ప్చ్.. మళ్లీనా...!
టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు ఉద్యోగ పరీక్షలు రద్దవడంతో ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
గ్రూప్-1 మెయిన్స్కు అర్హత సాధించిన అభ్యర్థుల్లో కలవరం
తుది పరీక్ష తర్వాత తాత్కాలిక కొలువుల్లో చేరాలనే ప్రణాళిక
ప్రిలిమ్స్ రద్దుతో అంతా తారుమారు
ఆర్థిక భారంపై తీవ్ర ఆందోళన
ఈనాడు, హైదరాబాద్: టీఎస్పీఎస్సీలో ప్రశ్నపత్రాల లీకేజీతో గ్రూప్-1తోపాటు మొత్తం నాలుగు ఉద్యోగ పరీక్షలు రద్దవడంతో ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ సాధించిన వారు ఆర్థిక భారాన్ని తలచుకుని కలవరం చెందుతున్నారు. మానసికంగానూ ఇబ్బంది పడుతున్నారు. మరో మూడు నెలల్లో మెయిన్స్ పూర్తవుతుంది. కచ్చితంగా కొలువు సాధిస్తామన్న విశ్వాసంతో చదువుతున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. ‘మళ్లీ ప్రిలిమ్స్ రాయాలా? ఒకవేళ పొరపాటున గట్టెక్కలేకుంటే ఎలా? ఈ మధ్యలో ఇంకెన్ని పరిణామాలు సంభవిస్తాయో?’ అనే ప్రశ్నలు వారిని వెంటాడుతున్నాయి. మరోవైపు హైదరాబాద్లో ఉంటూ సన్నద్ధం కావాలంటే ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని వాపోతున్నారు.
హైదరాబాద్లో హాస్టల్లో ఉండి సిద్ధమవ్వాలంటే నెలకు అన్నీ కలిపి రూ.10 వేల ఖర్చు తప్పదని చెబుతున్నారు. నలుగురు కలిసి గది అద్దెకు తీసుకుంటే కొంత తగ్గుతుంది. వారిప్పుడు కనీసం మరో ఆరు నెలలు అదనంగా ఉండక తప్పదు. ఇక ప్రిలిమ్స్ నెగ్గలేదని వెనక్కి వెళ్లిన వారు మళ్లీ సిద్ధమవుతారు. ఇలాంటి వారు చాలామంది హైదరాబాద్కు చేరుకుంటారు. అంటే వారంతా మళ్లీ ఖర్చు పెట్టాల్సిందే. ‘పరీక్షల రద్దుతో శిక్షణ సంస్థలు, హాస్టళ్లు, పుస్తకాల రచయితలు, వాటి పబ్లిషర్లు, వాటిని విక్రయించే వారికి మాత్రం లాభమే’ అని గాంధీనగర్లో ఉంటున్న పలువురు నిరుద్యోగులు వ్యాఖ్యానించారు.
జిల్లాలకు వెళ్లే ఆలోచనలో...
4 పరీక్షలు రద్దవడంతో అనేక మంది సొంత జిల్లాలకువెళ్లే ప్రయత్నాల్లోఉన్నారు. కొందరు ఇప్పటికే వెళ్లిపోయారు. గ్రూప్-1, 2లను సాధించాలన్న లక్ష్యంతో సంగారెడ్డి జిల్లాలో ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు(46)గా పనిచేస్తున్న ఒకరు ఉద్యోగానికి సెలవు పెట్టి కుటుంబంతోసహా హైదరాబాద్ వచ్చారు. తాజా పరిణామంతో ఆయన ఉద్యోగంలో చేరేందుకు వెళ్లిపోయారు. వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి 20 మంది ఉండే హాస్టల్లో ఏడాది కాలంగా ఉంటున్నారు. అక్కడ ఒక్కటే టాయిలెట్ ఉండేది. అపరిశుభ్రంగా ఉన్నా లక్ష్యం కోసం భరించారు. ఇప్పుడు ఆయన వెనక్కి వెళ్లిపోయారు. ‘కొందరు గృహిణులు పిల్లల్ని, భర్తను వదిలి గ్రూప్స్ లక్ష్యంతో హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు భర్త అర్థం చేసుకున్నా అత్తామామలు అర్థం చేసుకోకుంటేనే పరీక్షలపై సరిగ్గా దృష్టి సారించగలరు’ అని శిక్షణ నిపుణుడు ఒకరు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ నగరంలోని గ్రంథాలయాల్లోనూ రెండు రోజులుగా నిరుద్యోగ అభ్యర్థుల హాజరు శాతం తగ్గింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో నిరాశకు గురికాకుండా మరింత పట్టుదలతో చదవాలని అభ్యర్థులకు శిక్షణ నిపుణుడు కృష్ణ ప్రదీప్ సూచించారు.
రెండేళ్లుగా అప్పులతో గడుపుతున్నాం
- రమేష్రెడ్డి, గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థి
మాది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం. జూనియర్, డిగ్రీ అధ్యాపక ఉద్యోగాలను దక్కించుకోవాలన్న లక్ష్యంతో 2013లోనే స్లెట్, నెట్ అర్హత సాధించా. 2012 తర్వాత ఒక్క నోటిఫికేషన్ రాలేదు. ఇంటర్ విద్యార్థులకు ట్యూషన్లు చెబుతూ వస్తున్నా. గ్రూప్ పరీక్షలపై ఆసక్తి ఉండటంతో 2020 చివరి నుంచి సన్నద్ధమవుతున్నా. నా భార్యతో కలిసి హైదరాబాద్లోనే ఉంటున్నా. ఈ రెండేళ్లగా ఉద్యోగం చేయకపోవడంతో అప్పులు తెచ్చి గడుపుతున్నాం. జూన్లో మెయిన్స్ పూర్తయితే ఫలితాలు వచ్చే వరకు జూనియర్ లెక్చరర్గా చేరదామనుకున్నా. ఇప్పుడు మళ్లీ చదవాలి.
నిద్ర పట్టడం లేదు
- అమిత, నారాయణపేట జిల్లా
నేను జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నా. గ్రూప్-1 లక్ష్యంగా ఉద్యోగానికి సెలవు పెట్టి, ఏడాది నుంచి హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నా. ప్రిలిమ్స్లో నెగ్గా. మెయిన్స్లోనూ ర్యాంకు సాధించి ఎంపికవుతానన్న నమ్మకముంది. లీకేజీ కారణంగా నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు సెలవు రద్దు చేసుకుని, జిల్లాకు వెళ్లిపోవాలా? ఇక్కడే ఉండాలా? అనేది తేల్చుకోలేకపోతున్నా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ను ఓడించిన బెంగళూరు.. ఎట్టకేలకు రెండో విజయం
-
30 వైడ్ బాడీ విమానాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా