ఊబకాయులూ తస్మాత్ జాగ్రత్త!
సాధారణంగానే ఊబకాయుల్లో క్యాన్సర్ ముప్పు అధికం. దీనికితోడు నియంత్రణలో లేని అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండడం, నడుము చుట్టుకొలతలు తగ్గకపోవడం... వంటి జీవక్రియ రుగ్మతలు (మెటబాలిక్ సిండ్రోమ్) కూడా జతకూడితే... మహమ్మారి వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
జీవక్రియ రుగ్మతలు తోడైతే క్యాన్సర్ ముప్పు రెట్టింపు
విజరల్ కొవ్వు కణజాలం మహమ్మారి వృద్ధికి కారణమవుతోంది
స్వీడన్ తాజా పరిశోధనలో వెల్లడి
ఆరోగ్య స్పృహ, పోషకాహారం, అప్రమత్తతలే శ్రీరామరక్ష
డాక్టర్ రాకేశ్ కలపాల సూచనలు
ఈనాడు - హైదరాబాద్
సాధారణంగానే ఊబకాయుల్లో క్యాన్సర్ ముప్పు అధికం. దీనికితోడు నియంత్రణలో లేని అధిక రక్తపోటు, మధుమేహం, చెడు కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్లు ఎక్కువగా ఉండడం, నడుము చుట్టుకొలతలు తగ్గకపోవడం... వంటి జీవక్రియ రుగ్మతలు (మెటబాలిక్ సిండ్రోమ్) కూడా జతకూడితే... మహమ్మారి వచ్చే ముప్పు రెట్టింపు అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు రెండూ ఉన్న వారిలో ‘విజరల్ కొవ్వు కణజాలం (విజరల్ ఎడిపోస్ టిష్యూ) అధికంగా ఉంటుందనీ, ఇది క్యాన్సర్ కణాల వృద్ధికి కారణం అవుతుందని చెబుతున్నారు. ఈ అంశాన్ని స్వీడన్లో నిర్వహించిన పరిశోధన వెల్లడించింది. ఆ దేశంలోని లుండ్ యూనివర్సిటీ పరిశోధకులు దాదాపు 40 ఏళ్లపాటు స్వీడన్, నార్వే, ఆస్ట్రియా దేశాలకు చెందిన సుమారు 8లక్షల మందితో ఈ అధ్యయనం నిర్వహించారు. ప్రధానంగా శరీరం ఎత్తుకు తగిన బరువు(బాడీ మాస్ ఇండెక్స్), జీవక్రియ రుగ్మతల కోణంలోనే అధ్యయనం కొనసాగింది. వీరి పరిశీలనలో ఊబకాయంతోపాటు జీవక్రియ రుగ్మతలతో బాధపడుతున్న వారిలో 23,630 మంది క్యాన్సర్ బారిన పడినట్లుగా గుర్తించారు. ఈ పరిశోధక పత్రం ఇటీవలే ‘జర్నల్ ఆఫ్ ది నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్’లో ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో ఊబకాయం, జీవక్రియ రుగ్మతలు బాధితులు మహమ్మారి కోరల్లో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సీనియర్ కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, సెంటర్ ఫర్ ఒబెసిటీ అండ్ మెటబాలిక్ సైన్సెస్ డైరెక్టర్(ఏఐజీ హాస్పిటల్స్) డాక్టర్ రాకేశ్ కలపాల ‘ఈనాడు’కు వివరించారు.
