రాష్ట్రస్థాయి ఉత్తమ పంచాయతీలివే
తెలంగాణలో 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది.
9 అంశాల్లో ప్రభుత్వ ఎంపిక
నేడు బహుమతుల ప్రదానం
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలో 2021-22 సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయతీలను ప్రభుత్వం ఎంపిక చేసింది. కేంద్రం నిర్దేశించిన 9 అంశాల్లో ప్రమాణాల ప్రాతిపదికన వీటికి పురస్కారాలివ్వాలని నిర్ణయించింది. మొత్తం 43 పంచాయతీలకు 47 పురస్కారాలు లభించాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖ్రా-కె పంచాయతీకి 3 విభాగాల్లో, వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మరియపురం 2 విభాగాల్లో పురస్కారాలకు ఎంపికయ్యాయి, రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా పంచాయతీకి 2 ప్రత్యేక పురస్కారాలను ప్రకటించింది. దీంతోపాటు ఈ గ్రామాలను జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీ విభాగం కింద పోటీకి రాష్ట్రం తరఫున ఎంపిక చేసి, కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఆయా గ్రామ పంచాయతీల సర్పంచులకు శుక్రవారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఇతర మంత్రుల చేతుల మీదుగా బహుమతుల ప్రదానం జరగనుంది. ఇప్పటికే మండల, జిల్లా స్థాయిలో ఉత్తమ పంచాయతీలను ఎంపికచేసి వాటికి పురస్కారాలను రాష్ట్ర సర్కారు అందజేసింది.
పేదరిక నిర్మూలన..
పేదరిక నిర్మూలన, జీవన ప్రమాణాల పెంపుదల విభాగంలో మర్లవాయి పంచాయతీ (కుమురం భీం జిల్లా జైనూర్ మండలం) మొదటిస్థానంలో నిలిచింది. మందొడ్డి(జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలం) ద్వితీయ స్థానం, సోలిపూర్(వనపర్తి జిల్లా ఘన్పూర్ మండలం) మూడోస్థానం పొందింది.
ఆరోగ్య పంచాయతీ..
1.మరియపురం(వరంగల్ జిల్లా గీసుగొండ మండలం), 2.గౌతంపూర్(భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం), 3.ముజ్గి(నిర్మల్ జిల్లా.., గ్రామీణ మండలం)
బాలల హిత పంచాయతీ..
1.అల్లాపూర్(నాగర్కర్నూల్ జిల్లా తాడూరు మండలం), 2.హరిదాస్పూర్(సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం), 3.శ్రీనివాస్నగర్(నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం)
నీటి సమృద్ధి..
1.కుక్నూర్ (నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం), 2.మాజిద్పూర్ (రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం), 3వ స్థానం.. నెల్లుట్ల (జనగామ జిల్లా లింగాల ఘనపురం), చాపలతండా (మహబూబాబాద్ జిల్లా డోర్నకల్), వెలిచాల (కరీంనగర్ జిల్లా రామడుగు), కామారెడ్డిగూడెం (జనగామ జిల్లా దేవరుప్పుల మండలం).
పరిశుభ్రత-పచ్చదనం..
1.ముఖ్రా-కె(ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం), 2.పర్లపల్లి(కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం), 3.సుల్తాన్పూర్ (పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం).
స్వయంసమృద్ధం..
1.గంభీరావుపేట(రాజన్న సిరిసిల్ల జిల్లా), 2.యెల్లంకి(యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం), మూడోస్థానంలో మల్లంపల్లి (ములుగు జిల్లా), మూడు చింతలపల్లి (మేడ్చల్ జిల్లా), డి.ధర్మారం(మెదక్ జిల్లా రామాయంపేట మండలం), తిమ్మాపూర్(కరీంనగర్ జిల్లా).
సామాజికభద్రత..
1.కొంగట్పల్లి(మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం), 2.రైతునగర్(కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం), 3.గొల్లపల్లె(మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం), ముకునూరు (జయశంకర్ జిల్లా పలిమెల మండలం).
సుపరిపాలన విభాగం..
1.చీమల్దరి(వికారాబాద్ జిల్లా మోమిన్పేట మండలం), 2.పాలేరు(ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం), 3.చిప్పలతుర్తి(మెదక్ జిల్లా నర్సాపూర్), ఖానాపూర్(నారాయణపేట జిల్లా మక్తల్).
మహిళాహితం
1.ఇర్కోడ్(సిద్దిపేట జిల్లా), 2.అయిపూర్ (సూర్యాపేట జిల్లా ఆత్మకూర్-ఎస్ మండలం), మూడోస్థానానికి హిమ్మత్రావుపేట(జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం), పెంచికలపేట(హనుమకొండ జిల్లా ఆత్మకూర్ మండలం), మోహిన్కుంట(రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం).
ప్రత్యేక కేటగిరీలో..
పర్యావరణ, ప్రకృతి విభాగం
1.కన్హా(రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం), 2.ముఖ్రా-కె (ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం), మూడోస్థానం ఇబ్రహీంపూర్ (సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం), నవాబ్పేట(జయశంకర్ జిల్లా చిట్యాల మండలం), మరియపురం(వరంగల్ జిల్లా గీసుగొండ మండలం).
సౌరశక్తి వినియోగం
1.కన్హా (రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం), 2.ఎర్రవల్లి (సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం), 3.ముఖ్రా-కె(ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం), పంతంగి(యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం), బంజరుపల్లి(సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం).
వీటితో పాటు రాష్ట్రంలో ఉత్తమ శిక్షణ సంస్థలుగా
1.రాజేంద్రనగర్లోని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి సంస్థ(టీఎస్ఐఆర్డీ),
2.రాజేంద్రనగర్ విస్తరణ కేంద్రం(ఈటీసీ),
3.హసన్పర్తిలోని విస్తరణ కేంద్రాల(ఈటీసీ)ను పురస్కారాలకు రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఘోరం: పెదవులను అతికించి.. నెల రోజులు లైంగికంగా హింసించి..!
-
రష్యన్ బాంబర్ కూల్చివేత.. యుద్ధంలో ఇదే తొలిసారి..: ఉక్రెయిన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
నెల్లూరులో తెదేపాలో చేరిన 100 మంది వాలంటీర్లు
-
అది నా డ్రీమ్ సిక్స్.. బుమ్రా బౌలింగ్లో ఇప్పటికి నెరవేరింది: అశుతోష్ శర్మ
-
మధ్యాహ్నం 3 గంటల వరకు 50%పోలింగ్.. అత్యధికంగా ఈ రాష్ట్రంలో..