ఏపీ 30 ఏళ్లు వెనక్కి
ఆంధ్రప్రదేశ్లో తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలికి, దాన్ని బాగు చేసే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని భరోసా ఇచ్చారు.
జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం
పునర్నిర్మాణం మా బాధ్యత
తెదేపా అధికారంలోకి రావడం చారిత్రక అవసరం
అధికారంలోకి వస్తే సంక్షేమాన్ని కొనసాగిస్తూనే, అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం
పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో చంద్రబాబు వెల్లడి
ఈనాడు - హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్లో తెదేపా మళ్లీ అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణానికి నాంది పలికి, దాన్ని బాగు చేసే బాధ్యతను తెదేపా తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక సంక్షేమ కార్యక్రమాలన్నీ కొనసాగించడంతో పాటు, అభివృద్ధికీ అత్యధిక ప్రాధాన్యమిస్తామన్నారు. ‘సంక్షేమం ప్లస్ అభివృద్ధి’ అన్న విధానాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. తెదేపా 41వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సంపద సృష్టించడంతో పాటు, అభివృద్ధి ఫలాలు పేదలకు అందేలా చేయాలన్నదే తమ సంకల్పమన్నారు. సంస్కరణల ఫలాల్ని అందిపుచ్చుకుని జీవితంలో ఆర్థికంగా స్థిరపడినవారు కొన్ని పేద కుటుంబాల్ని దత్తత తీసుకుని, వారి అభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. తెదేపా అధికారంలోకి వచ్చాక దీన్నో ఉద్యమంలా చేపడతామని వెల్లడించారు. రాష్ట్ర విభజన కంటే సైకో ముఖ్యమంత్రి జగన్ వల్లే ఆంధ్రప్రదేశ్కు ఎక్కువ నష్టం జరిగిందని, రాష్ట్రం అభివృద్ధిలో 30 ఏళ్లు వెనక్కు పోయిందని ధ్వజమెత్తారు. ‘ఈ నాలుగేళ్లలో వాళ్లు చేసింది ఒక్కటే.. ఎక్కడో బిహార్లో ఉంటుందనే గన్ కల్చర్ను ఇప్పుడు జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల దాకా తెచ్చారు. మొన్న గొడ్డలి.. ఇప్పుడు గన్, మూడోది గంజాయి’ అని చంద్రబాబు మండిపడ్డారు. ‘ఏపీలో తిరుగుబాటు మొదలైంది. మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో తెదేపాను భారీ మెజారిటీతో గెలిపించారు. అది చదువుకున్నవాళ్లలో వచ్చిన తిరుగుబాటు. రేపు ప్రజలందరిలోనూ అదే తిరుగుబాటును చూడబోతున్నాం’ అని తెలిపారు. తెలంగాణలోనూ పార్టీకి పూర్వవైభవం తేవాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ!
కక్ష కట్టి అమరావతిని నాశనం చేశారు
హైదరాబాద్కు దీటుగా మరో నగరం వస్తే తెలుగుజాతి గర్వపడుతుందని అమరావతి నిర్మాణం ప్రారంభించాను. దానిపై జగన్ కక్షకట్టి నాశనం చేశారు. అమరావతి నా కోసమా? నేను అభివృద్ధి చేసిన హైదరాబాద్లో, హైటెక్ సిటీలో నేనేమైనా ఉద్యోగం చేస్తున్నానా? మా పిల్లలేమైనా ఐఎస్బీలో చదువుతున్నారా? అమరావతి నిర్మాణానికి 29 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూమిని స్వచ్ఛందంగా ఇచ్చారు. దాన్ని జగన్ సర్వనాశనం చేసి, నాలుగేళ్లుగా రాజధానిపై మూడు ముక్కలాట ఆడుతున్నారు. ఈ విధ్వంసాన్ని తెలుగువారు ఎక్కడున్నా ఖండించాలి. అప్పట్లో శంషాబాద్ విమానాశ్రయం నిర్మాణానికి రైతుల నుంచి అయిదు వేల ఎకరాలు సేకరించాను. నా తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి విమానాశ్రయాన్ని రద్దు చేసి ఉంటే, ఈ రోజున అక్కడంత అభివృద్ధి జరిగేదా?
తెలుగువారు ప్రపంచ నాయకులుగా ఎదగాలి
తెలుగువారు ప్రపంచ పౌరుల్లా (గ్లోబల్ సిటిజెన్స్) మారారు. భవిష్యత్తులో వారు ప్రపంచ నాయకులు (గ్లోబల్ లీడర్లు)గా ఎదగాలి. 2047 నాటికి ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన జాతి.. యూదులు కాదని, తెలుగువారేనన్న గుర్తింపు తెచ్చుకోవాలి. తెలంగాణ ఇప్పుడున్న స్థాయి నుంచి మరో స్థాయికి ఎదగాలి.
