2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో మూడురోజులపాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులతో 2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది.
22 జిల్లాల్లో ప్రభావం
వ్యవసాయ శాఖ ప్రాథమిక నివేదిక
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మూడురోజులపాటు కురిసిన భారీ వడగళ్ల వానలు, ఈదురు గాలులతో 2.80 లక్షల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 22 జిల్లాల్లో దాదాపు 96 వేల మంది రైతులు పంటలను కోల్పోయారని తెలిపింది. ఎక్కువగా మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. ఆ తర్వాత వరి, మిర్చి, వేరుసెనగ, పత్తి పంటలు దెబ్బతిన్నాయి. మామిడితోపాటు టమాట, బెండ, ఉల్లి, బొప్పాయి, వంకాయ తదితర పంటలకూ నష్టం కలిగింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ సమూహాల వారీగా అధికారులు పంట నష్టంపై నివేదికలు రూపొందించారు. అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో నష్టం వాటిల్లింది. ఆ తర్వాత కరీంనగర్, నల్గొండ జిల్లాలు నష్టపోయాయి. వరంగల్ ఉమ్మడి జిల్లాలో 57,855 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. 43,423 మంది రైతులు నష్టపోయారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ, చందుర్తి, రుద్రంగి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేటలలో వరి ఎక్కువగా దెబ్బతింది. చొప్పదండి, రామడుగు, గంగాధర, కొత్తపల్లి, కరీంనగర్ గ్రామీణ మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలను వర్షం దెబ్బతీసింది. సూర్యాపేట జిల్లాలో 14,429 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఖమ్మం జిల్లాలో 18 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 53 ఎకరాల్లో పెసర దెబ్బతిన్నాయి. వికారాబాద్ జిల్లాలో 1,516 మంది రైతులు 3,193 ఎకరాల్లో రూ.కోటి రూపాయలకుపైగా పంటను కోల్పోయారు. రంగారెడ్డి జిల్లాలో 1,923 ఎకరాల్లో పంట నష్టం సంభవించింది.
373 శాతం అధికంగా కురిసిన వర్షం
యాసంగి పంటలకు భారీగా నష్టం
ఈనాడు, హైదరాబాద్: నాలుగు రోజులపాటు కురిసిన అకాల వర్షాలు యాసంగి పంటలకు తీరని నష్టాన్ని మిగిల్చాయి. వాస్తవానికి వేసవిలో ఇంత భారీ వర్షాలు అరుదుగా ఉంటాయని వాతావరణ శాఖ పేర్కొంటోంది. అయితే, ద్రోణి ప్రభావంతో తాజాగా కురిసిన వానలు ఏకంగా నాలుగు రోజులపాటు ప్రభావం చూపాయి. మార్చి ఒకటో తేదీ నుంచి 20వ తేదీ వరకు నమోదు కావాల్సిన సాధారణ వర్షపాతం 8.6 మి.మీటర్లు. దీనికి భిన్నంగా ఏకంగా 40.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే ఇది 373 శాతం అధికం. నిజామాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో అధిక వర్షాలు నమోదయ్యాయి. ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షాలకు తోడు వడగళ్లు పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వానలకుతోడు వడగళ్లు పెద్ద పరిమాణంలో పడటంతో తీవ్ర నష్టం జరిగింది. పంటలతోపాటు వాహనాల అద్దాలు, ఇంటిపైకప్పు రేకులు చాలా మండలాల్లో ధ్వంసమయ్యాయి. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు రాష్ట్రంలో గరిష్ఠంగా పెద్దపల్లి జిల్లా శ్రీరాంపూర్లో 5 సెం.మీ. వర్షం కురిసింది. మహబూబాబాద్ జిల్లా గూడూరులో 4, వరంగల్ జిల్లా నర్సంపేటలో 3 సెం.మీ. వర్షం కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 50కి పైగా ప్రాంతాల్లో వర్షం నమోదైంది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది. వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా శీతల వాతావరణం కొనసాగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత