భద్రాద్రిలో వైభవంగా శ్రీరామాయణ మహాక్రతువు

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకల్లో భాగంగా గురువారం శ్రీరామాయణ మహాక్రతువు వైభవోపేతంగా కొనసాగింది.

Published : 24 Mar 2023 05:27 IST

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో శ్రీరామనవమి-పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుకల్లో భాగంగా గురువారం శ్రీరామాయణ మహాక్రతువు వైభవోపేతంగా కొనసాగింది. చతుర్వేద, రామాయణ పారాయణాలు, శ్రీరామ షడక్షరీ, నారాయణ అష్టాక్షరీ మంత్ర హోమాలను రుత్వికులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. యాగశాలల వద్ద శ్రీరామ నామం మిన్నంటుతుండగా అగ్నిమథనం క్రతువును నిర్వహించి హోమగుండంలో అగ్నిప్రతిష్ఠ గావించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని