ట్రామాకేర్ విధానం.. తమిళనాడులో ఉత్తమం
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరం చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడే ‘ట్రామాకేర్ వ్యవస్థ’ తమిళనాడులో ఆదర్శంగా పనిచేస్తోంది.
అంబులెన్సులు చేరుకునే వేగం పెరిగింది.. మరణాలు తగ్గాయి
48 గంటల పాటు ఉచితంగా వైద్యసేవలు
తెలంగాణలో కార్యాచరణ కోసం అధ్యయనం
ఈనాడు, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరం చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడే ‘ట్రామాకేర్ వ్యవస్థ’ తమిళనాడులో ఆదర్శంగా పనిచేస్తోంది. దేశంలోనే అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఎక్కువమంది చనిపోతున్న ఆ రాష్ట్రంలో అయిదేళ్ల క్రితం ప్రారంభించిన వ్యవస్థ సత్ఫలితాలిస్తోంది. రైట్ పేషెంట్, రైట్ సెంటర్, రైట్ టైమ్ అనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమలు చేస్తోంది. ప్రమాదాల సంఖ్య 2.27 శాతం పెరిగినా మరణాల్లో 1.35 శాతం తగ్గించగలిగినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ప్రమాద స్థలానికి అంబులెన్స్ చేరుకునే సమయం గతంలో 18.09 నిమిషాలు కాగా తాజాగా 13.51 నిమిషాలకు తగ్గించగలిగినట్లు పేర్కొంది. ప్రమాదం జరిగిన వెంటనే (గోల్డెన్ అవర్లో) అత్యవసర చికిత్స అందిస్తే 54 శాతం నుంచి 90 శాతం మంది ప్రాణాలను కాపాడవచ్చునని నిపుణులు చెప్తున్నారు.
ఏం చేశారంటే...
‘ప్రాణాలను కాపాడటమే ధ్యేయం’ నినాదంతో తమిళనాడులో ప్రత్యేక ట్రామాకేర్ వ్యవస్థకు నాంది పలికారు. ఈ విభాగానికి ప్రత్యేకంగా కమిషనర్ను నియమించారు. ప్రమాదం జరిగినపుడు సమాచారం తీసుకోవడం, తీవ్రతను అంచనావేయడం, స్పందించడం, చేరుకోవడం, అత్యవసరవైద్యం అందించడం, ప్రధాన ఆసుపత్రుల్లో వైద్యసేవలు కొనసాగించడం అనే లక్ష్యాలతో నడుస్తోంది. ఎమర్జెనీ రెస్పాన్స్ సెంటర్లో నాలుగు షిఫ్టులుగా సిబ్బంది 24 గంటలూ సేవలు అందిస్తున్నారు. అత్యంత వేగంగా ప్రమాదస్థలికి అంబులెన్స్లు చేరుకోవడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు. అత్యాధునిక వైద్య పరికరాలు, వసతులు ఏర్పాటు చేశారు. వాటిలోనే ప్రాథమిక వైద్యం అందించడమే కాకుండా సమీపంలోని ఆసుపత్రికి ముందస్తు సమాచారం ఇస్తారు. అక్కడ 1,353 అంబులెన్స్లు, 94 ట్రామాకేర్ సెంటర్లు ఉన్నాయి. న్యూరో సర్జరీ, ప్లాస్టిక్, రీకన్స్ట్రక్టివ్ సర్జరీ, రేడియాలజీ, ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, అనస్థీషియా, క్రిటికల్ కేర్ మెడిసిన్ వంటి స్పెషలిస్ట్ విభాగాల్లో ప్రత్యేక వైద్యసేవలు అందించేలా ఏర్పాట్లు ఉన్నాయి.
