తస్కరించారా? ఎవరైనా ఇచ్చారా?
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో యూజర్ ఐడీ, పాస్వర్డ్ల చుట్టూ సిట్ దర్యాప్తు తిరుగుతోంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ను రాజశేఖర్రెడ్డి చోరీ చేశాడా, రోజువారీ కార్యకలాపాల కోసం అతనికి ఎవరైనా కావాలనే ఇచ్చారా అన్న అంశంపై అధికారులు దృష్టి పెట్టారు.
ఓ అధికారి యూజర్ ఐడీ, పాస్వర్డ్లతో ప్రశ్నపత్రాల చోరీ
వాటిని నిందితులు ఎలా పొందారు?
ఈ అంశంపైనే సిట్ ప్రధాన దృష్టి
ఈనాడు, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో యూజర్ ఐడీ, పాస్వర్డ్ల చుట్టూ సిట్ దర్యాప్తు తిరుగుతోంది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ను రాజశేఖర్రెడ్డి చోరీ చేశాడా, రోజువారీ కార్యకలాపాల కోసం అతనికి ఎవరైనా కావాలనే ఇచ్చారా అన్న అంశంపై అధికారులు దృష్టి పెట్టారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం కమిషన్కు చెందిన ఓ అధికారి యూజర్ ఐడీ, పాస్వర్డ్ను ఉపయోగించి.. రాజశేఖర్రెడ్డి ప్రశ్నపత్రాలను చోరీ చేసినట్లు తెలుస్తోంది. కాన్ఫిడెన్షియల్ విభాగంపై అజమాయిషీ ఉండే అధికారికి చెందిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ తెలిస్తేనే ప్రశ్నపత్రాలను కొల్లగొట్టొచ్చని రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్లు భావించారు. ఆ విభాగానికి చెందినవారి యూజర్ ఐడీ, పాస్వర్డ్ సేకరించారు. కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్ఛార్జి శంకరలక్ష్మి తన యూజర్ ఐడీ, పాస్వర్డ్లను డైరీలో రాసుకున్నారని, ఆమెకు తెలియకుండా వాటిని సేకరించి.. ప్రశ్నపత్రాలను పొందినట్లు నిందితులు తొలుత చెప్పారు. వారు చెప్పింది అవాస్తవమని సిట్ దర్యాప్తులో తేలింది. రాజశేఖర్కు యూజర్ ఐడీ, పాస్వర్డ్లు ఎలా వచ్చాయన్నది మిస్టరీగా మారింది. దీని గురించి సిట్ అధికారులు ఎంతగా ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పడం లేదని తెలుస్తోంది. వీరు వాడిన యూజర్ ఐడీ, పాస్వర్డ్ కమిషన్కు చెందిన ఓ అధికారిదని అనుమానిస్తున్నారు. ఆ అధికారి నుంచి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను తస్కరించారా లేదా ఆ అధికారే ఇచ్చారా? అన్నది తేలాల్సి ఉంది. చాలామంది ఉన్నతాధికారులు కంప్యూటర్ ద్వారా చేయాల్సిన వ్యవహారాలను తమ వద్ద సహాయకులుగా పనిచేస్తున్న వారికి అప్పగిస్తుంటారు. కంప్యూటర్లపై ఎక్కువ పరిజ్ఞానం లేకపోవడం అందుకు కారణం. తమ వద్ద పనిచేస్తున్నారన్న నమ్మకంతో ఇలా ఇస్తుంటారు. రాజశేఖర్, ప్రవీణ్లకూ ఇలాగే ఎవరైనా ఇచ్చి ఉంటారా? అన్న అంశాన్ని తెలుసుకునేందుకు సిట్ ప్రయత్నిస్తోంది. ఒకవేళ ఎవరైనా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఇచ్చిఉంటే వారినీ విచారించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
కొన్ని నెలలుగా పలువురితో సంప్రదింపులు
కేవలం తన స్నేహితురాలు రేణుక కోరిక మేరకు ఆమె తమ్ముడి కోసమే ప్రశ్నపత్రం లీక్ చేశానని ప్రవీణ్ తొలుత చెప్పినప్పటికీ అది అబద్ధమని తేలింది. గత అక్టోబరు నుంచి కంప్యూటర్లు రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్ల చేతుల్లోకి వెళ్లినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. కమిషన్ అక్టోబరు తర్వాతే అన్ని పరీక్షలను నిర్వహించింది. వీటన్నింటి ప్రశ్నపత్రాలను కొట్టేసే అవకాశం ఉన్నట్లే. సిట్ దర్యాప్తులోనూ దీనికి బలం చేకూర్చే ఆధారాలు లభిస్తున్నాయని సమాచారం. గత కొద్ది నెలలుగా ప్రవీణ్ పలువుర్ని సంప్రదించినట్లు తెలుస్తోంది. పెళ్లిళ్ల వంటి శుభకార్యాల్లో పరిచయమైనవారిని వారి బంధువులు ఎవరైనా పోటీ పరీక్షలు రాస్తున్నారేమోనని ఆరా తీసేవాడని సమాచారం. ఆ తర్వాత నేరుగా అభ్యర్థులతో, లేకపోతే వారితో సన్నిహితంగా ఉండేవారితో సంప్రదింపులు చేసేవాడని... డబ్బులిస్తే ప్రశ్నపత్రాలు అందిస్తానని బేరం పెట్టేవాడని తెలుస్తోంది. అయితే ప్రవీణ్ మాటలను చాలామంది నమ్మలేదని, ప్రశ్నపత్రం లీకయ్యే అవకాశం లేదని వాదించారని తెలుస్తోంది. ఒకసారి నిరాకరించిన వారితో ప్రవీణ్ మళ్లీ మాట్లాడేవాడు కాదని ఓ అధికారి తెలిపారు. ప్రవీణ్ ఫోన్లో సంప్రదింపులు జరిపిన వారందరి వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. వీటిలో పోటీ పరీక్షలు రాసినవారు గాని, వారి బంధువులు గాని ఉంటే విచారణకు పిలవాలని భావిస్తున్నారు. రాజశేఖర్ కూడా ఇదే తరహాలో కొద్ది మంది ఎంపిక చేసుకున్నవారికి ప్రశ్నపత్రం అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
నాలుగుసార్లు విఫలం.. అయిదోసారి ప్రశ్నపత్రాల చోరీ
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల కేసులో సిట్ బృందం కస్టడీలోని నిందితుల నుంచి కీలక సమాచారం రాబట్టింది. కమిషన్ కార్యాలయంలో నెట్వర్క్ అడ్మిన్గా పనిచేస్తున్న రాజశేఖర్రెడ్డి గ్రూప్-1 ప్రిలిమినరీ ప్రశ్నపత్రాలు కొట్టేసేందుకు పరీక్షకు మూడు నెలల ముందు నాలుగుసార్లు విఫలయత్నం చేశాడు. అనంతరం గతేడాది అక్టోబరు మొదటి వారంలో పెన్ డ్రైవ్ల్లోకి కాపీ చేసుకున్నట్లు సిట్ పోలీసులు ఆధారాలు సేకరించినట్లు విశ్వసనీయ సమాచారం. రెండోరోజు నిందితులను వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ బృందం.. మూడో రోజు తొమ్మిది మందినీ ఒకేచోట కూర్చోబెట్టి వాంగ్మూలాలు నమోదు చేసుకున్నట్టు సమాచారం. కాగా, కేసులో కీలక నిందితులు ప్రవీణ్కుమార్(బడంగ్పేట), రాజశేఖర్రెడ్డి(మణికొండ)ల నివాసాల్లో సిట్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. కొన్ని పత్రాలను స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఆ సొమ్ము ఏమైంది?
రాజశేఖర్, ప్రవీణ్ల బ్యాంకు లావాదేవీలు పరిశీలించిన అధికారులకు పెద్దగా ఆధారాలు లభించలేదు. ప్రవీణ్కు రూ.10 లక్షలు ఇచ్చినట్లు మరో నిందితురాలు రేణుక చెప్పింది. అంతకుమించిన ఆర్థిక వివరాలేవీ లేవు. అయితే రాజశేఖర్, ప్రవీణ్లు చాలామందికి ప్రశ్నపత్రాలు అమ్ముకున్నట్లు సిట్ అధికారులు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలనూ సేకరించారు. వాటి తాలూకూ సొమ్ము ఏమైందన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రవీణ్ సంప్రదించినట్లు చెబుతున్న కొందర్ని విచారించినప్పుడు తనకు నగదు రూపంలోనే కావాలని చెప్పినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగి కావడం వల్ల బ్యాంకులో ఎక్కువ డబ్బు పడితే జవాబు చెప్పుకోవాల్సి వస్తుందన్న ఉద్దేశంతోనే నగదు డిమాండు చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!