24, 25 తేదీల్లో మళ్లీ వర్షాలు

ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది.

Updated : 22 Mar 2023 04:44 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఈ నెల 24, 25 తేదీల్లో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ మంగళవారం తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని సూచించింది. నేడు, రేపు అక్కడక్కడ ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని పేర్కొంది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించి ఉంది. మరోవైపు రాష్ట్రంలో పగటి పూట, రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని