సంక్షిప్త వార్తలు(4)
తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం నిర్వహించిన పోలీస్ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది.
పోలీస్ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతం
60.92 శాతం మంది అభ్యర్థుల హాజరు
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి(టీఎస్ఎల్పీఆర్బీ) ఆదివారం నిర్వహించిన పోలీస్ రవాణా సంస్థ ఎస్సై పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. హైదరాబాద్లో జరిగిన ఈ పరీక్షలో మొత్తం 975 మంది అభ్యర్థులకు 594 మంది(60.92శాతం) హాజరయ్యారు. పరీక్ష కేంద్రంలో అభ్యర్థుల బయోమెట్రిక్, డిజిటల్ వేలిముద్రల్ని సేకరించారు. పరీక్ష ప్రాథమిక కీని త్వరలోనే మండలి వెబ్సైట్లో పొందుపరచనున్నట్లు మండలి ఛైర్మన్ వి.వి.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు.
మిషన్ కాకతీయతో పెరిగిన భూగర్భ జలాలు: వినోద్
ఈనాడు, హైదరాబాద్: నీరే భవిష్యత్తుకు జీవనాధారమని, కురిసే ప్రతినీటి బొట్టునూ ఒడిసిపట్టుకుని పొదుపుగా వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్కుమార్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం, గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠాన్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంయుక్త ఆధ్వర్యంలో నీటి ప్రాధాన్యాన్ని వివరిస్తూ చేపట్టిన జనచైతన్య ప్రచారయాత్రను ఆయన హైదరాబాద్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సదస్సు, తెలుగు రాష్ట్రాల స్థాయి కవిత్వ ఉత్సవంలో వినోద్కుమార్ మాట్లాడారు. నీటివిలువ తెలుసుకున్న సీఎం కేసీఆర్ మిషన్ కాకతీయ ద్వారా దాదాపు 44 వేల చెరువుల్లోని పూడికలు తీయించారని, దీనిద్వారా భూగర్భజలాలు పెరిగాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా భూగర్భ జలమట్టాలు పెరిగాయన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థల ప్రచురణలను వినోద్కుమార్ ఆవిష్కరించి కవులను సన్మానించారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీజ్ఞాన్ ప్రతిష్ఠాన్ సంస్థలఛైర్మన్ డాక్టర్ జి.రాజేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సంస్థల ప్రధాన కార్యదర్శి డాక్టర్ యానాల ప్రభాకర్రెడ్డి, జలమండలి ఓఎస్డీ జాల సత్యనారాయణ, తెలుగు రాష్ట్రాల కవులు పాల్గొన్నారు.
‘తెలంగాణ రాజ్య సమితి’ పార్టీ ఏర్పాటుకు దరఖాస్తు
సిద్దిపేట అర్బన్, న్యూస్టుడే: ఉపాధి హామీ పథకం రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, భారాస నేత తుపాకుల బాలరంగం ‘తెలంగాణ రాజ్య సమితి’ పేరిట కొత్త పార్టీ ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించారు. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాల గ్రామానికి చెందిన బాలరంగం.. దిల్లీ వెళ్లి ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 12న దరఖాస్తు సమర్పించారు. అనంతరం ఆదివారం స్వగ్రామానికి వచ్చిన బాలరంగంను ‘న్యూస్టుడే’ సంప్రదించగా భారాసతోనే తన ప్రయాణం కొనసాగుతుందన్నారు. భవిష్యత్తులో ప్రజలు, స్థానిక ప్రజాప్రతినిధుల సమస్యలు పరిష్కారానికి నోచుకోని సందర్భాల్లోనే ప్రత్యామ్నాయంగా కొత్త పార్టీ తరఫున ముందుకు సాగుతానని వెల్లడించారు.
ఆర్టీసీకి రూ.4 వేల కోట్లు ఇవ్వాలి
ఈనాడు, హైదరాబాద్: డిస్కంలు అదనంగా ఖర్చుపెట్టిన రూ.12,718 కోట్ల భారాన్ని ప్రజలపై వేయకుండా తామే భరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని, కరోనా కాలంలో తీవ్రంగా నష్టపోయిన టీఎస్ఆర్టీసీకి కూడా రూ.4 వేల కోట్ల గ్రాంటు ఇవ్వాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్ ఎం.నాగేశ్వరరావు కోరారు. పాత బస్సుల స్థానంలో కొత్తవాటి కొనుగోలు, వేతన సవరణకు సహాయపడాలని కోరారు. టీఎస్ఆర్టీసీలో 2017, 2021కి సంబంధించి వేతన సవరణ చేయాలని ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్
-
నేడు ఉప్పల్లో ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
-
తాగి చెస్ ఆడా.. ప్యాంట్లో మూత్రం పోసుకున్నా..