లక్ష రూపాయల వరకు ఉచిత వైద్యం
ట్రామామెషిన్ ద్వారా తీవ్రత అంచనాతోపాటు సీటీ స్కాన్, ఎంఆర్ఐ, మొబైల్ ఎక్స్రే, క్యాత్ల్యాబ్ సహా అత్యాధునిక వైద్య సదుపాయాలు ట్రామాకేర్ సెంటర్లలో ఉన్నాయి. ప్రత్యేకంగా స్పెషలిస్ట్ల పోస్టులను ఏర్పాటు చేశారు. 22 వైద్య కళాశాలల్లో అత్యవసర వైద్యంలో ప్రత్యేకంగా 84 పీజీ సీట్లను అందుబాటులోకి తెచ్చారు. వివిధ విభాగాల్లో 25 వేలమందికి పైగా అత్యవసర చికిత్సపై అవగాహన, శిక్షణ కార్యక్రమాలు కల్పించారు. క్షతగాత్రులకు 48 గంటల పాటు ఉచితంగా అత్యాధునిక వైద్యం అందించడానికి ఏర్పాట్లు చేశారు. గాయపడినవారు ఎవరైనా ఒక్కొక్కరికి లక్ష రూపాయల దాకా ఎలాంటి రుసుం తీసుకోకుండా వైద్యం అందిస్తారు. తమిళనాడు ప్రభుత్వం ఏటా దీనికి రూ.150 కోట్లను కేటాయిస్తోంది.
తెలంగాణలో 2021లో 7,557 మంది మృతి
తెలంగాణలో 2021లో రోడ్డు ప్రమాదాల్లో 7,557 మంది చనిపోయినట్లు జాతీయ నేర గణాంకాల నివేదిక-2021లో పేర్కొన్నారు. రాష్ట్రంలో ఆ ఏడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 20,107 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో మూడో వంతుకుపైగా చనిపోయారు. దేశంలో రోడ్డు ప్రమాదాల్లో మృతిచెందినవారిలో 11.6 శాతం మంది తెలంగాణలో జరిగిన ప్రమాదాల్లోని వారే.
రాష్ట్రంలో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుపై దృష్టి
ప్రమాదాలకు గురై తీవ్రంగా లేదా స్వల్పంగా గాయపడినవారికి సత్వరం వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలో ట్రామాకేర్ సెంటర్ల ఏర్పాటుపై రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ నేతృత్వంలో వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు గంగాధర్, రమేశ్రెడ్డి, అజయ్కుమార్, చంద్రశేఖర్రెడ్డి, ఇతర అధికారులు తమిళనాడులో అమలవుతున్న ట్రామాకేర్ విధానంపై అధ్యయనం చేశారు. రాష్ట్రంలోనూ ప్రత్యేక ట్రామాకేర్ విధానం రూపకల్పన దిశగా ప్రత్యేక కార్యాచరణకు రంగం సిద్ధమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
రైతులు, రైతు కూలీలకు రిజర్వేషన్లు కల్పించాలి
‘ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు, రైతు కూలీల వంటి వర్గాలకు న్యాయం జరగాలంటే వారికి న్యాయవ్యవస్థ సహా వివిధ శాఖల్లో ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలి. -
నీ పేరు బయటికి వస్తుందని సీబీఐ దర్యాప్తు వద్దన్నావా?
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్ను వివేకా కుమార్తె సునీతారెడ్డి నిలదీశారు. -
తిరుమల నడకదారిలో చిరుత కలకలం
అలిపిరి-తిరుమల నడకదారిలో మరోసారి చిరుత సంచారం కలకలం సృష్టించింది. ఈ నెల 25, 26వ తేదీల్లో తెల్లవారుజామున నడకదారికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించిందని తితిదే అటవీ శాఖ డీఎఫ్వో శ్రీనివాసులు గురువారం వెల్లడించారు. -
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
పఫర్ ఫిష్
విశాఖలోని సాగర తీరంలో గురువారం మత్స్యకారుల వలకు విభిన్న తరహా సముద్ర జీవులు చిక్కాయి. -
కొంచెం ఓపిక పట్టండి.. అంతా మంచే జరుగుతుంది
‘సార్.. మాపై చాలా కేసులు పెట్టారు. దీంతో చాలామందికి పాస్పోర్టులు ఆగిపోయాయి. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
కేజ్రీవాల్ కోసం మెసేజ్లు పంపండి.. వాట్సప్ నంబరు షేర్ చేసిన సతీమణి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అప్పుడు ధోనీ నన్ను ఎత్తుకోవడం ఎంతో ఆనందం కలిగించింది..: రవీంద్ర జడేజా
-
కేసీఆర్ చేసిన మొదటి తప్పు అదే: మంత్రి కోమటిరెడ్డి
-
దెబ్బతీయాలనుకునేవారికి ప్రజలే జవాబు చెప్తారు: కేటీఆర్
-
మాకు కొత్త కెప్టెన్ ఉన్నాడు..: యాంకర్ ప్రశ్నకు ధోనీ సమాధానం