తెలంగాణ యువత సవాళ్లు ఎదుర్కొంటోంది
‘తెలంగాణ యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, విజయం సాధించే ధైర్యం వారికి ఉందని నేను భావిస్తున్నా.. రాజ్భవన్ మీ వెంట ఉంది’ అని గవర్నర్ తమిళిసై అన్నారు.
యువ ఉగాది ఉత్సవాల్లో గవర్నర్ తమిళిసై
ఖైరతాబాద్, న్యూస్టుడే: ‘తెలంగాణ యువత అనేక సవాళ్లను ఎదుర్కొంటోంది. వీటిని అధిగమించి, విజయం సాధించే ధైర్యం వారికి ఉందని నేను భావిస్తున్నా.. రాజ్భవన్ మీ వెంట ఉంది’ అని గవర్నర్ తమిళిసై అన్నారు. సోమవారం రాత్రి రాజ్భవన్లో శోభకృత్ నామ సంవత్సర ‘యువ ఉగాది ఉత్సవాలు’ ఘనంగా నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ.. యువత బలిదానాలతోనే రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. రాజ్భవన్ సీపీఆర్ ఛాలెంజ్, రక్తదాన శిబిరాలు, గిరిజన సంక్షేమం వంటి సామాజిక సేవా కార్యక్రమాలను చేపడుతోందన్నారు. యువత రాజ్భవన్ కార్యక్రమాల్లో భాగస్వాములవ్వాలని కోరారు. ఆత్మనిర్భర్ భారత్, స్వచ్ఛభారత్ వంటివి ముందుకు తీసుకెళ్లాలని, ప్రధాని కోరినట్లుగా దేశాభివృద్ధికి సహకరించాలని యువతకు సూచించారు. కార్యక్రమంలో భాగంగా శ్రీనివాస ధీరేంద్ర కౌశిక్ పంచాంగ పఠనం చేశారు. కళాకారుల నృత్యప్రదర్శన ఆకట్టుకుంది. 13 మంది నృత్య కళాకారులు, వివిధ సామాజిక సేవలు చేసిన యువతకు గవర్నర్ ఉగాది పురస్కారాలు అందజేశారు. కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ దంపతులు, పలువురు అధికారులు పాల్గొన్నారు. పురస్కారాలు అందుకున్న వారిలో.. రేపల్లి శ్రీనివాస్, కొండ సచ్దేవ్, విఘ్నేశ్ అర్జున్, గంధం సంతోష్, తిమ్మనోళ్ల రఘునాథ్రెడ్డి, రవికుమార్ సాగర్, శుభశ్రీ సాహు, జూనియ ఎవెలిన్, కాట్రగడ్డ హిమాన్సీ, రోహిణి కందాల, సాగి శివ శ్రీనివాస ధీరేంద్ర కౌశిక్, పోతుకుచి సోమసుందర, జ్యోత్స్న విక్కిరాల ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌత్జోన్ డీసీపీగా స్నేహామెహ్రా
హైదరాబాద్లోని దక్షిణ మండలం డీసీపీగా స్నేహామెహ్రాను నియమిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె రాత్రి బాధ్యతలు స్వీకరించారు. -
ఖానాపూర్ అడవుల్లో చిరుత సంచారం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ రేంజి పరిధిలో నీటి వనరుల చెంత వన్యప్రాణులు కనిపించాయి. -
కాళేశ్వరంపై సత్వర విచారణ
ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టుపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందని జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పినాకీ చంద్ర ఘోష్ తెలిపారు. -
మండుతున్న ఎండలు.. భగ్గుమంటున్న అడవులు
రాష్ట్రవ్యాప్తంగా ఏప్రిల్ నెలలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పలు జిల్లాల్లో 45 డిగ్రీల సెల్సియస్ దాటుతోంది. -
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
ఇటీవల వెలువడిన యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా పూడూరు మండలానికి చెందిన యువకుడు తరుణ్ కుమార్ జాతీయ స్థాయిలో 231 ర్యాంకు సాధించి ఐఏఎస్కు అర్హత సాధించినట్లుగా ప్రచారం జరిగింది. -
భద్రాచలంలో 44 డిగ్రీలు
రాష్ట్రంలో ఎండల తీవ్రత గురువారం కొనసాగింది. అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైనే ఉష్ణోగ్రతలు ఉన్నాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. -
ఎవరి కోసం చేశారు ఇదంతా...?
రాష్ట్రంలో సంచలనం సృష్టించి ప్రస్తుతానికి స్తబ్దుగా ఉన్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత మరోమారు ఊపందుకునే అవకాశం ఉంది. -
నాణ్యమైన విత్తనాలనే వాడాలి
పంటల సాగుకు రైతులు నాణ్యమైన విత్తనాలను ఉపయోగించాలని, నాసిరకం విత్తనాలను కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయ శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయ అధికారులు సూచించారు. -
ఆయిల్పామ్ రైతులను చైతన్యపరచాలి
వేసవికాలంలో ఎండ తీవ్రత, వర్షాభావ పరిస్థితులతో భూగర్భ జలాలు తగ్గునందున ఆయిల్పామ్ మొక్కల సంరక్షణపై రైతులు ఆందోళన చెందకుండా వారిని చైతన్యపరచాలని రాష్ట్ర ఉద్యాన సంచాలకుడు అశోక్రెడ్డి అధికారులను ఆదేశించారు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా