సంక్షిప్త వార్తలు(4)
తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (మహిళ) శిక్షణ కోర్సు పరీక్షకు అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఎంపీహెచ్డబ్ల్యూ పరీక్షకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (మహిళ) శిక్షణ కోర్సు పరీక్షకు అభ్యర్థులు ఏప్రిల్ 13వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ శ్వేతామహంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మల్టీపర్పస్ హెల్త్ వర్కర్స్ (ఎంపీహెచ్డబ్ల్యూ-మహిళ) పరీక్షలు ఏప్రిల్ 24వ తేదీ నుంచి 29 వరకు జరుగుతాయని పేర్కొన్నారు.
విద్యుత్ ఉద్యోగులకు పీఆర్సీపై రేపు సమావేశం
ఈనాడు, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగులకు కొత్త వేతన సవరణ ఒప్పందంపై బుధవారం సాయంత్రం 4 గంటలకు సమావేశం నిర్వహిస్తున్నట్లు ట్రాన్స్కో యాజమాన్యం సోమవారం తెలిపింది. ఈ మేరకు విద్యుత్ ఉద్యోగ సంఘాల ఐకాసకు సమాచారం ఇచ్చారు. వేతన సవరణ అమలుకు ఐకాస ఆధ్వర్యంలో ఇటీవల విద్యుత్ సౌధలో ధర్నా చేసిన సంగతి తెలిసిందే.
ఎస్సీ ఉద్యోగుల సంక్షేమంలో సింగరేణి ఆదర్శం
ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ ఉద్యోగుల రిజర్వేషన్ అమలులో, పదోన్నతులు, సంక్షేమం తదితర విషయాల్లో ఇతర సంస్థలకు సింగరేణి ఆదర్శప్రాయంగా నిలుస్తోందని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు సుభాష్ పార్థీ ప్రశంసించారు. సోమవారం సింగరేణి భవన్లో ఆయన ఎస్సీ రూల్ ఆఫ్ రిజర్వేషన్, పదోన్నతులు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని చాలా పరిశ్రమల్లో నిర్దేశిత ఎస్సీ రిజర్వేషన్ 15 శాతం కన్నా తక్కువ అమలవుతోందని.. సింగరేణిలో 17 నుంచి 20 శాతం అమలు కావడం అభినందనీయమని చెప్పారు. అంబేడ్కర్ జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించడమే కాకుండా అన్ని ఏరియాల్లో ఉత్సవాల నిర్వహణకు రూ.60 వేల చొప్పున మంజూరు చేయడం ప్రశంసనీయమన్నారు. దీన్ని రూ.లక్షకు పెంచాలని ఎస్సీ ఉద్యోగుల సంఘాలు కోరుతున్నాయని.. దీని పట్ల సానుకూలంగా స్పందించాలని సూచించారు. అంతకుముందు సింగరేణిలోని ఎస్సీ ఉద్యోగుల సంక్షేమ సంఘాలతో ఆయన సమావేశమయ్యారు.
సీఎస్సార్ కింద రూ.2,134 కోట్ల వ్యయం
ఈనాడు, దిల్లీ: తెలంగాణలో కంపెనీ సామాజిక బాధ్యత (సీఎస్సార్) కింద సంస్థలు 2016-17 నుంచి 2020-21 వరకు రూ.2,134.8 కోట్లు వ్యయం చేసినట్లు కేంద్ర మంత్రి రావ్ ఇంద్రజిత్సింగ్ తెలిపారు. ఎంపీ రేవంత్ అడిగిన ప్రశ్నకు మంత్రి సోమవారం లోక్సభలో సమాధానమిచ్చారు.
* గాలి నాణ్యత మెరుగుపరిచే చర్యలకు హైదరాబాద్కు 2020-21 నుంచి 2022-23 వరకు రూ.443.5 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర పర్యావరణశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే తెలిపారు. చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు.
* తెలంగాణలో భువనగిరి, ఝరాసంగం, బోధన్, మంచిర్యాల, సిద్దిపేట, ఆదిలాబాద్, సిరిసిల్ల, మహబూబాబాద్లలో కేంద్రీయ విద్యాలయాలు తాత్కాలిక భవనాల్లో నడుస్తున్నాయని కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి తెలిపారు. ఎంపీలు మాలోత్ కవిత, పసునూరి దయాకర్, గడ్డం రంజిత్రెడ్డి, బొర్లకుంట వెంకటేష్ నేత అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
* విశ్రాంత సైనికోద్యోగుల ఆరోగ్య పథకం(ఈసీహెచ్ఎస్)లో తెలంగాణ నుంచి 66,650 మంది ఉన్నారని రక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్భట్ తెలిపారు. ఎంపీ బండి పార్థసారధిరెడ్డి ప్రశ్నకు ఈ సమాధానమిచ్చారు.
* బేగంపేట విమానాశ్రయంలో 2022లో ఎయిర్ నావిగేషన్ పరికరాలను మార్చగా, 2021లో కడప విమానాశ్రయంలో కొత్తవి ఏర్పాటు చేసినట్లు పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి జనరల్ (రిటైర్డ్) వీకే సింగ్ తెలిపారు. వైకాపా ఎంపీ అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు
-
నడుం నొప్పి, కుంగుబాటు, తలనొప్పి.. అనారోగ్యానికి ప్రధాన కారణాలివే