డాక్టరు, టీచర్లలో అమ్మాయిలదే ఆధిపత్యం!
మనదేశంలో ప్రాథమిక పాఠశాల్లో పాఠాలు బోధిస్తున్న ప్రతి వంద మంది పురుష టీచర్లతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయులు 126 మంది ఉన్నారు.
పీజీ డిగ్రీ కోర్సుల్లోనూ వారే ముందంజ..
ఇంజినీరింగ్, ఐటీ డిగ్రీలలో అబ్బాయిల హవా
కేంద్ర గణాంక శాఖ అధ్యయనంలో వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: మనదేశంలో ప్రాథమిక పాఠశాల్లో పాఠాలు బోధిస్తున్న ప్రతి వంద మంది పురుష టీచర్లతో పోలిస్తే మహిళా ఉపాధ్యాయులు 126 మంది ఉన్నారు. వైద్యం, సైన్స్ డిగ్రీ కోర్సుల్లోనూ అతివలు దూసుకెళుతున్నారు. మరోవైపు ఐటీ, ఇంజినీరింగ్ డిగ్రీల్లో చేరుతున్న అమ్మాయిల సంఖ్య అబ్బాయిలకన్నా తక్కువగా ఉంటోంది. 2020-21లో మొత్తం 45.80 లక్షల మంది పీజీ డిగ్రీ కోర్సుల్లో చేరగా వీరిలో అమ్మాయిలే 25.83 లక్షల మంది ఉన్నారు. అబ్బాయిలు ఎక్కువ శాతం డిగ్రీతో చదువు ఆపేస్తుంటే అమ్మాయిలు ఎక్కువగా పీజీలో చేరుతున్నారు. పీహెచ్డీల విషయంలో మాత్రం అబ్బాయిలే ముందుంటున్నారని కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల మంత్రిత్వ శాఖ అధ్యయనంలో తేలింది. ‘భారతదేశంలో పురుషులు-మహిళలు-2022’ పేరుతో ఈ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక అనేక రంగాల్లో అమ్మాయిలు, అబ్బాయిల పురోగతిని వివరించింది. దేశంలో చదువుతో సంబంధం లేకుండా 82 శాతం మంది మహిళలు ఎలాంటి ఆదాయం ఇవ్వని ఇంటి పనులు రోజుకు 5 గంటలపైనే చేస్తున్నారని ఈ నివేదిక స్పష్టం చేసింది. 60 ఏళ్లు దాటాకే పురుషులు ఇంటి పనుల్లో సాయపడుతున్నారు.
నివేదికలోని ముఖ్యాంశాలు...
* దేశంలో 2020-21 నాటికి 25 ఏళ్లకుపైగా వయసు గల పురుషుల్లో కనీసం సెకండరీ స్థాయి విద్యనభ్యసించినవారు 60 శాతం ఉన్నారు.
* 2020-21లో దేశవ్యాప్తంగా వివిధ డిగ్రీ కోర్సుల్లో చేరిన వారి సంఖ్యను పరిశీలిస్తే ఆకర్షణీయమైన జీతాలు లభించే ఐటీ, కంప్యూటర్ డిగ్రీ కోర్సుల్లో 5.33 లక్షల మంది అబ్బాయిలుంటే 3.44 లక్షల మందే అమ్మాయిలున్నారు.
* డాక్టర్లుగా డిగ్రీ పట్టాలు పుచ్చుకునే ఎంబీబీఎస్, ఎండీ, ఆయుర్వేద, హోమియో డిగ్రీల్లో చేరే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. మొత్తం వైద్య కోర్సుల్లో 6.32 లక్షల మంది అబ్బాయిలుంటే అమ్మాయిలు 8.94 లక్షల మంది ఉండటం గమనార్హం.
* మేనేజ్మెంట్ డిగ్రీలో 5.16 లక్షల మంది అబ్బాయిలుండగా.. 2.98 లక్షల మంది అమ్మాయిలున్నారు.
* న్యాయవిద్యలో 3.16 లక్షల అబ్బాయిలు, 1.61 లక్షల మంది అమ్మాయిలు ఉన్నారు.
* విదేశీ భాషలను అభ్యసించే డిగ్రీ కోర్సుల్లో అమ్మాయిలే 18 వేల మంది ఎక్కువగా ఉన్నారు.
* వ్యాయామ విద్యా డిగ్రీ కాలేజీల్లో 44,907 మంది బాలురుండగా.. 19,190 మంది మాత్రమే అమ్మాయిలున్నారు.
* జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్ కోర్సుల్లో అమ్మాయిల సంఖ్య ఎక్కువగా ఉంది.
అక్షరాస్యత, ఇంటర్నెట్..
* రోజూ ఇంటర్నెట్ వినియోగిస్తున్న వారు 2017-18లో దేశవ్యాప్తంగా 17.6 శాతం మంది ఉన్నారు.
ఈ విభాగంలో తెలంగాణ 22.2 శాతంతో జాతీయ సగటు 17.6 కన్నా ముందుంటే ఏపీ 14.8 శాతంతో వెనుకబడి ఉంది.
* దేశవ్యాప్తంగా 2017-18లో 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయసువారిలో అక్షరాతస్యత దామన్ దీవ్, గోవా, లక్షదీవుల్లో 100 శాతముంటే పుదుచ్చేరిలో 99.98, కేరళలో 99.71 శాతముంది. జాతీయ సగటు 94.31 కాగా తెలంగాణలో 96.88, ఏపీలో 92.81 శాతమున్నట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
పాలిటెక్నిక్ లెక్చరర్స్ జీఆర్ఎల్ వెల్లడి
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో లెక్చరర్ పోస్టులకు నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా జనరల్ ర్యాంకు జాబితాను (జీఆర్ఎల్) టీఎస్పీఎస్సీ ప్రకటించింది. -
డీఎంఈ పరిధిలోని.. 16,024 మంది సిబ్బంది సేవల పొడిగింపు
వైద్య విద్య డైరెక్టర్(డీఎంఈ) పరిధిలోని వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, గౌరవవేతనంతో విధులు నిర్వహిస్తున్న 16,024 మంది సిబ్బంది సేవలను మరో ఏడాది పాటు పొడిగిస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి 4 టీఎంసీలు తరలించిన ఏపీ: తెలంగాణ ఫిర్యాదు
నాగార్జునసాగర్ ప్రాజెక్టు దిగువన విద్యుత్ ఉత్పత్తికోసం నిర్మించిన టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోయిందని కృష్ణా బోర్డుకు తెలంగాణ ఫిర్యాదు చేసింది. -
ఇచ్చంపల్లి నుంచే కావేరికి.. గోదావరి జలాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి నదిపై ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణం చేపట్టి, అక్కణ్నుంచి కావేరి పరీవాహకానికి నీటిని తరలించాలని దాదాపు నిర్ణయానికొచ్చారు. -
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటేసిన సరిహద్దు గ్రామాల ఓటర్లు!
కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు మధ్య 12 వివాదాస్పద గ్రామాలున్నాయి. -
కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల స్వాధీనం
వికారాబాద్ జిల్లా నవాబ్పేట మండలంలో ఎన్నికల నియమావళికి విరుద్ధంగా కారులో తరలిస్తున్న రూ.1.50 కోట్ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
రికార్డు స్థాయిలో వేసవి రైళ్లు
వేసవి కాలంలో పెరిగే రాకపోకలకు అనుగుణంగా ఈసారి రికార్డు స్థాయిలో ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. -
బతుకమ్మ చీరల బకాయిలు రూ.50 కోట్లు విడుదల
బతుకమ్మ చీరల తయారీకి సంబంధించి నేత కార్మికులకు చెల్లించాల్సిన బకాయిల్లో రూ.50 కోట్లను వెంటనే విడుదల చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం అధికారులను ఆదేశించారు. -
నటుడు రఘుబాబు అరెస్టు.. బెయిలు
నార్కట్పల్లి- అద్దంకి రహదారిపై ఈ నెల 17న నల్గొండ పట్టణ సమీపంలో సినీ నటుడు ఎర్ర రఘుబాబు కారు ఢీకొని భారాస నాయకుడు జనార్ధన్రావు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లపై వివరణ ఇవ్వండి
ఒకటో తరగతికి కనీస వయసు ఆరేళ్లు ఉండాలంటూ జారీ చేసిన ఉత్తర్వులపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు శుక్రవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
గురుకులంలో అల్పాహారం వికటించి 25 మందికి అస్వస్థత
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో అల్పాహారం వికటించి 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. -
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ సీఎస్
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి దంపతులు శుక్రవారం తెల్లవారుజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. -
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో మరో ఎస్సై సస్పెన్షన్
పోలీసు శాఖలో సస్పెన్షన్ల పరంపర కొనసాగుతోంది. రెండు రోజుల క్రితం ఆరుగురు పోలీస్ అధికారులను, సిబ్బందిని మల్టీజోన్-1 ఐజీ సస్పెండ్ చేయగా.. తాజాగా మరో ఎస్సైపై వేటు పడింది. -
దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాలు
వ్యవసాయరంగ అభివృద్ధితోపాటు రైతులకు విస్తృతమైన సేవలందించేందుకు దేశంలో మరో 114 కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే)ను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి(ఐకార్) డైరెక్టర్ జనరల్ హిమాన్ష్ పాఠక్ తెలిపారు. -
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు.