Vizag: ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’.. ‘జనజాగరణ సమితి’ పేరుతో విశాఖలో పోస్టర్లు

‘గో బ్యాక్‌ సీఎం సార్‌’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అంటూ విశాఖలో గురువారం ఉదయం పోస్టర్లు వెలిశాయి.

Updated : 17 Mar 2023 10:19 IST

ఈనాడు-విశాఖపట్నం: ‘గో బ్యాక్‌ సీఎం సార్‌’, ‘రాజధాని అమరావతిని నిర్మించండి’ అంటూ విశాఖలో గురువారం ఉదయం పోస్టర్లు వెలిశాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయంతోపాటు పలు ప్రధాన కూడళ్లలో ‘జన జాగరణ సమితి’ పేరుతో ఈ ఫ్లెక్సీలను తెల్లవారుజామున ఏర్పాటుచేశారు. జగదాంబ, మద్దిలపాలెం, సిరిపురం, ఆశిల్‌మెట్ట కూడళ్లలో పోస్టర్లున్న విషయం తెలుసుకున్న కొందరు వైకాపా నాయకులు వాటిని తొలగించారు. విశాఖనుంచి త్వరలో పరిపాలన కొనసాగిస్తామన్న ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఏర్పాటుచేసిన ఈ పోస్టర్లు నగరంలో కలకలం సృష్టించాయి. విశ్వవిద్యాలయ క్యాంపస్‌ ప్రశాంతతకు భంగం కలిగించేందుకు అవకాశమున్న ఈ పోస్టర్ల ఏర్పాటు వెనుక ఉన్నవారిని అరెస్టు చేయాలంటూ మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఏయూ అధికారులు ఫిర్యాదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని