సుస్థిరం.. తెలంగాణ ప్రభుత్వం
‘శోభకృత్’ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను బుధవారం నగరంలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఘనంగా నిర్వహించారు.
పంచాంగ పఠనంలో వేద పండితుడి వెల్లడి
రవీంద్రభారతిలో ఘనంగా ఉగాది వేడుకలు
రవీంద్రభారతి, న్యూస్టుడే: ‘శోభకృత్’ నామ తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను బుధవారం నగరంలోని రవీంద్రభారతి ప్రధాన మందిరంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, భాషా సాంస్కృతిక, దేవాదాయ శాఖల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి పంచాంగ పఠనం చేశారు. ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సుస్థిర పరిపాలన అందిస్తుందని, ఈ విషయంలో ఎలాంటి సందేహాలు అక్కరలేదని స్పష్టం చేశారు. ప్రజాప్రయోజనాల కోసం బృహత్ కార్యక్రమాల రూపకల్పనకు ప్రభుత్వరంగ నిపుణులు కసరత్తులు చేస్తారని.. ఇంతకాలం ఆగిపోయిన పనులు, పెండింగ్ బిల్లులన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ప్రధానంగా ‘స్వవర్గంలో’ కొందరు వ్యక్తుల నుంచి వ్యతిరేకతలు వచ్చే అవకాశం లేకపోలేదని.. ఈ విషయంలో ‘రాజు’ చాలా జాగ్రత్తగా ఉండాలని పంచాంగం సూచిస్తోందన్నారు. ఇక్కడ రాజు చదువుకున్నవారు, చాలా విషయాలపై అవగాహన ఉన్నవారు, సమర్థులు కావడంతో అటువంటి విపరీత ధోరణులను అణిచివేసే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ ఏడాది కాళేశ్వరం, నాగార్జునసాగర్, శ్రీశైలం.. ఇలా అన్ని డ్యామ్లు నిండుకుండలా మారబోతున్నాయని, పాడిపంటలతో రాష్ట్రం శోభాయమానంగా వర్ధిల్లబోతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మంత్రులు ఎ.ఇంద్రకరణ్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, మల్లారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా.కె.వి.రమణాచారి, శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ప్రభుత్వ విప్ భానుప్రసాద్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కాలేరు వెంకటేశ్, రసమయి బాలకిషన్, గండ్ర వెంకటరమణారెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా, బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్రావు, ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ సముద్రాల వేణుగోపాలాచారి, సాహిత్య అకాడమీ ఛైర్మన్ జూలూరు గౌరీశంకర్, సంగీత నాటక అకాడమీ ఛైర్మన్ దీపికారెడ్డి, పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ఆబ్కారీ కార్పొరేషన్ ఛైర్మన్ గజ్జెల నగేష్, డీజీపీ అంజనీకుమార్, నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్, ఐఏఎస్ అధికారి సందీప్కుమార్ సుల్తానియా, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, దేవాదాయశాఖ కమిషనర్ అనీల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామివారి దేవస్థానం ముద్రించిన శోభకృత్ నామ సంవత్సర పంచాంగాన్ని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆవిష్కరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్
-
కాలేజీ క్యాంపస్లో ఘోరం.. కార్పొరేటర్ కుమార్తె దారుణ హత్య
-
అమ్మ చనిపోయారు.. నేను పోటీ చేయలేను: ‘హిమాచల్’ డిప్యూటీ సీఎం కుమార్తె