అన్నదాతకు కరవైన ఇంధనం
సహకార సంఘాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు రైతులకు స్థానికంగా ఇంధన సేవలు, స్థానికులకు ఉపాధి అందించేందుకు 2018లో రాష్ట్రవ్యాప్తంగా 89 ప్రాథమిక సహకార సంఘాల్లో పెట్రోలు బంక్లు ఏర్పాటయ్యాయి.
వినియోగ బంక్లకు సబ్సిడీలు ఎత్తివేసిన కేంద్రం
నష్టాలతో నడపలేక మూతపడ్డ వైనం
ఈనాడు, హైదరాబాద్: సహకార సంఘాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు రైతులకు స్థానికంగా ఇంధన సేవలు, స్థానికులకు ఉపాధి అందించేందుకు 2018లో రాష్ట్రవ్యాప్తంగా 89 ప్రాథమిక సహకార సంఘాల్లో పెట్రోలు బంక్లు ఏర్పాటయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో 38 బంక్లు ఏర్పాటు కాగా.. వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, రంగారెడ్డి, మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల పరిధిలో అయిదు నుంచి పది సొసైటీలు వీటిని స్థాపించాయి. ఆయా సొసైటీలు సొంత వనరులతో పాటు డీసీసీబీలు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని రూ.50 లక్షలను వెచ్చించి బంక్లను ఏర్పాటు చేశాయి. 2018 సమయంలో కేంద్రం వీటిని వినియోగ బంక్లుగా పరిగణించి, తక్కువ ధరకు పెట్రోలు, డీజిలు సరఫరా చేసేది. దీంతో వాణిజ్య బంక్ల కంటే ధరలు తక్కువగా ఉండేవి. గ్రామాల పరిధిలో బంక్లు అందుబాటులోకి రావడంతో రైతులకు సౌలభ్యంగా ఉండేది. పెట్రోలు, డీజిల్లపై పన్నులు చెల్లించే అవసరం లేకపోవడం వల్ల బంక్ల వ్యాపారం లాభదాయకంగా మారింది. వీటిని చూసి రాష్ట్రవ్యాప్తంగా మరో 193 సొసైటీలు బంక్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి.
కరోనా తర్వాత...
కరోనా అనంతరం 2021లో కేంద్ర ప్రభుత్వం వినియోగ బంక్లలో పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీని ఎత్తివేయడం వాటికి శరాఘాతంగా మారింది. రాయితీ తొలగించిన అనంతరం వాణిజ్య బంక్ల కంటే అధిక ధరలకు విక్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో రైతులు సొసైటీల బంక్లకు రావడం మానేశారు. కొన్ని బంక్లు నష్టాన్ని భరించి విక్రయాలను జరపడంతో వాటిపై పెనుభారం పడింది. అనంతరం ఒక్కొక్కటిగా 40 బంక్లు మూతపడ్డాయి. గత మార్చి నుంచి ఇప్పటివరకు ఏడాది కాలంగా మూతపడడంతో అవి ఆదాయం కోల్పోయాయి. మరోవైపు రైతులు పెట్రోలు, డీజిల్ల కోసం సమీప పట్టణాలకు, జిల్లా కేంద్రాలకు వెళ్తున్నారు.
ఇది కరీంనగర్ జిల్లాలోని దుర్శేడు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం పెట్రోలు బంక్. రైతులకు తక్కువ ధరలకు పెట్రోలు, డీజిల్ సరఫరా కోసం 2018లో దీనిని ప్రారంభించారు. కానీ నాలుగేళ్లలోనే మూతపడింది. రూ.50 లక్షల పెట్టుబడి రాకపోగా.. కొత్తగా రూ.20 లక్షల నష్టం వచ్చింది.. ఇదొక్కటే కాదు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఇదే పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీలు ఎత్తివేయడం వినియోగ(కన్సూమర్) బంక్లకు శాపంగా మారింది. దీంతో పలు బంక్లు వరుసగా మూతపడుతున్నాయి.
