రాబడి ఘనం.. భద్రత శూన్యం
ప్రభుత్వానికి ఏటా రూ.2 వేల కోట్ల రాబడిని తెచ్చిపెట్టే మండల రెవెన్యూ కార్యాలయాల్లో భద్రత, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది.
తహసీల్దారు కార్యాలయాల్లో పనిచేయని సీసీ కెమెరాలు
కార్యాలయాల నిర్వహణకు నిధుల కొరత
ఈనాడు, హైదరాబాద్: ప్రభుత్వానికి ఏటా రూ.2 వేల కోట్ల రాబడిని తెచ్చిపెట్టే మండల రెవెన్యూ కార్యాలయాల్లో భద్రత, మౌలిక వసతుల కొరత తీవ్రంగా ఉంది. పాలనలో కీలకమైన తహసీల్దారు- సంయుక్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు పనిచేయని దుస్థితి. కార్యాలయ నిర్వహణకు కేటాయిస్తున్న బడ్జెట్ కూడా అంతంతమాత్రంగా మారింది. దీంతో వివిధ రకాల సేవలకు కార్యాలయానికి వచ్చే ప్రజలకు వసతులుండటం లేదు. భూముల రిజిస్ట్రేషన్లు, వివిధ రకాల ధ్రువీకరణ పత్రాల జారీతో పాటు దాదాపు 36 రకాల సేవలు అందించే కార్యాలయాలను చిన్నచూపు చూస్తున్నారంటూ రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి.
నిధులు ఏవీ...
రాష్ట్రంలో ఉన్న 584 సంయుక్త సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పనకు రెండేళ్ల కిందట పదేసి లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం కేటాయించింది. ధరణి కార్యాలయం, కంప్యూటర్లు, మౌలిక వసతుల కల్పన చేపట్టాలని సూచించినా.. చాలా జిల్లాల్లో అమలు కాలేదు. కొన్ని జిల్లాల్లో కలెక్టరేట్ల నుంచి తహసీల్దారు కార్యాలయాలకు సగం డబ్బులే మంజూరయ్యాయి. దీంతో శిథిల భవనాల్లోనే నడిపిస్తున్నారు. 2019లో రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ తహసీల్దారు విజయారెడ్డి హత్య అనంతరం ప్రభుత్వం ప్రతి తహసీల్దారు కార్యాలయంలో సీసీ కెమెరాలు, సెక్యూరిటీ, నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు మంజూరుచేసింది. దీంతో అన్నిచోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. అవి కొన్నిచోట్ల పనిచేయడంలేదు. కార్యాలయ నిర్వహణకు ఏడాదికి కనిష్ఠంగా రూ.40 వేలు మాత్రమే ప్రభుత్వం కేటాయిస్తోంది. వాస్తవ ఖర్చు రూ.లక్ష వరకు ఉంటోందని సిబ్బంది చెబుతున్నారు. నెలకు రూ.25 వేలు నిర్వహణ కింద కేటాయిస్తే తప్ప కార్యాలయాల నిర్వహణ కష్టమని ట్రెసా రాష్ట్రాధ్యక్షుడు వంగ రవీందర్రెడ్డి తెలిపారు. నిర్వహణ బడ్జెట్ కేటాయింపుపై గతంలోనే ప్రభుత్వానికి నివేదించామని ‘ఈనాడు’కు తెలిపారు.
వివాదాలు ఎందుకంటే...
మండల స్థాయిలో వివిధరకాల భూ సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. ధరణి రిజిస్ట్రేషన్ల సందర్భంగా పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రక్రియను నిలిపివేస్తున్న సందర్భాలు ఉంటున్నాయి. కొన్ని తహసీల్దారు కార్యాలయాల వద్ద ఒక్కోసారి ఘర్షణలు నెలకొన్న పరిస్థితులు ఉంటున్నాయి. మీసేవా కేంద్రంలో స్లాటు నమోదైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియను నిలిపివేసే అధికారం ఎవరికీ లేకుండా ధరణి చట్టాన్ని రూపొందించారు. తెలిసీ తప్పు జరుగుతుంటే మాత్రమే ఉన్నతాధికారుల సలహా మేరకు ప్రక్రియను ఆపుతున్నారు. ఈ సందర్భంగా భూ యజమానులు వాగ్వాదానికి దిగుతున్నారు.
బ్యాంకులో పాసుపుస్తకం తాకట్టు ఉందంటూ భూమి రిజిస్ట్రేషన్ నిలిపివేసినందుకు వరంగల్ జిల్లా నల్లబెల్లి తహసీల్దారు- సంయుక్త సబ్రిజిస్ట్రారుపై ఇటీవల పెట్రోలు పోసి తగలబెడతామంటూ కొందరు బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ సంఘటన తాలూకు దృశ్యాలను రికార్డు చేయాల్సిన సీసీ కెమెరాలు పనిచేయడమే లేదు. ధరణి సేవలను అందించేందుకు ప్రభుత్వం కేటాయించిన రూ.10 లక్షలు ఇప్పటికీ మంజూరు కాలేదు. ఈ భవనంలో వర్షం కురుస్తుండగా.. గోడలు పగుళ్లు వచ్చాయి. సీసీ కెమెరాలు పనిచేయడంలేదు. రాష్ట్రంలో దాదాపు రెండొందల కార్యాలయాలు సమస్యలతో సతమతమవుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
పవన్ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.. పిఠాపురంలో నేతల సంకల్పం
-
భారత విద్యార్థి మృతి.. మరోసారి చర్చలోకి బ్లూవేల్ ఛాలెంజ్..!
-
చిలుకూరు ఆలయంలో ‘వివాహ ప్రాప్తి’ రద్దు: ప్రధాన అర్చకులు రంగరాజన్
-
ఈ పోలింగ్ ‘బ్యూటీ’ ఇంటర్నెట్ సెన్సేషన్.. ఎవరీ ఈశా అరోడా..?
-
ఆ సినిమా నుంచి గుణపాఠం నేర్చుకున్నా: సోనాలి బింద్రే
-
దిల్లీ కోటలో తొలి మ్యాచ్.. హైదరాబాద్ దూకుడు కొనసాగేనా?