రూ.12,718 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది
విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు గత ఏడేళ్లుగా ఖర్చుపెట్టిన అదనపు సొమ్ము రూ.12,718.48 కోట్లను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేయవద్దని సూచిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది.
కరెంటు ట్రూఅప్ ఛార్జీల భారం ప్రజలపై వేయం
ప్రార్థనా మందిరాల కరెంటు బిల్లు ఇక యూనిట్కు రూ.5
రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ఆదేశాలు జారీ
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు గత ఏడేళ్లుగా ఖర్చుపెట్టిన అదనపు సొమ్ము రూ.12,718.48 కోట్లను భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ సొమ్మును ప్రజల నుంచి వసూలు చేయవద్దని సూచిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. అదనంగా ఖర్చుచేసిన మొత్తాన్ని ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజల కరెంటు బిల్లుల ద్వారా వచ్చేనెల నుంచి వసూలు చేసుకోవడానికి అనుమతించాలని రెండు నెలల క్రితం డిస్కంలు ‘రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి’ (ఈఆర్సీ)కి ప్రతిపాదనలిచ్చాయి. వీటిపై తుది నిర్ణయాన్ని ఈఆర్సీ ఛైర్మన్ శ్రీరంగారావు శుక్రవారం వెల్లడించారు. ఈ ట్రూఅప్ ఛార్జీల వసూలుకు అనుమతించవద్దని, ఈ సొమ్మునంతా రాబోయే అయిదేళ్ల పాటు వాయిదాల్లో వడ్డీతో చెల్లిస్తామన్న రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు తమకు అందాయని ఆయన చెప్పారు. ఈఆర్సీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
ప్రజలపై భారం వేయవద్దని ప్రభుత్వం స్పష్టం చేసిందని ఆయన వివరించారు. ప్రస్తుతం అన్ని మతాల ప్రార్థనామందిరాలకు సరఫరా చేస్తున్న కరెంటుకు యూనిట్కు రూ.6.40 నుంచి రూ.7 వరకూ ఛార్జీని డిస్కంలు వసూలు చేస్తున్నాయని, దీనిని వచ్చే నెల నుంచి యూనిట్కు రూ.5కి తగ్గిస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో ఈఆర్సీ సభ్యులు మనోహర్రాజు, కృష్ణయ్యలు కూడా పాల్గొన్నారు. శ్రీరంగారావు తెలిపిన మరికొన్ని ముఖ్యాంశాలు...
* ఒక ఆర్థిక సంవత్సరంలో ఈఆర్సీ అనుమతించిన పరిమితికన్నా అదనంగా కరెంటు కొనుగోలుకు సొమ్మును డిస్కంలు ఖర్చుపెడితే దానిని అదనంగా కరెంటు బిల్లుల నుంచి వసూలు చేసేందుకు మరుసటి ఏడాది ఇచ్చే ప్రతిపాదనలను ‘ట్రూఅప్ ఛార్జీలు’ అని పిలుస్తారు. ఇలా 2016-22 మధ్యకాలంలో మొత్తం కరెంటు కొనుగోళ్లకు రూ.12,015 కోట్లు, పంపిణీ ఖర్చుల కింద రూ.4578 కోట్లు (మొత్తం 16,593 కోట్లు) ఖర్చుపెట్టామని, వీటిని ట్రూఅప్ పేరుతో వచ్చే నెల నుంచి వసూలుకు అనుమతించాలని డిస్కంలు ఇచ్చిన ప్రతిపాదనల్లో తెలిపాయి. కానీ ఈఆర్సీ ఈ ప్రతిపాదనలను లోతుగా పరిశీలిస్తే డిస్కంలు కరెంటు కొనుగోలుకు, పంపిణీకి అదనంగా ఖర్చుపెట్టిన సొమ్ము రూ.12,718.48 కోట్లు మాత్రమేనని తేలింది. ఈ మొత్తాన్ని అయిదేళ్ల పాటు 5 వాయిదాల్లో చెల్లిస్తామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినందున ఇక ప్రజలపై భారం ఏమీ వేయవద్దని డిస్కంలను ఆదేశించాం.
* రాష్ట్రంలో కొన్ని వర్గాల వారికి ఇళ్లకు, వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న కరెంటు ఛార్జీల రాయితీ పద్దు కింద 2015-16లో రూ.4257.28 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం రాయితీగా భరించగా వచ్చే ఏడాది (2023-24)లో రూ.9124.82 కోట్లు ఇవ్వనుంది.
* డిస్కంలు కరెంటు కొనుగోలుకు ప్రస్తుత ఏడాది (2022-23)లో యూనిట్కు సగటున రూ.4.49 చొప్పున ఖర్చుచేయాలని అనుమతించగా వచ్చే ఏడాది (2023-24)లో అది రూ.4.39కి తగ్గుతుందని ఈఆర్సీ అంచనా వేసింది. సౌరవిద్యుత్ అందుబాటులోకి వస్తున్నందున సగటు వ్యయం తగ్గుతుంది.
* ఇలాగే రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి కలిపి ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటు వ్యయం (ఏసీఎస్) రూ.7.03 ఉండగా వచ్చే ఏడాదికి రూ.7.02కి తగ్గుతుందని అంచనా వేస్తున్నాం.
* డిస్కంలు అధిక ధరలకు కరెంటు కొని సరఫరా చేస్తున్నాయి. ప్రజలు పొదుపుగా వాడుకుంటే వారికి, డిస్కంలపైనా ఆర్థికభారం తగ్గుతుంది.
* ప్రభుత్వం భారీస్థాయిలో రూ.12,718 కోట్ల ట్రూఅప్ ఛార్జీలను, రాయితీ కింద మరో రూ.9124 కోట్లను ఇస్తున్నందున వచ్చే ఏడాది నుంచి డిస్కంలు అంతర్గత సామర్థ్యం పెంచుకుని, ఇకనుంచి ఆర్థిక అవసరాలకు ప్రభుత్వంపై ఆధారపడకుండా పనిచేయాలి.
* వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల వద్ద డిస్కంలు తప్పనిసరిగా మీటర్లు పెట్టి ఎంత కరెంటు సరఫరా చేస్తున్నారో లెక్కించాలి.
* ప్రభుత్వ కార్యాలయాలకు వాడుకున్న కరెంటు నెలవారీ బిల్లుల బకాయిలు రూ.21 వేల కోట్లకు చేరాయి. వాటిని వసూలు చేయాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’