ఇకపై సెల్ పోయినా.. దొరుకుతుంది!
చేతిలో సెల్ఫోన్ లేని వారే కాదు... ఏదో ఒక సందర్భంలో దొంగల కారణంగా దాన్ని పోగొట్టుకోని వారు కూడా ఉండరంటే అతిశయోక్తికాదు.
మొబైల్ చోరీలను అరికట్టేందుకు సీఐడీ కసరత్తు
సీఈఐఆర్తో ఒప్పందం
చేతిలో సెల్ఫోన్ లేని వారే కాదు... ఏదో ఒక సందర్భంలో దొంగల కారణంగా దాన్ని పోగొట్టుకోని వారు కూడా ఉండరంటే అతిశయోక్తికాదు. ఒక్క హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలోనే సగటున ఏడాదికి 30 వేలకుపైగా ఫోన్లు చోరీ అవుతుంటాయి. అందుకే రాష్ట్రంలో సెల్ఫోన్ దొంగతనాలకు చెక్ పెట్టేందుకు సీఐడీ విభాగం కసరత్తు చేస్తోంది. కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రార్ (సీఈఐఆర్)’తో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఇకపై చోరీకి గురైన ఫోన్ను దొంగల నుంచి రికవరీ చేయవచ్చు. ఇప్పటివరకు దిల్లీ, ముంబయి, బెంగళూరులలో మాత్రమే ఈ విధానం అమలులో ఉంది.
ఒకప్పుడు బస్సులు, రైళ్లలో జేబు దొంగతనాలు జరిగేవి. ఇప్పుడా స్థానాన్ని సెల్ఫోన్ దొంగతనాలు ఆక్రమించాయి. పర్సు చోరీ చేస్తే పోలీసులు కేసు నమోదు చేసుకుని, దొంగలను పట్టుకుంటారు. ఫోన్ చోరీపై ఫిర్యాదు చేస్తే.... రసీదు మాత్రమే ఇస్తారు. ఈ దొంగలను పట్టుకునే సాంకేతిక వ్యవస్థ లేకపోవడంతో పోలీసులు పెద్దగా ఏమీ చేయలేకపోతున్నారు. ఎవరైనా ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నప్పుడు మాత్రమే ముఠాలను పట్టుకుంటున్నారు. మరోవైపు సెల్ఫోన్ దొంగతనం వ్యవస్థీకృత నేరంగా మారింది. ఇతర రాష్ట్రాల నుంచీ ముఠాలు వస్తున్నాయి. చోరీ చేసిన ఫోన్ను దొంగలు వెంటనే స్విచ్ ఆఫ్ చేస్తారు. దాన్ని ఇతర రాష్ట్రాలకు పంపి అక్కడ విక్రయిస్తారు. లేదంటే అందులోని విడిభాగాలను తీసి ఎగుమతి చేస్తుంటారు. దాంతో పోలీసులు ఫోన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం ఉండటంలేదు. ఐఎంఈఐ నంబరు ద్వారా ఫోన్ ఎక్కడుందన్నది తెలుసుకోవచ్చు. విడిభాగాలుగా ఊడదీస్తే మాత్రం తెలుసుకోవడం అసాధ్యం. ఇతర రాష్ట్రాల్లో అమ్మితే ఎక్కడుందో తెలుస్తుంది. కానీ... ఒక్క ఫోన్ని స్వాధీనం చేసుకోవడానికి అక్కడికి పోలీసు బృందాన్ని పంపడం వ్యయప్రయాసలతో కూడుకుంది.
కొత్త వ్యవస్థ ఎలా పని చేస్తుందంటే...
ఫోన్ దొంగతనాలకు అడ్డుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ సీఈఐఆర్ను ప్రారంభించింది. ఫోన్ పొగొట్టుకున్న బాధితుడు ఫోలీసులకు ఫిర్యాదు ఇచ్చి, కేసు నమోదైన తర్వాత సీఈఐఆర్ వెబ్సైట్లో సంబంధిత వివరాలను నమోదు చేస్తారు. చోరీ అయిన ఫోన్ను ఐఎంఈఐ నంబరు ద్వారా బ్లాక్ చేస్తారు. చోరీ చేసిన వ్యక్తి అందులో వేరే సిమ్కార్డు వేస్తే మనకు ఆ విషయం తెలిసిపోతుంది. దాని ద్వారా కొత్త సిమ్కార్డు చిరునామాను తెలుసుకుని, దొంగను పట్టుకోవచ్చు. ప్రస్తుతం ఐఎంఈఐ నంబరు ద్వారా తమ ఫోన్ ఎక్కడుందో బాధితులు సొంతంగా తెలుసుకోగలుగుతున్నా... దాన్ని స్వాధీనం చేసుకునేందుకు వెళ్ళడానికి వారు జంకుతున్నారు. వీటన్నింటికీ దృష్టిలో ఉంచుకొని సీఐడీ విభాగం సీఈఐఆర్తో ఒప్పందం చేసుకుంది. ఇకపై ఫోన్ చోరీ కేసులను పోలీస్ స్టేషన్లలో నమోదు చేస్తారు. అయితే తప్పుడు ఫిర్యాదులు రాకుండా... ఫోన్ కొనుగోలు చేసినప్పటి అసలు రసీదు, వ్యక్తిగత చిరునామా, గుర్తింపు కార్డు, ప్రత్యామ్నాయ ఫోన్ నంబరు వంటివి తీసుకుంటారు. ఠాణా నుంచే ఫోన్ వివరాలను సీఈఐఆర్ వెబ్సైట్లో నమోదు చేస్తారు. వెంటనే అది బ్లాక్ అవుతుంది. దొంగ ఆ ఫోన్ను ఉపయోగించడానికి ఎప్పుడు ప్రయత్నించినా తెలిసిపోతుంది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్