కమిషన్పైనా సిట్ కన్ను
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ముఖ్యులపై దృష్టి సారించింది.
టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్, సభ్యుడు లింగారెడ్డికి నోటీసులు
నేడు ఇద్దరి విచారణ
ఈనాడు - హైదరాబాద్
ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు వేడెక్కుతోంది. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ముఖ్యులపై దృష్టి సారించింది. విచారణకు హాజరు కావాలంటూ ఏకంగా టీఎస్పీఎస్సీ కార్యదర్శి, ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్తో పాటు సభ్యుడు లింగారెడ్డికీ సిట్ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. శనివారం విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. గ్రూప్-1 ప్రశ్నపత్రం లీకేజీకి సంబంధించి వందకు పైగా మార్కులు సాధించిన వారిలో ఇప్పటివరకు వంద మందిని సిట్ అధికారులు విచారించి వారి వాంగ్మూలాలు నమోదు చేశారు. మిగిలిన 21 మందిని రెండు మూడు రోజుల్లో ప్రశ్నించనున్నారు. ఇప్పటివరకు ప్రశ్నపత్రం లీక్ చేసిన ప్రవీణ్, రాజశేఖర్, వాటి ద్వారా పరీక్షలు రాసిన వారు సహా మొత్తం 15 మందిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఇంకా ఎవరెవరికి ప్రశ్నపత్రాలు అందాయి, వారి ద్వారా ఎవరికి డబ్బు అందింది? అన్న కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఎలా లీక్ అయిందన్న విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చింది. కాన్ఫిడెన్షియల్ విభాగం ఇన్ఛార్జి శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్వర్డ్లను నిందితులు కొట్టేసి వాటి ద్వారానే ప్రశ్నపత్రాలు తస్కరించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దాంతో దర్యాప్తు అంతా ప్రశ్నపత్రాలు ఎవరెవరికి లీక్ అయ్యాయి అన్న కోణంలో ఉంటుందని భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సిట్ అధికారులు కమిషన్పైనే దృష్టి సారించడం గమనార్హం.
ప్రవీణ్, రమేష్ల ప్రమేయంపై...
కమిషన్లోని కాన్ఫిడెన్షియల్ విభాగం మొత్తం కార్యదర్శి అధీనంలో ఉంటుంది. దాంతో ప్రశ్నపత్రాల తయారీ, వాటిని భద్రపరచడం, వాటి ద్వారా పరీక్షలు నిర్వహించడం, ఇందుకోసం అనుసరించే పద్ధతుల గురించి అనితా రామచంద్రన్ను విచారించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు కార్యదర్శి వద్ద పనిచేస్తున్న ప్రవీణ్ ప్రశ్నపత్రాలు కొల్లగొట్టినందున దానికి సంబంధించి కూడా ఆమెను ప్రశ్నించవచ్చు. ముఖ్యంగా ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాసేందుకు అనుమతించినప్పటికీ అతడిని విధుల నుంచి ఎందుకు తప్పించలేదన్న దానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. లీకైన గ్రూప్-1 ప్రశ్నపత్రం రమేష్ అనే వ్యక్తికి కూడా అందింది. కమిషన్ సభ్యుడు లింగారెడ్డికి సహాయకుడిగా రమేష్ పనిచేస్తున్నాడు. గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ రమేష్తో సాన్నిహిత్యం కొనసాగించడంపై సిట్ అధికారులు లింగారెడ్డిని ప్రశ్నించనున్నారు. విచారణలో వీరు ఇచ్చే సమాచారం ఆధారంగా కమిషన్లో ఇంకా ఎవర్నైనా ప్రశ్నించాలా? అన్నది నిర్ణయిస్తారు.
నిందితులకు వైద్యపరీక్షలు
పోలీసు కస్టడీలో ఉన్న నిందితులు రమేష్, సురేష్, షమీమ్లను శుక్రవారం హిమాయత్నగర్ సిట్ కార్యాలయంలో విచారించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ మాస్టర్ ప్రశ్నపత్రం ఏవిధంగా అందిందనే వివరాలు రాబట్టారు. ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలనే ఉద్దేశంతోనే తాము ప్రశ్నపత్రం లీక్ చేసినట్టు ముగ్గురూ అంగీకరించినట్టు సమాచారం. తమద్వారా ఎవరికీ విక్రయించలేదని వారు పోలీసుల వాంగ్మూలంలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కస్టడీ ముగిసేంతవరకు నిందితులకు 48 గంటలకోసారి వైద్యపరీక్షలు నిర్వహించాలన్న న్యాయస్థానం ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం ముగ్గురికీ కింగ్కోఠి ప్రభుత్వాసుపత్రిలో వైద్యపరీక్షలు నిర్వహించారు. లీకైన ప్రశ్నపత్రాలతో అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్) పరీక్షరాసిన రాజేందర్కుమార్, ప్రశాంత్రెడ్డి, దళారి తిరుపతయ్యల నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు ముగ్గురినీ కస్టడీకి కోరుతూ సిట్ పోలీసులు న్యాయస్థానంలో గురువారం పిటిషన్ దాఖలు చేశారు.
ఎనీడెస్క్ ద్వారా ప్రశ్నపత్రం చేరవేత
కొట్టేసిన వాటిలో గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్రెడ్డి న్యూజిలాండ్లో ఉన్న తన బావ ప్రశాంత్కు వాట్సప్ ద్వారా పంపినట్టు సిట్ పోలీసులు తొలుత అనుమానించారు. కానీ వాస్తవానికి రాజశేఖర్రెడ్డి మొదట ఈ-మెయిల్ ద్వారా ప్రశ్నపత్రం పంపాడని, అది ఎర్రర్ రావటంతో కమిషన్ ఉద్యోగిని (నిందితురాలు) షమీమ్ ల్యాప్టాప్లో ‘ఎనీడెస్క్’ను డౌన్లోడ్ చేసి దాని ద్వారా ప్రశ్నపత్రాన్ని అతని బావకు చేరవేసినట్టు సాంకేతిక విశ్లేషణ ద్వారా పోలీసులు గుర్తించారు. శుక్రవారం ఎల్బీనగర్లోని షమీమ్ నివాసంలో జరిపిన సోదాల్లో ల్యాప్ట్యాప్, మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. అలాగే ఏఈ (సివిల్) పరీక్ష ప్రశ్నపత్రం కూడా లీక్ కావడంతో దానికి దరఖాస్తు చేసిన అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. అందులోనూ డాక్యానాయక్, తిరుపతయ్యలతో సంబంధాలున్న వారి వివరాలు రాబట్టేందుకు సిట్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
62వేల మంది వాలంటీర్లు రాజీనామా చేశారు.. కోర్టుకు తెలిపిన ఈసీ న్యాయవాది
-
ఎన్నికలను మేం నియంత్రించలేం: ‘వీవీప్యాట్’ కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు
-
జగన్పై రాయిదాడి కేసు.. సతీష్ కస్టడీకి కోర్టు అనుమతి
-
హార్దిక్.. ముందు నీ ఆటపై దృష్టిపెట్టు: వీరేంద్ర సెహ్వాగ్
-
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
-
5,000mAh బ్యాటరీ.. 50MP కెమెరాతో నార్జో సిరీస్లో కొత్త ఫోన్లు