విరాళాలిచ్చి పార్టీకి అండగా నిలవండి
హైదరాబాద్లోనో, అమెరికాలోనో ఉన్నవారు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవడానికి కృషి చేయాలి. ప్రతి ఒక్కరూ రూ.5 వేలు కట్టి, పార్టీ శాశ్వత సభ్యులు కావాలి. నెలకు కనీసం వంద రూపాయలో, యాభై రూపాయలో పార్టీకి విరాళంగా ఇవ్వండి. పార్టీ కోసం ప్రాణత్యాగాలకూ సిద్ధపడే కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగపడుతుంది. రైతులు, చేనేత కార్మికులు, గొర్రెల కాపర్లు, చర్మకారులు, వడ్రంగి, కుమ్మరి వంటి వృత్తిపనివారు పేదరికంలో మగ్గుతున్నారు. వారందరిలో నైపుణ్యాలు అభివృద్ధి చేస్తాం. ఉత్పత్తులకు మార్కెట్ ఏర్పాటు చేస్తాం. ప్రపంచానికే ఒక నమూనాను అందజేస్తాను. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు న్యాయం చేసే బాధ్యత తెదేపాది.
తెలుగుజాతికి గర్వకారణం ఎన్టీఆర్
41 ఏళ్ల కిందట ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రను తిరగరాసిన రోజు మార్చి 29. తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక ఎన్టీఆర్. పరిపాలన సంస్కరణలకు, సంక్షేమ కార్యక్రమాలకు ఆయనే ఆద్యుడు. ఎన్టీఆర్ వెనుకబడిన వర్గాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. మొదటిసారి స్థానిక సంస్థల పదవుల్లో బీసీలకు 20 శాతం రిజర్వేషన్లు కల్పించారు. నేను దాన్ని 34 శాతానికి పెంచాను. పార్టీ ఆవిర్భావం సందర్భంగా ఈ రోజు తొలి సమావేశం నిర్వహించాం. మే 27, 28 తేదీల్లో రాజమహేంద్రవరంలో మహానాడు జరుగుతుంది. ఈ మధ్యలో 98 సమావేశాలు పెట్టి, యుగపురుషుడు ఎన్టీఆర్కి ఘనంగా నివాళులర్పిస్తాం. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, అమెరికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఆఫ్రికాలలోనూ సమావేశాలు నిర్వహిస్తాం. ఎన్టీఆర్ గౌరవార్థం రూ.వంద వెండి నాణెం విడుదల చేయబోతున్న కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని మోదీకి ధన్యవాదాలు.
దేశం దశ, దిశ మార్చిన నాయకుడు పీవీ
సంస్కరణలకు నాంది పలికి.. దేశం దశ, దిశను మార్చిన తెలుగుబిడ్డ పీవీ నరసింహారావు. 1991లో ఆయన హయాంలోనే ఆర్థిక సంస్కరణలు మొదలయ్యాయి. 1992-93లో ఇంటర్నెట్ విప్లవం వచ్చింది. 1995లో నేను ముఖ్యమంత్రయ్యాక.. ఆ రెండూ అందిపుచ్చుకుంటే ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగుండదని గుర్తించాం. పీవీ ప్రారంభించిన సంస్కరణలకు అదనంగా, నేను రెండో తరం సంస్కరణలు తీసుకొచ్చాను. దానికి టెక్నాలజీని జోడించాను.
తెలంగాణలోనూ పూర్వవైభవం వస్తుంది
తెలంగాణలో ఇంటింటికీ తెదేపా కార్యక్రమం బాగా జరుగుతోంది. దానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానేశ్వర్ను, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాను. బాగా పనిచేస్తున్నారు. దాన్ని ఇంకా ఉద్ధృతం చేయాలి. వేగం పెంచాలి. తెలంగాణలోనూ పార్టీకి తప్పకుండా పూర్వ వైభవం వస్తుంది. అది చారిత్రక అవసరం.
పేద కుటుంబాల్ని దత్తత తీసుకోండి
ఆర్థిక సంస్కరణలు, నాలెడ్జ్ ఎకానమీతో సంపద సృష్టి జరుగుతున్నా అది కొందరికే పరిమితమవుతోంది. 12 శాతం కుటుంబాలకు రోజుకు రూ.150, 22 శాతం జనాభాకు రోజుకు రూ.350 మాత్రమే వస్తోంది. ఒక శాతం జనాభా 62 శాతం సంపదను అనుభవిస్తుంటే, 12 శాతం జనాభా కడు పేదరికంలో ఉన్నారు. సమాజంలో ఆర్థిక అసమానతలు నిర్మూలించే కార్యక్రమానికి ఈ రోజే నాంది పలకాలి. మేధావులు, డబ్బున్నవారు, అవకాశాలు అందిపుచ్చుకున్నవారు మనందరం కలసి నిరుపేదలకు అండగా ఉండాలి. అయిదేళ్లకు కొందరి తలసరి ఆదాయం వంద రెట్లు పెరిగితే, పేదల ఆదాయం మూడు రెట్లే పెరుగుతోంది. దాన్ని 30-40 రెట్లు పెంచే బాధ్యత నాది. 10 కోట్ల మంది తెలుగువారిలో రెండు కోట్ల మందో, మూడు కోట్ల మందో పేదరికంలోనే ఉన్నారు. మీ శక్తినిబట్టి అలాంటి అయిదో, పదో కుటుంబాల్ని దత్తత తీసుకోండి. వారి ఆర్థికాభివృద్ధికి కృషి చేయండి.
హైటెక్ సిటీని కూల్చేస్తే అభివృద్ధి జరిగేదా?
హైదరాబాద్లో నేను ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాల్నీ, ప్రాజెక్టుల్నీ.. నా తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులంతా కొనసాగించారు. దానికి కేసీఆర్ సహా అందర్నీ అభినందిస్తున్నాను. హైటెక్ సిటీని నేను కట్టానని.. వైఎస్ దాన్ని కూల్చేస్తే హైదరాబాద్ అభివృద్ధి జరిగేదా? అవుటర్రింగ్ రోడ్డును రద్దు చేసి ఉంటే హైదరాబాద్కు ఈ వైభవం వచ్చేదా? జీనోమ్ వ్యాలీ వల్ల నాకు పేరొస్తుందనుకుని దాన్ని ఆపేసి ఉంటే.. ఈ రోజు కొవిడ్కు వ్యాక్సిన్ తయారు చేయగలిగేవారమా? మెట్రో ప్రాజెక్టును వైఎస్ చెడగొడితే.. రోశయ్య గాడిన పెట్టారు. ఈ రోజు శంషాబాద్ విమానాశ్రయాన్ని నేనే అభివృద్ధి చేశానని, అవుటర్రింగ్రోడ్డు నా వల్లే వచ్చిందని ఎవరూ చెప్పకపోవచ్చు. కానీ మనస్సాక్షిగా పనిచేశానన్న తృప్తి నాకు ఉంటుంది. రాష్ట్రంలో 30 ఇంజినీరింగ్ కళాశాలలను 300కి పెంచాను. వాటి అనుమతుల కోసం ఫైళ్లు పట్టుకుని దిల్లీలో కార్యాలయాల చుట్టూ తిరిగాను. ఫలితంగా ఈ రోజున కొన్ని లక్షల మంది పిల్లలు ఇంజినీరింగ్ చదువుతున్నారు. అతి కష్టం మీద బిల్గేట్స్ అపాయింట్మెంట్ తీసుకుని మాట్లాడి, సియాటెల్కు, దావోస్కి పదిసార్లు తిరిగి ఆయన్ను ఒప్పించి హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టేలా చేశాను. ఐఎస్బీ కోసం నాలుగు రాష్ట్రాలు పోటీపడితే... దాన్ని ఏర్పాటుచేస్తున్న పారిశ్రామికవేత్తల్ని ఇంటికి పిలిచి, నేనే స్వయంగా వారికి ప్లేట్లు అందించి, అల్పాహారం వడ్డించాను. తెలుగుజాతి కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసమే అదంతా చేశానని గర్వపడుతున్నాను.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయ్.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి
-
‘సంపద స్వాధీనం’పై శామ్ పిట్రోడా వ్యాఖ్యలు.. మరోసారి వివాదంలో కాంగ్రెస్
-
మనసుకీ వ్యాయామం ముఖ్యమే.. వేదాంత అధిపతి హెల్త్ టిప్స్
-
14 ఓవర్ల వరకూ మాదే పైచేయి.. ఆ ఒక్క కారణంతోనే మా ఓటమి: రుతురాజ్
-
సుప్రీం సీరియస్.. మరోసారి పతంజలి బహిరంగ క్షమాపణలు
-
వేడుకగా ‘ఆదికేశవ’ నటి వివాహం.. ఫొటో వైరల్