర విపత్తుల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది.
22 ఏళ్లలో కోల్పోయిన ఆస్తి రూ.12 లక్షల కోట్లు
86 వేల మంది కన్నుమూత
కరవు రాష్ట్రాల జాబితాలో తెలంగాణ, ఏపీ
ఆధునిక సాంకేతికత మరింత వినియోగంతోనే విపత్తుల నివారణ
పలువురు శాస్త్రవేత్తల వెల్లడి
ప్రకృతి వైపరీత్యాలతో దేశానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వరదలు, తుపాన్లు, భూకంపాలు, కరవు, కొండ చరియలు విరిగిపడటం తదితర విపత్తుల వల్ల భారీగా ఆస్తి, ప్రాణనష్టం సంభవిస్తోంది. గత 22 ఏళ్లలో రూ.12 లక్షల కోట్ల ఆస్తినష్టం వాటిల్లగా.. 86 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఇటీవల కాలంలో నగరాలను వరదలు ముంచెత్తడం సమస్యగా మారింది. వరద తీవ్రతను ముందుగానే అంచనా వేస్తూ., హెచ్చరికలు జారీ చేస్తూ, ముంపునకు గురయ్యే ప్రాంతాల నుంచి ముందుగా ప్రజలను ఖాళీ చేయిస్తూ.. వివిధ శాఖలు సమన్వయంతో వ్యవహరిస్తున్నా ఎంతో కొంత నష్టం సంభవిస్తూనే ఉంది. దీన్ని నివారించడానికి ఆధునిక సాంకేతికతను మరింత ఎక్కువగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని పలువురు శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇటీవల హైదరాబాద్లో రెండు రోజులపాటు జరిగిన సదస్సులో వారు పలు అంశాలపై చర్చించారు. వరదల వల్ల ఆస్తినష్టం, ప్రాణనష్టం ఎక్కువగా ఉంటే, దేశంలో 65 శాతం భూభాగంలో కరవు ప్రధాన సమస్యగా ఉందని, వివిధ రంగాల నిపుణులు తమ ప్రజెంటేషన్లో పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాల ముందస్తు చర్యలు, వాటిల్లిన నష్టంపై ఇస్రో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, కేంద్ర జలసంఘం, జాతీయ విపత్తు నివారణ సంస్థలు చర్చించాయి. మరింత ముందుగానే తీవ్రతను గుర్తించడం, సమాచారాన్ని చేరవేయడం పైన, సమస్య తీవ్రతపైన పలువురు శాస్త్రవేత్తలు ఇచ్చిన ప్రజెంటేషన్లపై ఉన్నతస్థాయి అధికారులందరూ పాల్గొని చర్చించారు.
సాగుభూముల్లో కరవు అధికం
ప్రకృతి వైపరీత్యాలప్పుడు 12 శాతం భూభాగం వరదలకు గురైతే, తీర ప్రాంతంలో 8 శాతం తుపాన్లకు, భూకంప ప్రభావిత ప్రాంతంగా గుర్తించిన దానిలో 25 శాతం, సాగు భూమిలో 65 శాతం కరవుకు గురైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రపంచంలో వరదల బారిన పడే దేశాల్లో భారత్ది రెండో స్థానం. వరదల గురించి ముందస్తుగా చేస్తున్న హెచ్చరికల్లో 87 శాతం కచ్చితత్వం ఉంటోంది. కరవు ప్రభావానికి గురయ్యే రాష్ట్రాలు దేశంలో 17 ఉండగా, ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అత్యధికంగా ఒడిశాలో 98 తీవ్ర తుపాన్లు రాగా.. గత మూడేళ్లలో ఏడుసార్లు తుపాన్లు విరుచుకుపడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 79 సంభవించాయి. గత 25 ఏళ్లలో 13 సార్లు తుపాన్లు, 8 సార్లు వడగాలులు తీవ్ర స్థాయిలో వచ్చాయి. వీటి తీవ్రతను ముందుగానే మరింత కచ్చితంగా అంచనా వేయడానికి శాటిలైట్ బేస్-2, ఎక్స్ బాండ్, సి బాండ్ విస్తరణ, డ్యూయల్ పోల్ రాడార్ నెట్వర్క్, హై రిజల్యూషన్ టెర్రెయిన్ డేటాతో సహా ఏమేం చేయాలో కూడా సమావేశాల్లో చర్చించారు.
నగరాల మునకపై ప్రత్యేక చర్చ
నగరాలు నీట మునగడం సవాలుగా మారిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యల గురించి శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా చర్చించారు. గత ఒకటిన్నర దశాబ్దంలోనే చెన్నై, హైదరాబాద్, ముంబయి, పుణె, దిల్లీ, కోల్కతా తదితర నగరాలు నీటమునిగి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నాయి. పట్టణీకరణ, రోడ్లు, భవన నిర్మాణాల్లో ఆక్రమణలు, నీటి ప్రవాహ మార్గాలు లేకపోవడం, డ్రైనేజీ సౌకర్యం లేమి, మౌలిక వసతుల కరవు, దిగువ ప్రాంతాలు నీటమునగడం ఇలా అనేక కారణాలున్నాయి. ఈ సమస్యలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు, సాంకేతికత గురించి కూడా చర్చించారు.
ఈనాడు హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని