సంక్షిప్త వార్తలు
మహిళలను అగౌరవపరచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మకు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారు.
మహిళలను అగౌరవపరచిన నేతలపై చర్యలు తీసుకోవాలి
ఎన్సీడబ్ల్యూ ఛైర్పర్సన్కు మహిళా మోర్చా వినతి
ఈనాడు, దిల్లీ: మహిళలను అగౌరవపరచేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతోపాటు ఇతర ప్రజాప్రతినిధులపై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళా కమిషన్(ఎన్సీడబ్ల్యూ) ఛైర్పర్సన్ రేఖా శర్మకు భాజపా మహిళా మోర్చా రాష్ట్ర నేతలు విజ్ఞప్తి చేశారు. గురువారమిక్కడి ఎన్సీడబ్ల్యూ కార్యాలయంలో రేఖా శర్మకు మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి, ప్రధాన కార్యదర్శి కల్యాణం గీతారాణి, ఉపాధ్యక్షురాలు మాలతీ లత వినతిపత్రం సమర్పించారు. ఓ మహిళా ఉద్యోగిపై అసభ్య పదజాలం వినియోగించిన మంత్రి ఎర్రబెల్లిని, భాజపా రాష్ట్ర అధ్యక్షుడి సతీమణి, పార్టీ మహిళా కార్యకర్తలపై వ్యాఖ్యలు చేసిన నకిరేకల్ ఎమ్మెల్యే లింగయ్యను పిలిచి విచారించాలని కోరారు.
వడగళ్లు పడినా.. పెరిగిన పంట విస్తీర్ణం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో వడగళ్ల వర్షాలు కురిసినా ప్రస్తుత యాసంగి సీజన్లో పంటల విస్తీర్ణం పెరిగిందని వ్యవసాయ శాఖ గురువారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. గతవారంతో పోలిస్తే 3,526 ఎకరాలు అధికంగా సాగయిందని తెలిపింది. రాష్ట్రంలో సంభవించిన భారీవర్షాలు, వడగళ్లు, ఈదురుగాలుల వల్ల 2.28 లక్షల ఎకరాల్లో వరి, జొన్న, మిర్చి తదితర పంటలకు నష్టం వాటిల్లగా అధికారులు వాటిని తాజా నివేదికలో చేర్చలేదు.
తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి రూ.735 కోట్ల వ్యయం
ఈనాడు, దిల్లీ: భారత్మాల పరియోజన కింద తెలంగాణలో 2022-23లో ప్రారంభించిన, 2023-24లో ప్రారంభించనున్న 209.73 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి రూ.6,607.61 కోట్లు కేటాయించి ఇప్పటికే రూ.735.01 కోట్లు వ్యయం చేసినట్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. మహబూబ్నగర్ ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి అడిగిన ప్రశ్నకు లోక్సభలో గురువారం ఆయన లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
వంతెనల పనులు త్వరగా పూర్తిచేయాలి: మంత్రి వేముల
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇటీవలి వర్షాలకు దెబ్బతిన్న వంతెనల పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల నాణ్యత విషయంలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. గురువారం ఇక్కడి ఆర్అండ్బీ ప్రధాన కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. దెబ్బతిన్న రహదారులను జూన్ నాటికి పూర్తి చేయాలన్నారు. అధికారులు గణపతిరెడ్డి, సతీష్, దివాకర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
‘పాలమూరు’కు కేటాయింపులపై ట్రైబ్యునల్లో నేటి నుంచి వాదనలు
ఈనాడు, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి తెలంగాణ జీవో నం.246 కింద చేసిన నీటి కేటాయింపులపై గురువారం దిల్లీలో కృష్ణా ట్రైబ్యునల్-2లో విచారణ ప్రారంభమైంది. ఈ పథకానికి నీటి కేటాయింపులపై అభ్యంతరం తెలుపుతూ ట్రైబ్యునల్లో ఏపీ మధ్యంతర పిటిషన్ దాఖలు చేయడంతో కేడబ్ల్యూడీటీ-2 ఛైర్మన్ జస్టిస్ బ్రిజేష్కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్రెడ్డి, ఎస్.తాళపత్ర విచారణ చేపట్టారు. ఏపీ సీనియర్ న్యాయవాది జి.ఉమాపతి ఆ రాష్ట్రం వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలు, వాటికి సంబంధించిన దస్త్రాలను ట్రైబ్యునల్ ఎదుట ఉంచి వివరించారు. శుక్రవారం నుంచి వాదనలు ప్రారంభం కానుండగా.. ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది జయదీప్ గుప్తా వాదనలు వినిపించనున్నారు. గురువారం నాటి విచారణకు తెలంగాణ తరఫున సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, ఇంజినీర్లు హాజరయ్యారు.
