ఉద్యోగాలిచ్చే బాధ్యత మాదే
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిబాటలో సాగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికే పరిపాలనా పాఠాలు చెప్పే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు.
దేశానికి తెలంగాణ పరిపాలనా పాఠాలు
పెద్దఅంబర్పేట్ ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్
ప్రతిపక్షాల మాయలో పడొద్దని నిరుద్యోగులకు సూచన
అబ్దుల్లాపూర్మెట్, న్యూస్టుడే: ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిబాటలో సాగుతోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశానికే పరిపాలనా పాఠాలు చెప్పే స్థాయిలో తెలంగాణ ఉందన్నారు. ఈ మాటను కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్పిందన్నారు. పార్టీ నేత, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కుమారుడు ప్రశాంత్కుమార్రెడ్డి చేపట్టిన ప్రగతి నివేదన యాత్ర ముగింపు సందర్భంగా శనివారం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పెద్దఅంబర్పేట్ ఓఆర్ఆర్ కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. ప్రశాంత్కుమార్రెడ్డి 63 రోజులపాటు 771 కిలోమీటర్ల పాదయాత్ర చేసి ప్రజా సమస్యలపై నివేదిక అందించినట్లు తెలిపారు. ఆయా సమస్యలను పరిష్కరించే బాధ్యతను తమపై పెట్టారని అభినందించారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లో ప్రశ్నపత్రం లీకైనట్లు గుర్తించిన వెంటనే పరీక్షలు రద్దు చేశామని, త్వరలో తిరిగి నిర్వహిస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. బాధ్యులను విడిచిపెట్టేది లేదన్నారు. కొందరు వెంటనే తనను రాజీనామా చేయాలని, బర్తరఫ్ చేయాలంటున్నారని, అది ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అని, విద్యాశాఖకు, ఐటీశాఖకు సంబంధం లేదన్నారు. పొరపాట్లను సవరించుకొని ముందుకువెళ్తామన్నారు. జరిగిన నష్టానికి తామంతా చింతిస్తున్నామన్నారు. యువతకు ఉద్యోగాలిచ్చే బాధ్యత తమదని, చిల్లర మనుషుల కుట్రలో చిక్కుకోవద్దని కోరారు. నిరుద్యోగులపై ప్రతిపక్షాల కంటే ఎక్కువ ప్రేమ సీఎం కేసీఆర్కే ఉందన్నారు. ఎనిమిదిన్నరేళ్లలో తెలంగాణలో జరిగినన్ని ఉద్యోగ నియామకాలు దేశంలో ఎక్కడైనా జరిగాయా అని ప్రశ్నించారు.
మరిన్ని ఉపాధి అవకాశాలు
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని కొంగర కలాన్లో 200 ఎకరాల్లో ఫాక్స్కాన్ పరిశ్రమ రాబోతోందని, మే నెలలో పనులు మొదలవుతాయన్నారు. దీంతో హైదరాబాద్ చుట్టుపక్కల లక్ష మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయన్నారు. యాచారం, మంచాలలో పరిశ్రమలు రావాలని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి కోరుతున్నారన్నారు. తన స్వగ్రామం ఎల్మినేడులో ఏరోస్పేస్ రంగానికి చెందిన పరిశ్రమ కావాలంటున్నారని, ఇవన్నీ మీకు ఉద్యోగాలు రావాలనే తాపత్రయంతోనే అడుగుతున్నారన్నారు. పాలమూరు- రంగారెడ్డి పథకం ద్వారా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలకు సాగునీరందించేందుకు కాల్వలు తవ్వుతున్నామని, రిజర్వాయర్లు కడుతున్నామని కేటీఆర్ వివరించారు. స్థానిక కాంగ్రెస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కోతులను పట్టుకొని ఫొటోలు దిగుతున్నారని, దేశమంతటా ఉన్న కోతుల సమస్య.. తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాల్లోనే ఎక్కువుందని చమత్కరించారు. ఇబ్రహీంపట్నంలో పోటీకి తహతహలాడుతున్న కాంగ్రెస్ నేత ఎల్బీనగర్ బస్సుల అడ్డాలో ఏం చేశారో తెలుసని ఎద్దేవా చేశారు.
ఒక్క ఛాన్స్ అని ఒకరు.. మిత్రోం అంటూ మరొకరు..
ఒక్క ఛాన్స్ ఇవ్వాలంటున్న కాంగ్రెస్ నాయకులకు ప్రజలు గతంలో 50 ఏళ్లు అధికారం ఇచ్చినా కరెంటు, మంచినీళ్లు ఇవ్వడం వారికి చేతకాలేదన్నారు. 2014లో ప్రధాని మోదీ మిత్రోం.. అంటూ జన్ధన్ ఖాతాలు తెరవండి.. రూ.15 లక్షల చొప్పున ఖాతాల్లో వేస్తానని చెప్పలేదా.. ఒక్కరికైనా ఆ సొమ్ము వేశారా అని ప్రశ్నించారు. మోదీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలిస్తానన్నారని, అంటే తొమ్మిదేళ్లలో 18 కోట్ల ఉద్యోగాలివ్వాల్సి ఉండగా 18 లక్షలు కూడా ఇవ్వలేదన్నారు. భాజపా నాయకులు నిరుద్యోగ మార్చ్ అంటున్నారని, అది దిల్లీలో మోదీ ఇంటి ముందు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంలో 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ సభలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీలు పట్నం మహేందర్రెడ్డి, ఎల్.రమణ, రంగారెడ్డి జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ అనితారెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ సాయిచంద్, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పార్టీ నాయకుడు క్యామ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.