అన్నదాతకు ‘అకాల’ కష్టం
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా ఏటా యాసంగి సీజన్లో అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని రైతులను గట్టెక్కించే ముందస్తు సన్నద్ధత అంతగా కనిపించడం లేదు.
ఏటా యాసంగిలో వర్షాలు
ముందస్తు సన్నద్ధత ఏదీ!
సాయంపైనా తకరారు
ఈనాడు - హైదరాబాద్
ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లుగా ఏటా యాసంగి సీజన్లో అకాల వర్షాలతో అన్నదాతలు కుదేలవుతున్నారు. ఈ పరిస్థితులను ఎదుర్కొని రైతులను గట్టెక్కించే ముందస్తు సన్నద్ధత అంతగా కనిపించడం లేదు. మరోవైపు పంట నష్టాలకు సాయంపై తకరారు తప్పడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఎకరానికి రూ.10 వేల చొప్పున నష్టపరిహారం ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు.
రాష్ట్రంలో యాసంగి సీజన్లో సంభవిస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు అన్నదాతల పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఈ సీజన్ అంటేనే పలువురు రైతుల్లో ఆందోళన నెలకొంటోంది. 2015 నుంచి ఈ ఏడాది వరకు ఏటా జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో కురిసిన అకాల వర్షాలకు వేల ఎకరాల్లో పంటనష్టం వాటిల్లింది. కొన్నిసార్లు వడగళ్లు కూడా పడటంతో రైతులు మరింతగా నష్టపోయారు. గత వారం భారీ వర్షాలు, వడగళ్లు, ఈదురుగాలులతో 22 జిల్లాల్లోని దాదాపు 2.28 లక్షల ఎకరాల్లో పంటనష్టం సంభవించింది. ఈ నష్టాలు ఉమ్మడి వరంగల్, నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్ జిల్లాల్లో అధికంగా ఉన్నాయి.
సాధారణంగా సీజన్ల వారీగా కొన్ని అంచనాలతో రైతులు పంట పండిస్తున్నారు. యాసంగిలో వర్షాల భయం ఉండదనే నమ్మకం వారిలో ఉంటుంది. ఈ తరుణంలో వర్షాలు, వడగళ్లు వారి ఆశలకు గండి కొడుతున్నాయి. ప్రధానంగా వరి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలకు నష్టం వాటిల్లుతోంది. మామిడి వంటివి కోత దశలో నేలపాలవుతున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు వరకు రైతులు పంటలను కాపాడుకుంటేనే అవి చేతికి దక్కుతాయి. అకాల వర్షాల భయం వీడక పోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
పంట నష్టాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తు నిర్వహణ నిధుల నుంచి సాయం అందించాలి. అకాల వర్షాల విషయంలో సాయం సరిగా అందడం లేదు. రాష్ట్రంలో బీమా పథకం అమల్లో లేదు. పరిహారం అందడం లేదు. అకాల వర్షాలు కొద్దిరోజులే ఉంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమాచారం అందించినా పంటనష్టం అంచనా బృందాలు సకాలంలో రావడం లేదు. ఆ తర్వాత వచ్చినా పంట నష్టాలను స్వయంగా చూసేది ఉండదు. ఛాయాచిత్ర ప్రదర్శనలను చూసి వెళ్తున్నాయి. సాయానికి సంబంధించి శాస్త్రీయ అంచనాలు, గణాంకాలు నమోదు కావడం లేదు. దీనిని కారణంగా చూపుతూ నష్టాలకు పరిహారం ఇవ్వడం లేదు. గత ఏడాది భారీ నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇవ్వగా.. కేంద్రం నుంచి సాయం రాలేదు. దీంతో ఈ ఏడాది తెలంగాణ ప్రభుత్వం సొంత నిధులను ఎకరానికి రూ.10 వేలు చెల్లిస్తామని ప్రకటించింది.
ఏటా అకాల వర్షాలు పడుతున్నా రైతులు ఈ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు సన్నద్ధం చేయడం లేదు. సీజన్కు ముందు వారిలో చైతన్యం కలిగించడంతో పాటు.. అకాల వర్షాలను తట్టుకొని నిలిచే పంటల సాగును ప్రోత్సహించడం వంటి చర్యలు కనిపించడం లేదు. కేవలం వర్షాలకు ఒకటి, రెండు రోజుల ముందే వాతావరణ శాఖ హెచ్చరికలు చేస్తోంది. అప్పటికప్పుడు పంట నష్టాలను నివారించే మార్గం అన్నదాతలకు కనిపించడం లేదు.
నెల రోజుల ముందుకు సీజన్!
రాష్ట్రంలో ఏటా అకాల వర్షాలతో రైతులకు తీవ్రనష్టం కలుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. యాసంగి సీజన్ను నెల రోజులు ముందుకు జరపాలనే ప్రతిపాదనను పరిశీలిస్తోంది. ఈమేరకు వచ్చే యాసంగిని అక్టోబరు నుంచి ప్రారంభించి ఫిబ్రవరి లేదా మార్చిలో ముగించాలని యోచిస్తోంది. ఇప్పటికే కామారెడ్డి, నిజామాబాద్, సూర్యాపేట జిల్లాల్లో ఈ విధానం నడుస్తోంది. తద్వారా ఆ పంటలకు అకాల వర్షాల ముప్పు తగ్గుతోంది. తాజాగా పంట నష్టాల పరిశీలన సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఈ ప్రతిపాదనను తెరమీదకి తెచ్చారు.
వరుసగా నష్టాలు..
చిదురాల చక్రపాణి, రైతు, మహేశ్వరం, వరంగల్ జిల్లా
రెండు ఎకరాల్లో మునగ చెట్లను వేశాను. కాతకొచ్చే దశలో గత ఏడాది వడగళ్లతో మొత్తం పంటపోయి రూ.2 లక్షల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది అదే భూమిలో మొక్కజొన్న వేశాను. కంకి తయారయ్యే దశలో ఇటీవల వడగళ్లు పడటంతో ఈసారి మళ్లీ రూ.2 లక్షల నష్టం వాటిల్లింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాటిని నమ్మకండి.. మహేశ్-రాజమౌళి సినిమాపై నిర్మాత కామెంట్స్
-
‘నా తమ్ముడికి ఓట్లేస్తే మీకు నీళ్లు’.. డీకే శివకుమార్ వ్యాఖ్యలపై కేసు నమోదు
-
‘చోటా కె గారు.. మీ గౌరవాన్ని కాపాడుకోండి’.. కాదు.. కూడదంటే I AM Waiting: హరీశ్
-
హెచ్డీఎఫ్సీ ఫలితాలు.. నికర లాభం రూ.17,622 కోట్లు
-
అనారోగ్య సమస్యలతో కేజ్రీవాల్ మరణించేలా కుట్ర: దిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్
-
‘ఇంకెవరూ మీ భార్యే..’: కోహ్లీ ఆన్సర్కు షాకైన దినేశ్ కార్తిక్