ఆ 214 మంది ఎస్సైలకు పదోన్నతులు కల్పించండి
సీఎం కేసీఆర్కు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ బహిరంగ లేఖ
ఈనాడు, హైదరాబాద్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2009 నోటిఫికేషన్ ద్వారా ఎస్సైలుగా నియమితులైన 214 మందికి ఇప్పటి వరకు పదోన్నతులు కల్పించలేదని.. వెంటనే ఖాళీలు ఉన్నచోట అర్హులకు ప్రమోషన్లు ఇవ్వాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ గురువారం సీఎం కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు. ‘‘ఈ సమస్యపై పోలీసు ఉన్నతాధికారులకు, సీఎం కార్యాలయానికి పలుమార్లు తెలియజేసినా ఫలితం కనిపించలేదని బాధితులు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా వారి సమస్యను పరిష్కరించండి. లేనిపక్షంలో న్యాయం కోసం పోరాటానికి బీఎస్పీ సిద్ధంగా ఉంటుం్టది’’ అని పేర్కొన్నారు.
పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ అవార్డు దక్కించుకున్న బడుగుల లింగయ్యయాదవ్
ఈనాడు, దిల్లీ: భారాస రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ 2021-22 సంవత్సరానికి సంబంధించి పార్లమెంటేరియన్స్ గ్రూప్ ఫర్ చిల్డ్రన్ అవార్డు దక్కించుకున్నారు. గురువారం దిల్లీలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ గౌరవ్ గొగొయ్ చేతులమీదుగా లింగయ్యయాదవ్ ఈ అవార్డు స్వీకరించారు. పోక్సో చట్టంపై రాజ్యసభలో అనేక సూచనలు చేయడం, చిన్నారుల అంశాలను పలుమార్లు ప్రస్తావించినందుకుగాను ఆయన్ను ఈ అవార్డుకు ఎంపిక చేశారు.
రంజాన్ మాసంలో రుణ వాయిదాలపై ఒత్తిడి చేయొద్దు
హోంమంత్రికి ఆటోడ్రైవర్ల విజ్ఞప్తి
ఈనాడు, హైదరాబాద్: ఆటో రుణాలపై వాయిదాలు చెల్లించాలని ఈ రంజాన్ మాసంలో ఫైనాన్షియర్లు ఒత్తిడి చేయకుండా చూడాలని తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ సంఘం.. హోంమంత్రి మహమూద్ అలీకి విజ్ఞప్తి చేసింది. సంఘం నాయకులు మహ్మద్ మునీర్, ఎం.ఎ.సలీం, మీర్జా ఫాతుల్లాబేగ్ తదితరులు గురువారం హోంమంత్రిని ఆయన కార్యాలయంలో కలిసి ఈమేరకు వినతిపత్రం సమర్పించారు. ‘‘రంజాన్ సమయంలో ఆటోడ్రైవర్లకు ఆదాయం తక్కువగా ఉంటుంది. ఆటోలపై రుణ వాయిదాలు చెల్లించడం కష్టమవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని రంజాన్ మాసంలో ఫైనాన్షియర్లు వాయిదాలు చెల్లించమని ఒత్తిడి చేయకుండా, ఆటోలను స్వాధీనం చేసుకోకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి’’ అని వినతిపత్రంలో పేర్కొన్నారు.
ఏప్రిల్ 25 నుంచి సార్వత్రిక విద్యాపీఠం పరీక్షలు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ఎస్ఎస్సీ, ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. వచ్చే నెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకూ రెండు విడతలుగా పరీక్షలు నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు మే 4తో ముగియనుండగా.. ఎస్ఎస్సీ పరీక్షలు మే 3తో ముగుస్తాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 12 నుంచి 19 వరకూ నిర్వహిస్తారు. ఈ మేరకు విద్యాపీఠం డైరెక్టర్ పి.వి.శ్రీహరి గురువారం ప్రకటన విడుదల చేశారు.
29 నుంచి గ్రూప్ 1 శిక్షణ తరగతులు
ఈనాడు, హైదరాబాద్: గ్రూప్ 1 శిక్షణ తరగతులను ఈ నెల 29 నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం సెంటర్లో ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ కె.అలోక్కుమార్ గురువారం తెలిపారు. డిగ్రీతో పాటు ఇంటర్లోనూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన 200 మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.