లొసుగులు.. లోపాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించే తీరు, ముఖ్యంగా ప్రశ్నపత్రాలను గోప్యంగా ఉంచే విధానం కమిషన్లో లోపభూయిష్టంగా ఉందని సిట్ అధికారులు గుర్తించారు.
టీఎస్పీఎస్సీలో లోపభూయిష్ఠంగా ప్రశ్నపత్రాల గోప్యత విధానం
కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి ప్రవీణ్ను ఎవరు అనుమతించారు?
సంబంధిత అధికారుల్నీ ప్రశ్నించేందుకు సిట్ సమాయత్తం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు నిర్వహించే తీరు, ముఖ్యంగా ప్రశ్నపత్రాలను గోప్యంగా ఉంచే విధానం కమిషన్లో లోపభూయిష్టంగా ఉందని సిట్ అధికారులు గుర్తించారు. గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతి పొందిన ప్రవీణ్ కార్యాలయంలోకి రావడానికి, కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి వెళ్లడానికి ఎలా? ఎవరు అనుమతించారన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. వీటన్నింటినీ క్షుణ్నంగా అధ్యయనం చేస్తున్న సిట్ అధికారులు.. ప్రశ్నపత్రాల తయారీ నుంచి వాటిని భద్రపర్చడంలో, పరీక్షల నిర్వహణతో సంబంధం ఉన్న వారందర్నీ ప్రశ్నించాలని భావిస్తున్నారు.
ఎస్సెమ్మెస్ ఎలర్ట్ను డియాక్టివేట్ చేసినా..
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చిన ప్రస్తుత రోజుల్లో ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా అనేక చర్యలు తీసుకోవచ్చు. కానీ, కమిషన్ కార్యాలయంలో ఇలాంటివేవీ కనిపించలేదని తెలుస్తోంది. ఉదాహరణకు ప్రశ్నపత్రాలను కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోని కంప్యూటర్లో భద్రపరుస్తారు. ఆ సెక్షన్ ఇన్ఛార్జి తప్ప ఇతరులు ఎవరూ దీన్ని తెరిచే అవకాశం లేకుండా డిజిటల్ లాక్ చేస్తారు. ఎవరైనా తెరవాలని ప్రయత్నిస్తే వెంటనే సంబంధిత ఇన్ఛార్జికి ఎస్సెమ్మెస్ ఎలర్ట్ వస్తుంది. దాదాపు సంవత్సరం క్రితం నెట్వర్క్ అప్గ్రెడేషన్ జరిగినప్పుడే ఈ ఎలర్ట్ విధానాన్ని రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్లు డీయాక్టివేట్ చేసినట్లు సమాచారం. అంతేకాకుండా డైనమిక్ ఐపీని స్టాటిక్ ఐపీగా మార్చారు. కానీ, ప్రశ్నపత్రాలు లీకయ్యేవరకూ, పోలీసులకు ఫిర్యాదు వచ్చేవరకూ కమిషన్ కార్యాలయంలో ఎవరూ గుర్తించలేకపోయారు. పరీక్షల నిర్వహణపై అజమాయిషీ అనేక మంది చేతుల్లో ఉంటుంది. సాంకేతికంగా జరిగిన మార్పులు, రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్ల కదలికలను ఎవరూ అనుమానించకపోవడం అతిపెద్ద తప్పిదంగా భావిస్తున్నారు. గ్రూప్-1 ప్రిలిమ్స్ రాసేందుకు అనుమతి పొందిన ప్రవీణ్ను కార్యాలయంలో యథేచ్ఛగా తిరిగేందుకు అనుమతించడం మరో పెద్ద వైఫల్యమని సిట్ అధికారులు భావిస్తున్నారు. కమిషన్ కార్యాలయంలో పనిచేసేవారు ఎవరైనా ఈ పోటీ పరీక్షలను రాయాలంటే వారిని కీలకమైన కాన్ఫిడెన్షియల్ సెక్షన్లోకి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేదా ఇతర విభాగాలకు బదిలీ చేయాలి. ఈ నిబంధనలను ఎవరూ పట్టించుకోలేదని తేలింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ ప్రశ్నపత్రం అత్యంత కఠినంగా వచ్చిందని పరీక్ష రాసిన తర్వాత అనేక మంది అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి సిద్ధమవుతున్న వారికీ 100 మార్కులు దాటడం గగనమైంది. అలాంటిది సెలవు పెట్టకుండా.. కమిషన్ కార్యాలయంలోనే విధులు నిర్వహిస్తూ రాసిన ప్రవీణ్కు 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ అధికారులు ఎవరికీ అనుమానం రాకపోవడాన్ని సిట్ అధికారులు ఎత్తిచూపుతున్నారు.
కంప్యూటర్ కార్యకలాపాలకు రాజశేఖర్రెడ్డిపైనే ఆధారం
కమిషన్ కార్యాలయంలో కంప్యూటర్ వ్యవస్థ ఘోరంగా ఉందని, కొద్దిగా ప్రయత్నిస్తే నెట్వర్క్లోకి చొరబడటం పెద్ద సమస్య కాదని.. దాంతోపాటు ఇక్కడ పనిచేస్తున్న ఎవరికీ సాంకేతిక అంశాలపై సరైన పరిజ్ఞానం లేదని సిట్ అధికారులు గుర్తించినట్లు సమాచారం. కంప్యూటర్ కార్యకలాపాలకు సంబంధించిన ప్రతి చిన్న విషయానికీ రాజశేఖర్రెడ్డిపై ఆధారపడేవారని.. ఇది కూడా పెద్ద తప్పిదమని అధికారులు భావిస్తున్నారు. ఇన్ని లోపాలు ఉండబట్టే రాజశేఖర్రెడ్డి, ప్రవీణ్లు తమ పథకం అమలు చేసి ప్రశ్నపత్రాలను కొల్లగొట్టారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. వాటిని అమ్ముకోవడంలో తేడా వచ్చి.. పోలీసులకు ఫిర్యాదు వచ్చి ఉండకపోతే ఈ వ్యవహారమే బయటపడేది కాదని, భవిష్యత్తులో జరిగే పరీక్షల ప్రశ్నపత్రాలనూ అమ్ముకుని సొమ్ము చేసుకునేవారని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.