మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శం
మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు.
ఈ విభాగంలో మూడో స్థానానికి చేరుకున్నాం
హైదరాబాద్లో మూడు 200 పడకల ఎంసీహెచ్లు నిర్మిస్తాం
నిమ్స్లో ఎంసీహెచ్ శంకుస్థాపనలో మంత్రి హరీశ్రావు
ఈనాడు, హైదరాబాద్: మాతాశిశు సంరక్షణలో దేశానికే ఆదర్శంగా ఉండేలా తెలంగాణ ప్రభుత్వం సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను నిర్మిస్తోందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. గర్భధారణ నుంచి ప్రసవం వరకు మహిళలకు అన్ని రకాల వైద్య సేవలను ఒకేచోట అందించి, తల్లీబిడ్డల ఆరోగ్యాలకు భరోసా ఇచ్చేలా వీటిని అందుబాటులోకి తెస్తున్నామన్నారు. హైదరాబాద్ పంజాగుట్టలోని నిమ్స్ ఆస్పత్రిలో రూ.55 కోట్లతో రాష్ట్రంలోనే మొదటి 200 పడకల మాతాశిశు సంరక్షణ కేంద్రం (ఎంసీహెచ్) సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. అనంతరం 100 పడకల డయాలసిస్ యూనిట్ను, రూ.9 కోట్ల విలువైన ఎంఆర్ఐ యంత్రం సేవలనూ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘తెలంగాణ రాక ముందు ప్రతి లక్ష ప్రసవాల్లో తల్లుల మరణాలు 92 ఉండగా వాటిని 43కు, శిశు మరణాలను 36 నుంచి 21కి తగ్గించి, దేశంలో మూడో స్థానానికి చేరుకున్నాం. సూపర్ స్పెషాలిటీ దవాఖానాలతో మొదటి స్థానానికి వస్తాం. గర్భిణులు ఎదుర్కొంటున్న కిడ్నీ, ఇతరత్రా తీవ్ర అనారోగ్య సమస్యలకు చికిత్స అందించేందుకు సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను నిర్మిస్తున్నాం. నిమ్స్లో ప్రస్తుతం నిర్మిస్తున్న భవనాన్ని భవిష్యత్తులో ఎనిమిది అంతస్తులకు విస్తరిస్తాం. త్వరలో గాంధీ(సికింద్రాబాద్), టిమ్స్(అల్వాల్)ల్లోనూ వీటిని అందుబాటులోకి తెస్తాం. ఇవి ఉమ్మడి రాష్ట్రంలో మూడే ఉండగా తెలంగాణ వచ్చాక 27కు పెరిగాయి. నిమ్స్లో ప్రస్తుతం 1,600 పడకలున్నాయి. మరో 2వేల పడకలకు విస్తరించే పనులకు సీఎం కేసీఆర్ త్వరలో శంకుస్థాపన చేస్తారు. నిమ్స్ అభివృద్ధికి, ఆధునిక పరికరాల కొనుగోలుకు రూ.150 కోట్లు కేటాయించారు. ఎర్రమంజిల్లోని క్వార్టర్స్ భూములను ఇటీవల నిమ్స్కు బదలాయించారు.
100 పడకల డయాలసిస్ యూనిట్ ప్రారంభం
దేశంలోనే తొలిసారి 100 పడకలతో డయాలసిస్ యూనిట్ను అందుబాటులోకి తెచ్చాం. ఇప్పటివరకు నిమ్స్లో రోజుకు 634 మందికి డయాలసిస్ జరిగేది. ఇకపై 1,500 మందికి ఈ సేవలు అందుతాయి. ఉమ్మడి రాష్ట్రంలో డయాలసిస్ కేంద్రాలు మూడే ఉండేవి. ఇప్పుడు 103కి పెంచుకున్నాం. నిమ్స్లో ఆరోగ్యశ్రీ అమలులో రోగులకు ఇక్కట్లు ఎదురవుతున్నట్లు తెలిసింది. వాటిని సరిదిద్దుతాం. ఇక్కడ ఓపీ సమయం ముగిసినా సేవలందిస్తున్న వైద్యులకు ప్రోత్సాహకాలు, పదోన్నతులు కల్పిస్తాం. ఆస్పత్రి ఇన్ఛార్జి డైరెక్టర్ డాక్టర్ బీరప్ప బాగా పనిచేస్తున్నారు’’ అని ప్రశంసించారు. అనంతరం నిమ్స్లో పనిచేసేందుకు 26 మంది సహాయ ఆచార్యులకు నియామకపత్రాలు అందించారు. కార్యక్రమంలో మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ శ్వేతా మహంతి, ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్రెడ్డి, నిమ్స్ ఇన్ఛార్జి డైరెక్టర్ బీరప్ప, మెడికల్ సూపరింటెండెంట్ నిమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య ప్రమాణం
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ మౌసమీ భట్టాచార్య గురువారం ఉదయం ప్రమాణం చేశారు. మొదటి కోర్టు హాలులో జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ మౌసమీ భట్టాచార్యతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే ప్రమాణం చేయించారు. -
ట్యాపింగ్ పాపంలో కీలక వికెట్
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైదరాబాద్ టాస్క్ఫోర్స్ డీసీపీగా, ఉద్యోగ విరమణ అనంతరం అక్కడే ఓఎస్డీగా సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్రావును పోలీసులు అరెస్ట్ చేశారు. -
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రవీందర్రెడ్డి
హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఎ.రవీందర్రెడ్డి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి రవీందర్రెడ్డి, ఎం.విజయ్కుమార్, చిక్కుడు ప్రభాకర్, ఎ.జగన్ పోటీ పడ్డారు. -
3 రోజుల్లో.. 30 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
రాష్ట్రవ్యాప్తంగా రబీ(యాసంగి) ధాన్యం కొనుగోళ్ల లక్ష్యాలు జిల్లాల వారీగా ఖరారయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 6.24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నారు. -
రూ.50 లక్షల వ్యయం.. 5 వేల ఎకరాల సాగు ఖాయం!
తక్కువ వ్యయంతో ఎక్కువ ఆయకట్టు సాగులోకి తేవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇలాంటి వాటిని గుర్తించి.. త్వరితగతిన పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. -
తగ్గిపోతున్న యువ జనాభా!
దేశ అభివృద్ధిలో కీలకమైన యువ జనాభా దక్షిణాది రాష్ట్రాల్లో రానున్న రోజుల్లో భారీగా తగ్గనుందని తాజా అంతర్జాతీయ నివేదిక ఒకటి పేర్కొంది. -
వేడెక్కిన తెలంగాణ
సూర్యుడి భగభగలతో రాష్ట్రం వేడెక్కింది. అనేక జిల్లాల్లో ఎండవేడికి ప్రజలు అల్లాడుతున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ ఉడుకుతోంది. వారం రోజులుగా 40 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉన్న ఉష్ణోగ్రతలు గురువారం నాటికి మరింత పెరిగాయి. -
తెలుగు వర్సిటీ పురస్కారాల ప్రదానం
చిత్రలేఖనం, నృత్యం, సంగీతం, పాత్రికేయం, అవధానం, రచన తదితర ప్రక్రియల్లో విశేష కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2023 సంవత్సరానికిగాను ప్రతిభా పురస్కారాలు ప్రదానం చేసింది. -
భారాస నేత ఇంట్లో గోడ గడియారాలు, మద్యం సీసాల పట్టివేత
మంచిర్యాల జిల్లా మందమర్రిలో భారాస పట్టణ సోషల్ మీడియా ఇన్ఛార్జి బెల్లం అశోక్ ఇంట్లో ఓటర్లకు పంపిణీ చేయడానికి నిల్వ చేసిన గోడ గడియారాలు, మద్యం సీసాలను గురువారం ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. -
విత్తన లైసెన్సింగ్ విధానంలో మార్పులు
తెలంగాణలో ప్రస్తుతమున్న విత్తన లైసెన్సింగ్ విధానంలో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని, విత్తన సరఫరాలో పారదర్శకతకు ఆయా కంపెనీల ప్రతినిధుల సూచనలను పరిశీలిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. -
రాజన్న క్షేత్రంలో వైభవంగా శివ కల్యాణం
దక్షిణ కాశీగా పేరొందిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గురువారం శివ కల్యాణం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. -
బాహు‘మీనం’
వనపర్తి జిల్లా కొత్తకోట మండలం అప్పరాలలో మత్స్యకారుడు పరమేశ్కు చిక్కిన భారీ చేప ఇది. గురువారం ఆయన పామాపురం సమీపంలోని ఊకచెట్టు వాగులో నిర్మించిన చెక్ డ్యామ్లో వేటకు వెళ్లగా.. 10 నుంచి 25 కిలోల బరువున్న చేపలు వలలో చిక్కాయి. -
మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలి
లోక్సభ ఎన్నికల్లో మాదిగలకు తగిన సీట్లు కేటాయించాలని కోరుతూ తెలంగాణ మాదిగ దండోరా, మాదిగ జేఏసీ ప్రతినిధులు దిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ముందు గురువారం ధర్నా నిర్వహించారు. -
టెట్పై ఉపాధ్యాయుల్లో గందరగోళం
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)-2024పై ఉపాధ్యాయుల్లో సందేహాలు నెలకొన్నాయి. వాటిని నివృత్తి చేయాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తున్నారు. -
గురుకులాల్లో భర్తీకాని పోస్టులపై నిర్ణయం తీసుకోండి: హైకోర్టు
గురుకులాల్లో డిగ్రీ, జూనియర్ లెక్చరర్లు, పోస్టు గ్రాడ్యుయేట్, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, బోధనేతర సిబ్బంది పోస్టులకు ఎంపికైన వారు బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఏర్పడిన ఖాళీల్లో పిటిషనర్ల నియామకాన్ని పరిశీలించాలని ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
ఇంటర్ కళాశాలలకు మే 31 వరకు సెలవులు
రాష్ట్రంలోని జూనియర్ కళాశాలలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 31 నుంచి మే 31వ తేదీ వరకు సెలవులు ఉంటాయని గురువారం వెల్లడించింది. -
‘సాహితీ’ డబుల్ దందాపై పోలీసుల ఆరా
కార్తికేయ పనోరమ ప్రాజెక్టు పేరిట సాహితీ ఇన్ఫ్రా పాల్పడిన మోసాలపై హైదరాబాద్ సైబర్క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. -
జెన్కో అసిస్టెంట్ ఇంజినీర్ పరీక్ష వాయిదా
పార్లమెంట్ ఎన్నికల కోడ్ దృష్ట్యా తెలంగాణ జెన్కోలో అసిస్టెంట్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్, కెమికల్) పోస్టుల భర్తీకి ఈ నెల 31న ఆన్లైన్లో నిర్వహించాల్సిన కంప్యూట్ ఆధారిత పరీక్ష (సీబీటీ)ను వాయిదా వేసినట్లు జెన్కో సీఎండీ తెలిపారు. -
సరిహద్దు రాష్ట్రాల్లో ఓటు హక్కు వినియోగానికి వెసులుబాటు
తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకూ, సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి మే 13న పోలింగ్ జరగనుండగా.. ఆ రోజున వేతనంతో కూడిన సెలవుగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. -
పర్యాటకులను వేధించొద్దు
తనిఖీల సందర్భంగా పర్యాటకులను వేధించొద్దంటూ అన్ని రాష్ట్రాల ముఖ్య ఎన్నికల అధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) తాజాగా లేఖ రాసింది. -
న్యాయస్థానం ఆదేశాలను పాటించడంలేదు
జ్యుడిషియల్ కస్టడీ సమయంలో తనకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కోర్టు జారీచేసిన ఆదేశాలను తిహాడ్ జైలు అధికారులు పాటించడంలేదని భారాస ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు