Google Takeout: గూగుల్ టేకవుట్ సమాచారం కచ్చితమైనదే
గూగుల్ టేకవుట్ ఇచ్చే సమాచారం అత్యంత కచ్చితత్వంతో కూడుకున్నదని, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ తదితర క్లౌడ్ స్టోరేజీ సంస్థల నుంచి తీసుకునే డేటాను తప్పుపట్టలేమని సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ స్పష్టంచేశారు.
న్యాయస్థానాలు సాంకేతిక ఆధారాలుగా పరిగణిస్తున్నాయి
క్లౌడ్ స్టోరేజీలు ఇచ్చే డేటాను తప్పుపట్టలేం
‘ఈనాడు-ఈటీవీ’తో సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్
ఈనాడు - హైదరాబాద్
గూగుల్ టేకవుట్ ఇచ్చే సమాచారం అత్యంత కచ్చితత్వంతో కూడుకున్నదని, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్ తదితర క్లౌడ్ స్టోరేజీ సంస్థల నుంచి తీసుకునే డేటాను తప్పుపట్టలేమని సైబర్ ఫోరెన్సిక్ నిపుణుడు నల్లమోతు శ్రీధర్ స్పష్టంచేశారు. జిల్లా కోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకూ క్లౌడ్ స్టోరేజీ సంస్థలు ఇచ్చే డేటాను సాంకేతిక ఆధారాలుగా పరిగణిస్తున్నాయని తెలిపారు. దర్యాప్తు ఏజెన్సీలు గూగుల్ సంస్థ అధికారికంగా ఇచ్చే లేఖ, సమాచారం తాలూకు మెయిల్తో సహా న్యాయస్థానంలో సమర్పిస్తున్నాయని వివరించారు. మాజీ ఎంపీ వివేకానందరెడ్డి హత్యోదంతం సహా వివిధ కేసుల దర్యాప్తులో గూగుల్ టేకవుట్ సమాచారం కీలకంగా మారిన నేపథ్యంలో దాన్ని దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్న తీరు, సమాచార కచ్చితత్వం సహా అనేక అంశాలను ‘ఈనాడు- ఈటీవీ’ ముఖాముఖిలో శ్రీధర్ వివరించారు.
దర్యాప్తు సంస్థలు సేకరించిన సమాచారం నిజమైనదని ఎలా చెప్పగలం?
గూగుల్ సంస్థ ఇచ్చే సమాచారం క్లౌడ్ స్టోరేజీ నుంచి వస్తుంది. టేకవుట్లో ఉండేదంతా నిత్యం రికార్డయ్యే ఒక సాంకేతిక ఆధారం. దాన్ని మార్చడానికి వీల్లేదు. సాంకేతికతపై పట్టున్న వ్యక్తులు మ్యాప్స్ లేదా డేటా రికార్డవకుండా చూడొచ్చు. లేదా రికార్డయిన దాన్ని చెరిపేయవచ్చు. అలా చెరిపేసినప్పటికీ పాత డేటా మొత్తం గూగుల్ దగ్గర ఉంటుంది. దర్యాప్తు సంస్థలు అడిగినప్పుడు చెరిపేసిన పాత డేటాను గూగుల్ ఇస్తుంది. ఏదేమైనా ఆ డేటా మాత్రం పూర్తిగా నిజం. అది వాస్తవమైన సమాచారమేనా అని తెలుసుకోవడానికి న్యాయస్థానం గూగుల్ నుంచి వచ్చిన అధీకృత లేఖలు చూపించాల్సిందిగా కోరవచ్చు.
గూగుల్ టేకవుట్ ఎంత కచ్చితత్వంతో మ్యాప్స్ సేకరించగలుగుతుంది?
ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగించే వ్యక్తి ఒక ప్రదేశానికి వెళ్తే, అక్కడికి 50 మీటర్ల పరిధిలో తేదీ, టైమ్ జోన్ల ప్రకారం గూగుల్ మ్యాప్స్లో రికార్డవుతుంది. ఇది 100 శాతం కచ్చితత్వంతో పనిచేస్తుంది. ఒక ప్రదేశంలో ఉంటే, ఇంకో చోట ఉన్నట్లుగా మార్చడం సాధ్యపడదు. ఇలా రికార్డయిన డేటా మొత్తం గూగుల్ క్లౌడ్లో నిల్వ ఉంటుంది. మనం ఫోన్తో ఎక్కడెక్కడికి ప్రయాణించాం? ఏయే సమయంలో ఎక్కడెక్కడ ఉన్నామో? కూడా రియల్టైమ్లో నమోదవుతుంది.
