సింగరేణికివ్వరు.. వేలంలో కొనేవారు లేరు
రాష్ట్రంలోని కొత్త బొగ్గు గనుల వేలంపై అనిశ్చితి నెలకొంది. ఈమేరకు 4 గనులకు గత నెలతో టెండరు దాఖలు గడువు ముగిసినా ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు.
రాష్ట్రంలోని 4 బొగ్గు గనులపై అనిశ్చితి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని కొత్త బొగ్గు గనుల వేలంపై అనిశ్చితి నెలకొంది. ఈమేరకు 4 గనులకు గత నెలతో టెండరు దాఖలు గడువు ముగిసినా ప్రైవేటు కంపెనీలు ముందుకు రాలేదు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి గనికి ఒక ప్రైవేటు కంపెనీ టెండరు దాఖలు చేసినా.. నిబంధనల మేరకు ఒక్క కంపెనీ మాత్రమే వేలంలో పాల్గొంటే ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. సింగరేణి సంస్థ వీటిని తీసుకునేందుకు టెండరు వేస్తే కచ్చితంగా దక్కే అవకాశం ఉండేది. అయితే టెండరు ప్రక్రియలో పాల్గొనకూడదని సింగరేణి అంతర్గత నిర్ణయం తీసుకుంది. అటు ప్రైవేటు కంపెనీలు టెండర్లు వేయకపోవడం, ఇటు సింగరేణికి నేరుగా కేంద్ర బొగ్గుశాఖ కేటాయించకపోవడంతో ఈ 4 గనుల్లో బొగ్గు ఉత్పత్తి ఎప్పటికి ప్రారంభమవుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. టెండర్లు వేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకోవడం వల్ల వేలానికి దూరంగా ఉన్నట్లు సింగరేణి వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు పలు రాష్ట్రాల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు బొగ్గు ఉత్పత్తి పెంచి సరఫరాకు సింగరేణి నానా తంటాలు పడుతోంది. గతంలో వేలంలో దక్కించుకున్న ఒడిశా రాష్ట్రంలోని నైనీ గనిలో ఇంతవరకు ఉత్పత్తి ప్రారంభించలేకపోయింది. తెలంగాణలో కొత్త గనులను వేలంలో టెండరు వేసి తీసుకుంటేనే ఇస్తామని కేంద్రం మరోమారు స్పష్టం చేయడంతో 10 కోట్ల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం ఎప్పటికి సాధిస్తుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున బొగ్గు ఉత్పత్తి 6.70 కోట్ల టన్నులకు చేరుతుందని తాజా అంచనా. తెలంగాణలో వేలంలో పెట్టిన 4 గనులను నేరుగా తమకే కేటాయించాలని సింగరేణి, రాష్ట్ర ప్రభుత్వం విన్నవించినా కేంద్రం స్పందించలేదు. వేలంలో టెండరు వేసి సింగరేణి వీటిని దక్కించుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే బొగ్గు ఉత్పత్తిపై రాయిల్టీ రూపంలో ఆదాయం అదనంగా పెరుగుతుందని కేంద్రం సమాధానమిస్తోంది.
29 గనుల వేలానికి అనూహ్య స్పందన
దేశవ్యాప్తంగా 29 గనులను వేలానికి పెట్టగా ప్రైవేటు కంపెనీల నుంచి మంచి స్పందన వచ్చిందని కేంద్ర బొగ్గుశాఖ తాజాగా ప్రకటించింది. బొగ్గు ఉత్పత్తిపై టన్నుకు కనీసం 4 శాతానికి తగ్గకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాయల్టీ చెల్లిస్తామనే నిబంధనతో వీటిని వేలంలో పెట్టింది. మధ్యప్రదేశ్లోని అర్జునీ గనికి ఏకంగా 79.25 శాతం రాయల్టీ చెల్లిస్తామని ఓ ప్రైవేటు కంపెనీ రికార్డుస్థాయిలో కోట్ చేస్తూ టెండరు వేసింది. అలాగే ఛత్తీస్గఢ్లోని బనాయి భలుముడా గనికి 43 శాతం రాయల్టీ ఇస్తామని మరో కంపెనీ టెండరు దక్కించుకుంది. తెలంగాణలోని భద్రాద్రి జిల్లా కోయగూడెం బ్లాక్-3, మంచిర్యాల జిల్లాలోని కల్యాణఖని బ్లాక్-6, శ్రావణపల్లి బ్లాక్, ఖమ్మం జిల్లా సత్తుపల్లి బ్లాక్-3 గనులను వేలంలో పెట్టింది. ఈ 4 గనులు దక్కితే ఏటా అదనంగా కోటీ 20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తామని సింగరేణి ఇటీవల కేంద్రానికి తెలిపింది. ఈ గనుల్లో బొగ్గు నిల్వలు ఎంతమేర ఉన్నాయనే అన్వేషణకు సింగరేణి గతంలో రూ.66 కోట్లు ఖర్చు చేసింది. సత్తుపల్లి ప్రాంతంలో గనుల నుంచి తవ్వే బొగ్గును తరలించడానికి రైల్వేలైను నిర్మాణానికి రూ.900 కోట్లకు పైగా రైల్వేశాఖకు చెల్లించింది. కొత్త గనులు రాకపోవడంతో ఈమేరకు వెచ్చించిన నిధులతో పూర్తి ప్రయోజనాలు దక్కడం లేదని సింగరేణి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.