మౌలిక వసతుల కల్పనే కీలకం
రాష్ట్రంలో తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వీలుగా కళాశాలలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి.
కొత్త వైద్య కళాశాలల్లో బోధన సిబ్బంది అంశం కొలిక్కి
రెండుసార్లు అసంతృప్తి వ్యక్తం చేసిన ఎన్ఎంసీ
ప్రత్యేక కార్యాచరణపై వైద్యారోగ్య శాఖ దృష్టి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో తొమ్మిది కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక వసతుల కల్పన అత్యంత కీలకంగా మారనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు వీలుగా కళాశాలలను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలనే ప్రభుత్వ ఆలోచనలకు క్షేత్ర స్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఈ ఏడాది కొత్తగా తొమ్మిది వైద్య కళాశాలను ప్రారంభించడం ద్వారా 900 ఎంబీబీఎస్ సీట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కరీంనగర్, ఖమ్మం, వికారాబాద్, భూపాలపల్లి, కామారెడ్డి, జనగాం, సిరిసిల్ల, నిర్మల్, ఆసిఫాబాద్లలో కొత్త వైద్య కళాశాలలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో విద్యార్థులకు ప్రవేశం కల్పించాలంటే జాతీయ వైద్యమండలి (ఎన్ఎంసీ) అనుమతించాల్సి ఉంది. ఇప్పటికే రెండుసార్లు తనిఖీ చేసిన ఎన్ఎంసీ బృందాలు బోధన సిబ్బంది నియామకం, వసతులపై అసంతృప్తి వ్యక్తంచేశాయి. మొదటిసారి పరిశీలించినప్పటి పరిస్థితులే తాజాగా వచ్చినప్పుడూ ఉన్నాయని రెండోసారి తనిఖీల సందర్భంగా గుర్తుచేశాయి. దాంతో ఈ అంశంపై వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2815 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. కొత్త కళాశాలలు ప్రారంభమైతే మరో 900 సీట్లు అందుబాటులోకి వస్తాయి. మొత్తం సీట్లు అందుబాటులోకి తీసుకురావాలని, అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్ఎంసీ మూడోసారి కొత్త వైద్య కళాశాలల తనిఖీకి వచ్చేలోపు బోధనా సిబ్బంది నియామకం, వసతుల కల్పన సహా కీలక అంశాలను పూర్తి చేయాల్సి ఉంటుంది. రాష్ట్రంలో 24 ప్రైవేటు వైద్య కళాశాలలు ఉండగా వాటిలో 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి.
ప్రొఫెసర్లు... అసోసియేట్ ప్రొఫెసర్లు ఓకే
తొమ్మిది వైద్య కళాశాలలకు ఎన్ఎంసీ మార్గదర్శకాల మేరకు ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ఇందులో భాగంగా 87 మంది అసోసియేట్ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతి ఇచ్చారు. అలాగే 210 మందికి అసోసియేట్ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించే అంశంపైనా దృష్టి సారించారు. 1,442 మంది అసోసియేట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియనూ కొలిక్కి తెచ్చారు. అయితే... మౌలిక సదుపాయాల కల్పనలో జాప్యం జరుగుతుండటంతో మంత్రి సూచనతో స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపుతున్నారు. ఇప్పటికే నీట్ ఎంబీబీఎస్ ప్రకటన వెలువడింది. అడ్మిషన్ల ప్రక్రియ దశకు రావడానికి ఇంకా నాలుగైదు నెలల సమయం ఉండటంతో అంతలోపు కొత్త వైద్య కళాశాల ప్రారంభానికి అవసరమైన ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశముందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పన్న కల్యాణం.. జగమంతా పరవశం
-
అర్ధశతకాలతో చెలరేగిన రాహుల్, డికాక్.. చెన్నైపై లఖ్నవూ ఘన విజయం
-
ఆగంతుకుడి అనుమానాస్పద కదలికలు.. ఇరాన్ కాన్సులేట్ వద్ద కలకలం!
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!