కుటుంబాల కంటే వాహనాలే అధికం
తెలంగాణలో ఏటేటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కోటీ 20 లక్షల కుటుంబాలుండగా వాహనాల సంఖ్య కోటీ 53 లక్షలు దాటింది.
రాష్ట్రవ్యాప్తంగా 1.53 కోట్ల వాహనాలు
అందులో 86 శాతానికి పైగా కార్లు, మోటారు సైకిళ్లే
రాష్ట్రవ్యాప్తంగా 7 లక్షల ట్రాక్టర్లు
ఈనాడు - హైదరాబాద్
తెలంగాణలో ఏటేటా వాహనాల సంఖ్య భారీగా పెరుగుతోంది. రాష్ట్రంలో కోటీ 20 లక్షల కుటుంబాలుండగా వాహనాల సంఖ్య కోటీ 53 లక్షలు దాటింది. రవాణాశాఖ గణాంకాల ప్రకారం.. రాష్ట్రం ఆవిర్భవించిన 2014 జూన్ 2వ తేదీ నాటికి 71.52 లక్షల వాహనాలున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వాటి సంఖ్య 1.53 కోట్లు దాటగా.. ఇందులో ద్విచక్ర వాహనాలు 73.7 శాతం, కార్లు 13 శాతం ఉన్నాయి. వీటి తర్వాతి స్థానం ట్రాక్టర్లదే. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రకాలు కలిపి రోజూ కొత్తగా పెద్ద సంఖ్యలో వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. ఓవైపు వ్యక్తిగత వాహనాలు పెద్దఎత్తున పెరుగుతుండగా.. అదే సమయంలో ప్రజారవాణాకు సంబంధించి ఆర్టీసీ బస్సులు మాత్రం 10,479 నుంచి 9,164కి అంటే 12.5 శాతం తగ్గాయి. మరోవైపు వాహనాల అమ్మకాలు, రిజిస్ట్రేషన్లతో రవాణా శాఖకు భారీ ఆదాయం వస్తోంది. తొమ్మిదేళ్లలో 320 శాతం, నిరుటితో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 52 శాతానికి పైగా ఆదాయం పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇదే రికార్డు. కొత్త రాష్ట్రంలో సంపద సృష్టి, కుటుంబాల ఆదాయంలో భారీ వృద్ధి ఫలితంగానే వాహనాల సంఖ్య పెరుగుతోందని రవాణాశాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
258% పెరిగిన ట్రాక్టర్లు
రాష్ట్రంలో ట్రాక్టర్లు, ట్రైలర్ల సంఖ్య కూడా పెరుగుతోంది. తొమ్మిదేళ్లలో 2.69 లక్షల నుంచి ఫిబ్రవరి 23 నాటికి 6.96 లక్షలకు (258 శాతం) పెరిగింది. నెలాఖరుకు ఈ సంఖ్య ఏడు లక్షలను దాటే అవకాశం ఉంది. రాష్ట్రంలో వ్యవసాయ విస్తీర్ణం బాగా పెరుగుతుండటం, కూలీల కొరత ఉండటంతో ట్రాక్టర్లను కొనుక్కునే రైతుల సంఖ్య పెరుగుతోంది. పల్లెప్రగతిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామపంచాయతీకి ఓ ట్రాక్టర్ ఇవ్వడమూ ఓ కారణం. నదులు, ఉప నదుల్లోని ఇసుక ఆదాయ వనరుగా మారడంతో సమీప గ్రామాల్లో ట్రాక్టర్ల సంఖ్య భారీగా పెరగడమూ మరో ముఖ్య కారణంగా కనిపిస్తోంది.
‘లైఫ్’తోనే అధిక ఆదాయం
రవాణాశాఖ ఆదాయంలో లైఫ్ ట్యాక్స్, త్రైమాసిక పన్ను, యూజర్ ఛార్జీలు ప్రధాన ఆదాయ వనరులు. దాదాపు నాలుగింట మూడొంతుల ఆదాయం వ్యక్తిగత వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో వసూలు చేసే లైఫ్ ట్యాక్స్తోనే వస్తోంది.
ఎలక్ట్రిక్ వాహనాలు 0.37 శాతమే
డీజిల్, పెట్రోలు ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ ఆ ఇంధనాలతో నడిచే వాహనాల కొనుగోళ్ల దూకుడు తగ్గడం లేదు. కాలుష్యాన్ని, అంతకుమించి ఇంధన ఖర్చుల్ని భారీగా తగ్గించే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు రాష్ట్రంలో ఇంకా ఊపందుకోలేదు. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ వాహనాల సంఖ్య 60 వేల లోపే ఉంది. మొత్తం వాహనాల్లో ఇవి 0.37 శాతమే.
రవాణా రాబడి రయ్..రయ్
తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత తొలి ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ఆర్జించిన ఆదాయం రూ.రెండు వేల కోట్లలోపే. 2022-23 నాటికి ఇది మూడింతలు దాటింది. ఈ ఏడాది ఆదాయం రూ.ఆరు వేల కోట్ల పైచిలుకే. 2020-21లో కొవిడ్తో ఆదాయం తగ్గింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.