రాష్ట్రంలో ఏటేటా పెరుగుతున్న కేసులు
తెలంగాణలో ఏటేటా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్లు ఐసీఎంఆర్ ఇటీవల విడుదల చేసిన నివేదిక స్పష్టం చేస్తోంది. 2020 సంవత్సరంలో 47,620 కొత్త క్యాన్సర్ కేసులు నమోదవగా.. 26,038 మంది చనిపోయారు. 2021లో 48,775 మంది కొత్తగా మహమ్మారి బారినపడగా.. 26,681 మంది బలయ్యారు. 2022లో 49,983 మంది క్యాన్సర్ కోరల్లో కొత్తగా చిక్కుకోగా.. 27,339 మంది కన్నుమూశారు. ప్రతి 9మంది భారతీయుల్లో ఒకరు తన 74 ఏళ్ల వయసుకొచ్చేసరికి ఏదో ఒక క్యాన్సర్ బారిన పడుతున్నట్లు ఐసీఎంఆర్ నివేదిక స్పష్టంచేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో జీవక్రియ రుగ్మతల బాధితులూ పెరుగుతున్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఇటీవల విడుదల చేసిన ‘తెలంగాణ రాష్ట్ర పౌష్టిక ముఖచిత్రం’లో గత ఐదేళ్ల కాలంలో మహిళలు, పురుషుల్లో 8% చొప్పున అధిక రక్తపోటుతో బాధపడే వారు పెరిగారు. 2019-20 గణాంకాల ప్రకారం... 15-49 ఏళ్ల మధ్యవయస్కులైన మహిళల్లో 20% మంది, పురుషుల్లో 27% మంది అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. ఇదే వయస్కుల్లో మహిళల్లో 6%, పురుషుల్లో 7% చొప్పున షుగర్ వ్యాధిగ్రస్తులున్నట్లు నమోదైంది. ఇదేకాలంలో మహిళలు 30%, పురుషులు 32% మంది ఊబకాయం బారినపడినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ప్రమాదకరంగా విజరల్ కొవ్వు కణజాలం
అవయవాల మధ్య ఉండే కొవ్వు పదార్థాన్ని విజరల్ కొవ్వు కణజాలం అంటారు. ఇది మనిషి శరీరంలోని అనేక సాధారణ, రోగ ప్రక్రియలను ప్రభావితం చేసే ప్రత్యేకమైన జీవ రసాయన లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎక్కువగా ఉన్న వారిలో జీవక్రియ రుగ్మతలు కూడా తోడైతే... క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఎందుకంటే.. వీరిలో ‘ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్లు’ అధికంగా ఉత్పత్తి అవుతాయి. వీటివల్ల దీర్ఘకాలంగా నిశ్శబ్దంగా ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. ఇలాంటప్పుడు ఈ కొవ్వు కణజాలం ఎక్కువగా ఉన్న వారిలో తల నుంచి పాదం వరకు ఏ అవయవంలోనైనా క్యాన్సర్ కణాలు వృద్ధి చెందే ప్రమాదం పెరుగుతుంది. మరో ముఖ్యవిషయం... సన్నగా ఉన్నా మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న వారిలో క్యాన్సర్ ముప్పు ఎక్కువ. ఉదాహరణకు కొందరు సన్నగా ఉన్నా కూడా వీరిలో కాలేయంపై కొవ్వు(ఫ్యాటీ లివర్) పేరుకుపోతుంది. ఫ్యాటీ లివర్ దీర్ఘకాలంగా ఉన్న వారికి కాలేయ క్యాన్సర్ రావడాన్ని నిపుణులు గుర్తించారు.
పోషకాహారమే పరమౌషధం
జీవక్రియ రుగ్మతలున్న వారు ఎట్టిపరిస్థితుల్లోనూ రక్తపోటును, మధుమేహాన్ని, కొలెస్ట్రాల్ను అదుపులో పెట్టుకోవాలి. క్రమం తప్పకుండా వైద్యులను సంప్రదించాలి. ఎప్పటికప్పుడు సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ‘హోమియోస్టాసిస్ మోడల్ అసెస్మెంట్-ఎస్టిమేటెడ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్(హోమా ఐఆర్)’ అనేది ముఖ్యమైన పరీక్ష. దీని ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎంతుందనేది తెలుస్తుంది. అప్పుడు సమస్యను అంచనా వేయొచ్చు. అత్యంత ముఖ్యంగా ఊబకాయులు బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. కంటి నిండా నిద్రపోవాలి. ఒత్తిడి, ఆందోళన తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లను అలవర్చుకోవాలి. ప్రధానంగా యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు తదితర ఆహారాలను తీసుకోవాలి. వీటి వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. వీటిలో మైక్రోన్యూట్రియెంట్లు, పీచు చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే విటమిన్ ఎ, సి, ఈ, ఫోలిక్యాసిడ్, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటివి అధికంగా ఉంటాయి. చేపలు, సముద్ర ఆహారం ద్వారా విటమిన్ డి లభ్యమవుతుంది. ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు కూడా వీటిలో ఎక్కువ. ఈ ఆహారం యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. విటమిన్ ఎ, సి, ఈ, డిలు శ్వాస కోశ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో బాగా ఉపయోగపడతాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి..