గూగుల్ ఇచ్చే సమాచారాన్ని దర్యాప్తు సంస్థలు వినియోగిస్తున్నాయని నిందితులు తెలుసుకుని అప్రమత్తమయ్యే అవకాశముందా?
గూగుల్ టేకవుట్కు సంబంధించిన లొకేషన్ హిస్టరీ నిలిపేసిన, చెరిపేసిన పక్షంలో అది యూజర్ల ఖాతాలో కనపడదు. గూగుల్ సర్వర్లలో మాత్రం నిక్షిప్తమవుతుంది. 2017లో వాట్సప్ సంభాషణల డేటా ఆధారంగా మాదక ద్రవ్యాల నియంత్రణ సంస్థ(ఎన్సీబీ) 2021లో ఓ కేసును ఛేదించింది. నేరగాళ్లు ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ డేటా మళ్లీ పునరుద్ధరించి(రిట్రీవల్) గూగుల్కు సంబంధించి యూజర్లు ఏ సర్వీసును వినియోగించారో తెలుసుకోవచ్చు. యూజర్ ఖాతాలో ఏయే ఐపీ అడ్రస్ నుంచి సర్వీసు వినియోగించారు? ఎప్పుడు వినియోగించారో కూడా గుర్తించవచ్చు. కొందరు నేరగాళ్లు గూగుల్ కాంటాక్టులు డిలీట్ చేస్తారు. దర్యాప్తు సంస్థలు అలాంటి వాటి బ్యాకప్ డేటానూ పొందవచ్చు.
దర్యాప్తు సంస్థలు సాంకేతిక ఆధారాలను గూగుల్ డేటా నుంచి ఎలా తీసుకోవచ్చు?
ఒక సంఘటన చోటుచేసుకున్నప్పుడు అది జరిగిన తేదీ, సమయం, ఎలా జరిగింది? అక్కడ ఎవరెవరున్నారు? అనే అంశాల ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగుతుంది. ఈ కోణంలోనే దర్యాప్తు సంస్థలు గూగుల్ టేకవుట్ ద్వారా ఆధారాలు లభిస్తాయేమోనని పరిశీలిస్తాయి. అనుమానితుల గూగుల్ ఖాతా యూజర్ ఐడీ, పాస్వర్డ్ ఆధారంగా వారి కదలికలు తెలుసుకుంటాయి. ఓ కేసు దర్యాప్తులో గూగుల్ టేకవుట్ నుంచి తీసుకున్న సమాచారం ఒక చిన్న అంశం మాత్రమే. ఘటనకు కొన్ని రోజుల ముందు ఏం జరిగింది? పథకాన్ని ఎలా అమలు చేశారు? అది హత్యా? లేక ఇతర కారణం ఏదైనా ఉందా? అనే అంశాలతో పోలిస్తే టేకవుట్ ద్వారా తీసుకున్న సమాచారం ప్రాధాన్యమైనదేమీ కాకపోవచ్చు, లేదా ఒకింత కీలకం కావొచ్చు కూడా. ఏదేమైనా దేశంలో 10 దర్యాప్తు సంస్థలకు సాంకేతిక అంశాలపరంగా సర్వాధికారాలు ఉన్నాయి. ఆయా దర్యాప్తు సంస్థలు ఎవరైనా నేరంలో భాగస్వాములయ్యారని అనుమానించే పక్షంలో.. వారి క్లౌడ్ డేటా ఇవ్వాలని గూగుల్కు అధికారికంగా లేఖ రాసి, టేకవుట్ ద్వారా సమాచారం తీసుకోవచ్చు.
గూగుల్ టేకవుట్ ఏ ఉద్దేశంతో ప్రారంభించారు?
జీమెయిల్, డ్రైవ్, ఫొటోలు, మ్యాప్స్ ఇలా గూగుల్ అందించే సేవలకు సంబంధించిన బ్యాకప్ పొందడానికి వీలుగా టేకవుట్ను గూగుల్ సంస్థ ప్రారంభించింది. దీన్నే సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలు నేర పరిశోధనలో భాగంగా వినియోగిస్తున్నాయి. సాంకేతిక ఆధారాలు సేకరిస్తే, ఎంత జటిలమైన కేసులైనా ఛేదించవచ్చు. వాస్తవానికి సర్వర్ల నుంచి డేటా ద్వారా ఆధారాలు సేకరించే ప్రక్రియ రహస్యంగా జరుగుతుంది. దర్యాప్తు సంస్థలు ఫలానా పద్ధతిలో ఆధారాలు సేకరించామని చెబితేనే అది బయటకు తెలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM