Private Schools Fee: ఫీజుల ‘మోత’
ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని డీడీ కాలనీలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి 8వ తరగతి ఫీజు రూ.80 వేలు.
ప్రైవేటు బడుల్లో రుసుములు పైపైకి..
కొన్ని పాఠశాలల్లో 25 శాతం, కార్పొరేట్ స్కూళ్లలో 50 శాతం వరకూ పెంపు
నియంత్రణపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినా ఫలితం శూన్యం
బెంబేలెత్తుతున్న తల్లిదండ్రులు
ఈనాడు - హైదరాబాద్
* ఉస్మానియా విశ్వవిద్యాలయం సమీపంలోని డీడీ కాలనీలో ఉన్న ఓ కార్పొరేట్ పాఠశాలలో ప్రస్తుత విద్యాసంవత్సరానికి 8వ తరగతి ఫీజు రూ.80 వేలు. వచ్చే ఏడాది 9వ తరగతి చదివేందుకు రూ.1.20 లక్షలు చెల్లించాలని పాఠశాల ప్రతినిధులు సమాచారం పంపారు. అంటే పైతరగతికి 50 శాతం పెంచేశారన్నమాట.
* కోకాపేటలోని ఓ అంతర్జాతీయ పాఠశాలలో ఈ సంవత్సరం 4వ తరగతికి రూ.1.23 లక్షల ఫీజు ఉంది. వచ్చే ఏడాది అయిదో తరగతిలో చేరాలంటే రూ.1.58 లక్షలు చెల్లించాలనే సందేశం తల్లిదండ్రులకు వెళ్లింది. అంటే పైతరగతికి అదనంగా రూ.35 వేలు (28 శాతం) పెరిగింది.
* ఉప్పల్ చౌరస్తా సమీపంలోని ఓ ప్రముఖ పాఠశాల అది. చాలా పాఠశాలలతో పోల్చుకుంటే అక్కడ కొంత రుసుములు తక్కువన్న పేరుంది. అయినా ఈసారి ఒకటో తరగతిలో ప్రవేశానికి 14 శాతం పెంచడం గమనార్హం. అక్కడ ప్రస్తుత విద్యాసంవత్సరంలో ఒకటో తరగతిలో చేరేందుకు రూ.50 వేలు ఫీజు నిర్ణయించగా.. వచ్చే ఏడాదికి దాన్ని రూ.57 వేలకు పెంచారు. 4వ తరగతి ఫీజు రూ.49,500 ఉండగా.. 5వ తరగతిలో దీని కన్నా దాదాపు 18 శాతం అదనంగా రూ.58,400 చెల్లించాలి.
* కూకట్పల్లిలోని రెండో శ్రేణి కార్పొరేట్ పాఠశాలలో 6వ తరగతి రుసుం రూ.48 వేలు ఉండగా.. వచ్చే ఏడాదికి రూ.58 వేలకు (20 శాతానికి పైగా) పెంచారు.
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారంగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ బడులు.. ముఖ్యంగా కార్పొరేట్, ఇంటర్నేషనల్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి. వచ్చే విద్యాసంవత్సరానికి(2023-24) కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కార్పొరేట్ పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా 2020-21, 2021-22 విద్యాసంవత్సరాలకు పాత ఫీజులే తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాంటి ఆదేశాలేవీ లేకపోవడంతో పలు పాఠశాలలు 2022-23 విద్యాసంవత్సరంలో భారీగా పెంచాయి. వచ్చే ఏడాదీ మరోసారి మోత మోగించనున్నాయి. ఇప్పటికే చాలా బడులు కొత్త రుసుముల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేయగా.. మరికొన్ని ఈ నెల 15వ తేదీ తర్వాత నిర్ణయించనున్నాయి. దీనిపై తల్లిదండ్రులు ప్రశ్నిస్తే తామూ సిబ్బంది వేతనాలను పెంచాలంటూ కొన్ని పాఠశాలల యాజమాన్యాలు వాదిస్తున్నాయి. అయితే సిబ్బందికి అరకొర పెంచి.. మిగిలిన మొత్తాన్ని జేబుల్లో వేసుకుంటున్నాయన్న ఆరోపణలున్నాయి.
నియంత్రణ చట్టం ఏదీ?
పాఠశాలల రుసుముల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని 2022 జనవరి 17వ తేదీన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది. 11 మంది మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. పాత ఫీజు కంటే ఏటా 10 శాతానికి మించి పెంచకూడదని, మరికొన్ని సిఫారసులను అమలు చేయాలంటూ ప్రభుత్వానికి ఆ కమిటీ పంపింది. వీటిపై చట్టం చేయాలంటే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టాలి. గత ఏడాది కాలంగా ఆ ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు లేనందువల్ల ఆర్డినెన్స్ జారీ చేయవచ్చు. ఆ దిశగా కూడా చర్యలు లేవు. వచ్చే ఏడాది ఫీజులు తడిసిమోపెడు కానుండటంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశాం
-వెంకట్, సంయుక్త కార్యదర్శి, హైదరాబాద్ స్కూల్ పేరెంట్స్ అసోసియేషన్
మేము దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు అడిగితేనే చట్టం తీసుకువస్తామని మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం నియమించింది. అయినా చర్యలు లేకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు దాఖలు చేశాం. దాంతో ప్రభుత్వానికి హైకోర్టు ఇటీవల నోటీసులు జారీ చేసింది. ఫీజుల నియంత్రణపై ఆచార్య తిరుపతిరావు కమిటీ 2017 డిసెంబరులో నివేదిక సమర్పించింది. అయిదేళ్లు దాటినా ఇప్పటికీ కమిటీ సిఫారసులను పరిశీలిస్తున్నామని సర్కారు చెబుతోంది. ప్రభుత్వ చిత్తశుద్ధి లేమితో ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా రుసుములను పెంచుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి పదో తరగతిలో వచ్చిన మార్కులు.. 100, 99, 100, 100, 100, 100.. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.
తాజా వార్తలు (Latest News)
-
మాధురి దీక్షిత్తో నటించాలంటే భయమేసింది: మనీషా కొయిరాలా
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా