సంక్షిప్త వార్తలు(6)
రాష్ట్ర సమాచార కమిషన్లో సమాచార కమిషనర్లను తక్షణం నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం హైకోర్టులో సుపరిపాలన వేదిక పిటిషన్ దాఖలుచేసింది.
సమాచార కమిషనర్లను నియమించాలని హైకోర్టులో పిటిషన్
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర సమాచార కమిషన్లో సమాచార కమిషనర్లను తక్షణం నియమించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బుధవారం హైకోర్టులో సుపరిపాలన వేదిక పిటిషన్ దాఖలుచేసింది. ప్రధాన సమాచార కమిషనర్ పోస్టు రెండేళ్ల నుంచి, కమిషనర్ పోస్టులు గత నెల 24 నుంచి ఖాళీగా ఉన్నాయని.. దాంతో సమాచార కమిషన్లో అప్పీళ్లపై విచారణలు నిలిచిపోయాయని తెలిపింది. సమాచార హక్కు చట్టం అమలుపై రాష్ట్ర ప్రభుత్వానికి శ్రద్ధ లేనందునే ఈ పోస్టులను భర్తీ చేయడం లేదని వేదిక కన్వీనర్ పద్మనాభరెడ్డి తెలిపారు. సహ చట్టం అమలు కాకపోతే పరిపాలనలో పారదర్శకత ఉండదని ఆయన తెలిపారు.
స్వప్నలోక్ అగ్నిప్రమాదంపై సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యం
ఈనాడు, హైదరాబాద్: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాద ఘటనను హైకోర్టు సుమోటో ప్రజాప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ఇందులో ప్రతివాదులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్, డీజీపీ, నగర పోలీస్ కమిషనర్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శులను చేర్చింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టనుంది.
బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని బీసీ గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులు ఏప్రిల్ 16లోగా దరఖాస్తు చేసుకోవాలని గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య భట్టు తెలిపారు. అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఆన్లైన్ దరఖాస్తుకు బీసీ గురుకుల వెబ్సైట్ను సందర్శించాలని పేర్కొన్నారు.
ఓటర్లు కాని వారిని అనుమతించవద్దు: బార్ కౌన్సిల్
ఈనాడు, హైదరాబాద్: హైకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల అధికారులు నియమావళిని కఠినంగా అమలు చేయాలని బార్ కౌన్సిల్ సూచించింది. ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే ఓటింగ్ జరిగే ప్రాంతానికి ఓటర్లు కాని వారిని అనుమతించరాదని చెప్పారు. ఐడీ కార్డులను క్షుణ్నంగా తనిఖీ చేసిన తరువాతే లోనికి అనుమతించాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా జరగడానికి న్యాయవాదులంతా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
రెండు కొత్త సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు. సంగారెడ్డి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని మూడు మండలాలను కలుపుతూ కొత్తగా పటాన్చెరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని..పెద్దపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలోని మూడు మండలాలను విడగొట్టి కొత్తగా రామగుండం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని నెలకొల్పారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్ మిత్తల్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.
ముగిసిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమం
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థుల్లో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం చేపట్టిన సైబర్ అంబాసిడర్ కార్యక్రమం ముగింపు సమావేశం బుధవారం జరిగింది. రాష్ట్రంలోని 1,603 పాఠశాలలకు చెందిన 6,412 మంది విద్యార్థులను సైబర్ అంబాసిడర్లుగా ఎంపిక చేసి వారికి గత జనవరి 11వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చారు. మొత్తం 33 జిల్లాలకు చెందిన ప్రభుత్వ, సాంఘిక సంక్షేమ పాఠశాలలకు చెందిన వారు ఇందులో ఉన్నారు. సైబర్ నేరాలు జరిగే తీరు, వాటి ఉచ్చులో చిక్కుకోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలను అంబాసిడర్లకు బోధించారు. ప్రస్తుతం శిక్షణ పొందిన విద్యార్థులు తాము చదువుతున్న పాఠశాలల్లోని మిగిలిన విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమ ముగింపు సమావేశాలకు ఆయా జిల్లాల్లోని షి టీమ్స్ అధికారులు హాజరయ్యారు. హైదరాబాద్లో జరిగిన సమావేశంలో మహిళా భద్రతా విభాగం అదనపు డీజీ షీకా గోయల్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాప్టర్.. డిఫెన్స్ చీఫ్తో పాటు 9 మంది అధికారులు మృతి
-
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
-
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షలు
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్