Computer Science - EAMCET: కంప్యూటర్ సైన్స్ కోసం ఎంసెట్లో పోటీ
విద్యార్థుల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే ఎంత మక్కువ ఉందో బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది.
71 శాతం బాసర ఆర్జీయూకేటీ విద్యార్థుల దరఖాస్తు
ఆ బ్రాంచీ చదివితే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయనే భావన
పీయూసీ పూర్తయిన వెంటనే వర్సిటీ నుంచి వెనక్కి
ఈనాడు, హైదరాబాద్: విద్యార్థుల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అంటే ఎంత మక్కువ ఉందో బాసరలోని రాజీవ్ గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం(ఆర్జీయూకేటీ)లో పరిస్థితిని చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ప్రతిష్ఠాత్మక వర్సిటీలో ప్రవేశం పొందినవారు సైతం రెండేళ్ల ఇంటర్ పూర్తయిన తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్ బ్రాంచీలో అవకాశం లభిస్తుందో లేదోనని ఎంసెట్ రాసేందుకు పోటీపడుతుండటం విశేషం. ఏ పది మందో.. ఇరవై మందో కాదు.. ఏకంగా 1,061 మంది ఈ నెల 10వ తేదీ నుంచి జరిగే ఎంసెట్కు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. వీరిలో 35 మంది ఎంసెట్ అగ్రికల్చర్కు దరఖాస్తు చేసుకున్నారు. బాసర ఆర్జీయూకేటీలో ఏటా 1,500 మంది ప్రవేశాలు పొందుతారు. వారిలో 1,061 మంది అంటే దాదాపు 71 శాతం మంది ఎంసెట్కు దరఖాస్తు చేసుకోవడం విశేషం.
బాసరలో 350 సీట్లే..
పదో తరగతిలో టాపర్లుగా నిలిచిన 40 వేల మంది పోటీపడితే 1,500 మందికే బాసర ఆర్జీయూకేటీలోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్లో ప్రవేశాలు లభిస్తాయి. అందులో తొలి రెండేళ్లను పీయూసీగా పిలుస్తారు. ఇది ఇంటర్తో సమానం. ఆ తర్వాత నాలుగేళ్లు బీటెక్. ఇంటర్లో 6 సీజీపీఏ తెచ్చుకుంటేనే బీటెక్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రెండేళ్ల పీయూసీ ధ్రువపత్రం తీసుకొని వెళ్లిపోవాల్సిందే. మిగిలిన వారికి పీయూసీలో మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా కౌన్సెలింగ్ నిర్వహించి.. బీటెక్లోని ఏడు ఇంజినీరింగ్ బ్రాంచీల్లోని 1,500 సీట్లను భర్తీ చేస్తారు. కంప్యూటర్ సైన్స్లో 350 సీట్లే ఉన్నాయి. అంటే అందరికీ అవి దక్కవు. కంప్యూటర్ సైన్స్ చదివితేనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్కువ మంది ఎంసెట్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఎంసెట్లో 45 వేల సీట్లు..
ఎంసెట్లో మంచి ర్యాంకు సాధిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్లో చేరవచ్చన్నది విద్యార్థుల ఆలోచన. కన్వీనర్ కోటాలో 75 వేల వరకు సీట్లుండగా.. వాటిలో 45 వేల వరకు కంప్యూటర్ సైన్స్, ఐటీ సంబంధిత సీట్లే ఉండటంతో మంచి కళాశాలలో సీటు దక్కించుకోవచ్చని వారు భావిస్తున్నారు. ‘నాకు కంప్యూటర్ సైన్స్ అంటే ఇష్టం. అమ్మానాన్నలు కూడా అదే చదవాలని చెబుతున్నారు. అందుకే ఎంసెట్లో మంచి ర్యాంకు సాధించి ఉత్తమ కళాశాలల్లో చేరవచ్చని దరఖాస్తు చేశాను’ అని కరీంనగర్కు చెందిన ఓ విద్యార్థి తెలిపారు. తన స్నేహితుల్లో ఎక్కువ మంది ఇదే భావనతో ఉన్నారని చెప్పారు. ‘మా విద్యార్థుల్లో ఏటా కొందరు ఎంసెట్ రాస్తున్నారు. ఎక్కడ తమ భవిష్యత్తు బాగుంటుందని అనుకుంటే అక్కడికి వెళ్తారు’ అని ఆర్జీయూకేటీ సంచాలకుడు సతీశ్కుమార్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్
-
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
-
ఇరాన్ అదుపులో నౌక.. భారత సిబ్బందిలోని కేరళ యువతి క్షేమంగా ఇంటికి..
-
ముంబయి గెలవాలంటే.. హార్దిక్ ఫామ్ అందుకోవడం అత్యవసరం: ఫించ్