ప్రవీణ్ను సెలవుపై పంపలేదేం?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుంది.
టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితా రామచంద్రన్ను ప్రశ్నించిన సిట్
ఆమెతో పాటు సభ్యుడు లింగారెడ్డిపైనా ప్రశ్నల వర్షం
గ్రూప్-1 ప్రశ్నపత్రాలపై వివరాల సేకరణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) ప్రశ్నపత్రం లీకేజీ కేసు దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. సంచలనం రేకెత్తించిన గ్రూప్-1 ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ను సిట్ అధికారులు శనివారం ఉదయం దాదాపు రెండు గంటలపాటు విచారించారు. సిట్ ఇన్ఛార్జి, అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ స్వయంగా ఆమెను విచారించారు. పరీక్షల నిర్వహణ వ్యవహారం అంతా కార్యదర్శి అధీనంలోనే ఉంటుంది. కాన్ఫిడెన్షియల్ విభాగం కూడా కార్యదర్శి ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది. ఈ విభాగానికి ఇన్ఛార్జిగా ఉన్న శంకరలక్ష్మి యూజర్ ఐడీ, పాస్వర్డ్ కొట్టేసిన ప్రవీణ్ ప్రశ్నపత్రాలను చౌర్యం చేశాడు. అతడు కార్యదర్శికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేయడంతో సిట్ అధికారులు అనితా రామచంద్రన్ను విచారణకు పిలిపించినట్లు తెలుస్తోంది. ప్రశ్నపత్రాల తయారీ నుంచి పరీక్షలు నిర్వహించేవరకు అనుసరించే విధానం గురించి సిట్ అధికారులు ఆమెను ప్రశ్నించారు. ముఖ్యంగా ప్రశ్నపత్రాలను దాచి ఉంచే కాన్ఫిడెన్షియల్ విభాగంలో భద్రతా ఏర్పాట్లపై ఎక్కువ ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ప్రవీణ్ గ్రూప్-1 పరీక్ష రాస్తున్నప్పటికీ సెలవుపై ఎందుకు పంపలేదని, ప్రిలిమ్స్లో అతడు 100కి పైగా మార్కులు సాధించినా ఎందుకు అనుమానించలేదని ఆరా తీసినట్లు తెలుస్తోంది. అవసరమైతే మరోమారు విచారణకు హాజరుకావాల్సి ఉంటుందని చెప్పినట్లు సమాచారం. మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు కమిషన్ సభ్యుడు లింగారెడ్డిని కూడా సిట్ అధికారులు విచారించారు. ఈయనకు సహాయకుడిగా పనిచేసిన రమేష్కు కూడా గ్రూప్-1 ప్రశ్నపత్రం లీక్ అయింది. ప్రవీణ్ ద్వారానే ఇది అందినట్టు పోలీసుల దర్యాప్తులో నిర్ధారించారు. దీంతో అసలు రమేష్ సహాయకుడిగా ఎప్పటి నుంచి పనిచేస్తున్నాడు.. అతడి ప్రవర్తన ఎలా ఉండేది తదితర వివరాలు లింగారెడ్డిని అడిగినట్లు తెలుస్తోంది. రమేష్ గ్రూప్-1 పరీక్ష రాసిన విషయం తనకు తెలియదని లింగారెడ్డి సిట్ అధికారులకు చెప్పినట్లు సమాచారం. విచారణలో భాగంగా లింగారెడ్డి ఎదురుగా రమేష్ను ఉంచారు. అతడే తన పీఏ అని లింగారెడ్డి ధ్రువీకరించినట్టు తెలిసింది.
ఒప్పంద ఉద్యోగ నియామకాలపై ఆరా
టీఎస్పీఎస్సీలో గ్రూప్-1, ఏఈ సివిల్, టౌన్ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ ప్రశ్నపత్రాల లీకేజీలో కీలక నిందితుడు నెట్వర్క్ ఇన్ఛార్జి రాజశేఖర్రెడ్డి, లీకైన ప్రశ్నపత్రంతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష రాసిన సురేష్ ఇద్దరూ కమిషన్లో ఒప్పంద ఉద్యోగులే. అసలు ఒప్పంద ఉద్యోగుల నియామకం, ఎంపిక ప్రక్రియ విధివిధానాలపై కార్యదర్శి అనితా రామచంద్రన్ నుంచి సిట్ అధికారులు వివరాలు సేకరించినట్టు సమాచారం. ఎంపికలో ఛైర్మన్, కార్యదర్శి, బోర్డు సభ్యుల పాత్ర ఏ మేరకు ఉంటుంది? పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాల రూపకల్పన ఎలా జరుగుతుంది? ఎన్ని రకాల ప్రశ్నపత్రాలు తయారు చేస్తారు? ఇవి ఎవరి అధీనంలో ఉంటాయి.. వంటి అంశాలపై ప్రశ్నించి ఆమె వాంగ్మూలం నమోదు చేసినట్టు తెలుస్తోంది. పోటీ పరీక్షల ప్రశ్నపత్రాలు, సమాధానాలు, కీ తదితర అంశాలు ఛైర్మన్ అధీనంలో ఉంటాయని అనితా రామచంద్రన్ చెప్పినట్టు సమాచారం.
25 మంది అభ్యర్థులకు గ్రూప్-1 మోడల్ పరీక్ష!
పోలీసు కస్టడీలో ఉన్న ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్లను శనివారం నాలుగోరోజు సుదీర్ఘంగా సిట్ అధికారులు విచారించారు. రెండు రోజుల క్రితమే ఈ ముగ్గురి ఇళ్లలో సోదాలు చేసి గ్రూప్-1 మాస్టర్ ప్రశ్నపత్రం, సెల్ఫోన్లు, ల్యాప్ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్ ద్వారానే ప్రశ్నపత్రం వచ్చినట్టు ఆ ముగ్గురూ అంగీకరించారు. ఒకేచోట పనిచేస్తున్న తాము పరిచయాల ద్వారానే ప్రశ్నపత్రాలు తీసుకున్నట్టు నిందితురాలు షమీమ్ చెప్పినట్టు సమాచారం. ప్రశ్నపత్రాలు చేతులు మారేందుకు తాము ఎవరికీ డబ్బులివ్వలేదని వెల్లడించినట్టు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రిలిమ్స్లో 100కి పైగా మార్కులు వచ్చిన 121 మందిలో 110 మంది అభ్యర్థులను విచారించారు. వీరిలో కొందరిని రెండోసారి పిలిచి ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. టీఎస్పీఎస్సీ నుంచి గ్రూప్- 1 ప్రిలిమ్స్ మోడల్ పేపర్ తెప్పించి సిట్ కార్యాలయంలో సుమారు 25 మంది అభ్యర్థులతో పరీక్ష రాయించినట్టు విశ్వసనీయ సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు. -
భూసార పరీక్ష కేంద్రాల పునరుద్ధరణ
రాష్ట్రంలో మూతపడిన 25 భూసార పరీక్ష కేంద్రాలను పునరుద్ధరించాలని, నేల పోషక విలువలు, ఆరోగ్య సమాచార సేవలను రైతులకు అందుబాటులోకి తేవాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
శ్రీరాముడి పట్టాభిషేకం.. పులకించిన భక్తజనం
శ్రీరాముడి మహాపట్టాభిషేక మహోత్సవంతో భద్రగిరి దివ్యక్షేత్రం గురువారం పులకించింది. సింహాసనాన్ని అధిష్ఠించిన రామచంద్రుడు సీతమ్మతో కలిసి భక్తకోటికి రాజాధిరాజుగా సాక్షాత్కరించాడు. -
కృష్ణా జలాల విడుదలకు కేఆర్ఎంబీ ఉత్తర్వులు
కృష్ణా జలాల విడుదలకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు గురువారం ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలాఖరు వరకు నాగార్జునసాగర్ నుంచి రెండు రాష్ట్రాలు 14 టీఎంసీలు వినియోగించుకునేందుకు వెసులుబాటు కల్పించింది. -
‘గ్రేటర్’ విద్యుత్ డిమాండ్!
హడలెత్తిస్తున్న ఎండలు.. భరించలేని ఉక్కపోతతో గ్రేటర్ హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం అమాంతం పెరుగుతోంది. -
అభిషేక్ బోయిన్పల్లి మధ్యంతర బెయిల్ మే 8 వరకు పొడిగింపు
దిల్లీ మద్యం కేసులో నిందితుడిగా ఉన్న హైదరాబాద్ వ్యాపారి అభిషేక్ బోయిన్పల్లికి ఈనెల 29వ తేదీ వరకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను సుప్రీంకోర్టు మే 8 వరకు పొడిగించింది. -
జపాన్లో భారత విద్యార్థులకు ఉపకార వేతనాలు
జపాన్లోని జాతీయ విశ్వవిద్యాలయాల్లో 2025లో ప్రవేశాలు పొందే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల విద్యార్థులకు తమ దేశ ప్రభుత్వం విద్యా, సాంస్కృతిక, క్రీడ, శాస్త్ర, సాంకేతిక శాఖ(మెక్స్ట్) ద్వారా ఉపకారవేతనాలు ఇస్తుందని చెన్నైలోని జపాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం గురువారం వెల్లడించింది. -
మహాత్మాగాంధీ సిద్ధాంతాలు ప్రపంచానికి ఆదర్శం
జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలు, అహింసా సిద్ధాంతం ప్రపంచానికి ఆదర్శనీయమని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ పేర్కొన్నారు. -
మళ్లీ వరికే పెద్దపీట
రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో రైతులు వరి, పత్తి సాగుకు పెద్దపీట వేయనున్నట్లు వ్యవసాయశాఖ అంచనా వేస్తోంది. -
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్తో అప్రమత్తం
మావోయిస్టులను దెబ్బతీసేందుకు ఛత్తీస్గఢ్లో జరుగుతున్న ప్రయత్నాలు తెలంగాణపైనా ప్రభావం చూపుతున్నాయి. -
చెరువుల పరిరక్షణకు.. చర్యలేమిటో చెప్పండి!
కబ్జాలతో కుచించుకుపోతున్న చెరువులు, కుంటల పరిరక్షణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ హెచ్ఎండీయేతోపాటు పలు ప్రభుత్వ శాఖలకు గురువారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్ వేటు
మల్టీజోన్-1 పరిధిలో ఆరుగురు పోలీస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ఐజీ ఎ.వి.రంగనాథ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
గూగుల్ మ్యాప్స్లో మరో కొత్త ఫీచర్.. ఈవీ స్టేషన్లు వెతకడం ఇక సులువే!
-
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
-
40 గంటల బ్యాటరీ లైఫ్తో నథింగ్ నుంచి 2 కొత్త ఇయర్బడ్స్