రైతులకు ఇబ్బందికరమే
సొసైటీల పెట్రోలు బంక్లు మాకు ఉపయోగపడ్డాయి. ట్రాక్టర్లు.. హార్వెస్టర్లకు తక్కువ ధరకు డీజిల్ వచ్చేది. ఇంధనం కోసం 50 కిలోమీటర్లు వెళ్లే సమస్య ఉండేది కాదు. ఏడాది కిందట సొసైటీల బంక్లు మూతపడడంతో మాకు ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే మాకు కూలీలు, పెట్టుబడుల ఖర్చులు పెరిగాయి. కేంద్రం రైతులకు మేలు చేయాలనుకుంటే ఈ బంక్లకు సబ్సిడీలు ఇవ్వాలి.
రాయిని వెంకట్, మొలంగూర్, కరీంనగర్ జిల్లా
కేంద్ర నిర్ణయమే శాపం
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా పెట్రోల్ బంక్ల ఏర్పాటు.. సొసైటీలతో పాటు రైతులకు లబ్ధి చేకూరింది. కరోనా అనంతరం కేంద్రం వీటిపై సబ్సిడీలు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో బంక్లన్నీ నష్టాల్లో మునిగాయి. ఈ సమస్యను దిల్లీకి వెళ్లి కేంద్ర సహకారశాఖ మంత్రి అమిత్షాను కలిసి విన్నవించాను. సబ్సిడీల విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.. కానీ నిర్ణయం తీసుకోలేదు.
టెస్కాబ్ ఛైర్మన్ కొండూరి రవీందర్రావు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫోన్ ట్యాపింగ్ అత్యంత ప్రమాదకరం
పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడి వారిని నియంత్రించడానికి గత ప్రభుత్వ పాలకులు ఫోన్ ట్యాపింగ్ను వాడుకున్నారని, అది అత్యంత ప్రమాదకరం అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. -
సిద్దిపేట జిల్లాలో ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
భారాస నిర్వహించిన ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంగా కొంత మంది ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఏప్రిల్ 8న సిద్దిపేట జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ జారీ చేసిన ఆదేశాల అమలును నిలిపివేస్తూ హైకోర్టు శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మేడిగడ్డ పూర్తవకుండానే పూర్తయినట్లు సర్టిఫికెట్
మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తి కాకుండానే, అయినట్లుగా సంబంధిత ఇంజినీర్లు గుత్తేదారుకు సర్టిఫికెట్ ఇచ్చినట్లు ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ నీటిపారుదల శాఖకు నివేదించారు. -
గరుడ ప్రసాదం... పోటెత్తిన భక్తజనం
రంగారెడ్డి జిల్లాలోని చిలుకూరు బాలాజీ ఆలయంలో శుక్రవారం నిర్వహించిన బ్రహ్మోత్సవాలు... గరుడ ప్రసాద వితరణ భక్తులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. -
పగలు వడగాలులు.. సాయంత్రం వడగళ్లు
రాష్ట్రంలో శుక్రవారం పలు జిల్లాల్లో ఎండలు భగ్గుమనగా.. కొన్ని జిల్లాల్లో అకాల వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా నల్గొండ, సూర్యాపేట జిల్లాలు సలసలా కాగాయి. -
‘కోటిపల్లి’ పనుల్లో అసాధారణ అంచనాలు
‘నీటిపారుదల ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ-జనరల్) కార్యాలయం నుంచి ప్రభుత్వానికి అంచనాలు పంపేందుకు వెనుకాడాల్సిన ఇబ్బందికరమైన పరిస్థితిని హైదరాబాద్ సర్కిల్ ఇంజినీర్లు తీసుకొచ్చారు. -
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
వైకాపా తరఫున కడప ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం నామినేషన్ దాఖలు చేసిన వైఎస్ అవినాష్రెడ్డి తాను రెండు క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నానని అఫిడవిట్లో పేర్కొన్నారు. -
14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు
రాష్ట్రంలో 2024 వానాకాలం సీజన్ కోసం 14 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉద్యానవన శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. -
నీటి లోతుల్లో నిఘా కళ్లు!
తెలంగాణ విపత్తు స్పందన, అగ్నిమాపక సేవలశాఖ మరిన్ని సాంకేతిక హంగులను సమకూర్చుకుంటోంది. అధునాతన పరిజ్ఞానంతో కూడిన పరికరాలను సొంతం చేసుకునే దిశగా ఆ శాఖ అడుగులు వేస్తోంది. -
కృష్ణా పరీవాహకంలో చెరువుల కింద నీటి వినియోగం ఎంత?
చిన్ననీటి పారుదల రంగంలో కృష్ణా పరీవాహకంలో నీటి వినియోగం, పొదుపుపై నీటిపారుదల శాఖ లెక్కగడుతోంది. -
గురుకుల విద్యార్థి మృతి ఘటనపై కేంద్రం ఆగ్రహం
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్ సంఘటనపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ను ఆదేశించింది. -
శ్రీలంకలోని వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలు
శ్రీలంకకు చెందిన వేద గిరిజన జనాభాకు భారతీయులతో దగ్గరి సంబంధాలున్నాయి. దక్షిణ భారత్లోని కొన్ని గిరిజన సమూహాలతో జన్యుపరమైన అనుబంధం కలిగి ఉన్నట్లు సీసీఎంబీ పరిశోధనలో వెల్లడైంది. -
‘వాట్సప్ గురు’ మరో ఘనత!
తెలంగాణ అదనపు డీజీపీ (రైల్వేస్ అండ్ రోడ్ సేఫ్టీ) మహేశ్ మురళీధర్ భగవత్ మరో ఘనత సాధించారు. -
దార్శనిక నేత చంద్రబాబు
తెదేపా అధినేత చంద్రబాబు 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానాన్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు తొమ్మిదేళ్లు, నవ్యాంధ్రకు ఐదేళ్లు కలిసి 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఆయన పరిపాలన సాగిన తీరును కళ్లకు కడుతూ ‘మన చంద్రన్న- అభివృద్ధి, సంక్షేమ విజనరీ’ పేరుతో పార్టీ రాజకీయ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్దన్ పుస్తకం రూపొందించారు. -
తిరుమల శేషాచలం పరిధిలో అగ్నికీలలు
శేషాచలం పరిధిలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులతో ఎక్కడికక్కడ అగ్నికీలలు వ్యాపిస్తున్నాయి. శుక్రవారం ఉదయం తిరుమలకు సమీపంలో పెద్దఎత్తున అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. -
ఎన్ఎస్జీ డీజీగా నళిన్ ప్రభాత్
జాతీయ భద్రతా దళం (ఎన్ఎస్జీ) డైరెక్టర్ జనరల్గా నళిన్ ప్రభాత్ నియమితులయ్యారు. ఈయన ఏపీ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. -
భారీగా పెరిగిన శ్రీవారి డిపాజిట్లు
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆదాయం ఏటేటా పెరుగుతోంది. 2023-24లో తితిదే ఏకంగా రూ.1,161 కోట్లను వివిధ బ్యాంకుల్లో ఫిక్సిడ్ డిపాజిట్ చేసింది. -
సీబీఐ కేసులోనూ అప్రూవర్గా మారిన శరత్చంద్రారెడ్డి!
దిల్లీ మద్యం కుంభకోణంపై ఈడీ నమోదు చేసిన కేసులో ఇప్పటికే అప్రూవర్గా మారిన అరబిందో సంస్థ ప్రతినిధి శరత్చంద్రారెడ్డి తాజాగా సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్గా మారినట్లు తెలిసింది. -
రైతాంగ సమస్యలపై మే 15 నుంచి ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కర్షక వ్యతిరేక విధానాలపై ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధం కావాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం (ఏఐపీకేఎస్) రాష్ట్ర అధ్యక్షుడు రాయల చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. -
అనుమతుల్లేని క్లినిక్లపై దాడి.. రూ. 2.6 లక్షల విలువైన మందుల స్వాధీనం
రాష్ట్రంలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న క్లినిక్లపై దాడి చేసి నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన ఔషధాలను స్వాధీనం చేసుకున్నట్లు ఔషధ నియంత్రణ మండలి (డీసీఏ) డైరెక్టర్ జనరల్ వి.బి.కమలాసన్రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
సైబర్ టవర్స్ వద్ద చంద్రబాబు జన్మదిన వేడుకలు
-
ఆ ప్రాజెక్ట్ వదులుకున్నా.. దీపిక నాకు థ్యాంక్స్ చెప్పాలి: కరీనాకపూర్
-
ధోనీ ఆటే స్ఫూర్తి.. లేటుగా బ్యాటింగ్కు రావడానికి కారణముంది: ఫ్లెమింగ్
-
నిరంతరం రాష్ట్రం గురించి ఆలోచించే నేత చంద్రబాబు : పవన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మారిన లోగో రంగు.. వివాదంలో దూరదర్శన్