భారాస నుంచి ఎన్నికైన స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలన్న పిటిషన్లను ప్రభుత్వ న్యాయవాది ద్వారా స్పీకర్ కార్యాలయానికి పంపాలని ఎమ్మెల్యే వివేకానంద్ తరఫు న్యాయవాదికి హైకోర్టు సూచించింది. -
సివిల్స్ ర్యాంకర్లకు రాజ్భవన్లో సత్కారం
సివిల్ సర్వీసెస్ అదికారులు ప్రజా సేవకు అంకితమవ్వాలని, చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పిలుపునిచ్చారు సమాజానికి మేలు చేయడానికి వెనుకడుగు వేయవద్దని సూచించారు. -
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
వేసవిలో ప్రయాణికుల దాహార్తిని తీర్చేలా.. నేరుగా బస్సుల్లోకే వెళ్లి మొబైల్ తాగునీటి సేవలందిస్తోంది శ్రీ సత్యసాయి సంస్థ. -
ప్రాణాలైనా ఇస్తాం కానీ భూములు ఇవ్వం
హనుమకొండ జిల్లా దామెర మండలం ఊరుగొండలోని 163వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా చేశారు. -
కీలకమైన ఖనిజాల అన్వేషణకు ఎన్జీఆర్ఐ, కేఏబీఐఎల్ మధ్య ఒప్పందం
ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక విద్యుత్తు శక్తి, రక్షణ, టెలికమ్యూనికేషన్స్ వంటి రంగాల్లో విడిభాగాల తయారీకి అవసరమయ్యే కీలకమైన ఖనిజాల వెలికితీతకు హైదరాబాద్లోని జాతీయ భూ భౌతిక పరిశోధన సంస్థ(ఎన్జీఆర్ఐ), ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్(కేఏబీఐఎల్) మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. -
మధు యాస్కీ గౌడ్కు సీఎం సహా మంత్రుల పరామర్శ
పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్ మధు యాస్కీ గౌడ్ను గురువారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరామర్శించారు. -
జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు విద్యుత్ బస్సులు
రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) క్రమక్రమంగా ఎలక్ట్రిక్ బస్సుల బాట పడుతోంది. ఇప్పుడు దాదాపు 105 విద్యుత్ బస్సులు తిరుగుతుండగా.. మరో వెయ్యిపైచిలుకు రోడ్డెక్కించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. -
ఆగని కోకో దూకుడు..!
కోకో గింజల ధర రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. పన్నెండు రోజుల కిందట రూ.900 పలికిన కిలో కోకో గింజల ధర తాజాగా రూ.1000కి చేరింది. -
ఎక్సైజ్ అధికారులకు బదిలీల్లో మినహాయింపుపై హైకోర్టు తీర్పు వాయిదా
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఇవ్వడాన్ని తప్పుబడుతూ దాఖలైన పిటిషన్పై విచారించిన హైకోర్టు గురువారం తీర్పును వాయిదా వేసింది. -
యూటీఎస్ యాప్ పరిధి పెంపు
కొన్నిసార్లు రైలు ప్రయాణానికి జనరల్ టికెట్ దొరకడం చాలా కష్టం. ప్రధానంగా వేసవి సెలవులు, పండగలప్పుడు కౌంటర్ల వద్ద వరుసలో గంటల తరబడి నిల్చోవాల్సి రావడం.. ఈలోపు రైలు బయలుదేరడం చాలామందికి అనుభవమే. -
సికింద్రాబాద్ నుంచి సంత్రాగచ్చికి జనరల్ బోగీల రైళ్లు
సికింద్రాబాద్ నుంచి కోల్కతా సమీపంలోని సంత్రాగచ్చి రైల్వేస్టేషన్కు రానుపోను పదేసి ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు ద.మ.రైల్వే ఒక ప్రకటనలో తెలిపింది. -
జేఈఈ మెయిన్లో నారాయణ హవా
జేఈఈ మెయిన్ ఫలితాల్లో ఆలిండియా ఓపెన్ కేటగిరీలో 6 (1, 5, 6, 7, 8, 10) ర్యాంకులను తమ విద్యార్థులు సాధించి మరోసారి సత్తా చాటారని నారాయణ విద్యాసంస్థల మేనేజింగ్ డైరెక్టర్లు సింధురానారాయణ, శరణినారాయణ గురువారం తెలిపారు. -
‘ఉల్లాస్ నవభారత్ సాక్షరత’గా పేరు మార్పు
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా మార్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘న్యూ ఇండియా లిటరసీ ప్రోగ్రాం’ పథకం అమలులో భాగంగా వివిధ రాష్ట్రాలు తమ సౌకర్యాన్ని బట్టి పేర్లను మార్చుకున్నాయి. -
జేఈఈ మెయిన్స్లో గురుకుల విద్యార్థుల ప్రతిభ
జేఈఈ మెయిన్స్లో గురుకుల సొసైటీల విద్యార్థులు ప్రతిభ చూపారు. ఎస్సీ గురుకుల సొసైటీ నుంచి 462 మంది జేఈఈ అడ్వాన్స్డ్కు అర్హత సాధించారని సొసైటీ కార్యదర్శి సీతాలక్ష్మి గురువారం తెలిపారు. -
ఏఈ పోస్టుల జనరల్ ర్యాంకు జాబితా వెల్లడి
రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో అభ్యర్థుల ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీజీపీ రవిగుప్తాకు పరిహారం చెల్లించండి
పనిచేయని రిక్లైనర్ సీటును కేటాయించి తీవ్ర అసౌకర్యం కలిగించడం, బిజినెస్(జెడ్) క్లాస్ టికెట్లో ఎకానమీ క్లాస్ సేవలందించిన నేపథ్యంలో డీజీపీ దంపతులకు రూ.2,07,500 పరిహారం చెల్లించాలని సింగపూర్ ఎయిర్లైన్స్ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-3 ఆదేశించింది. -
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని