Palamuru-Rangareddy: పాలమూరు పరుగు.. జూన్ ఆఖరుకు వట్టెం జలాశయానికి నీళ్లు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది.
ఉదండాపూర్కు సెప్టెంబరు నాటికి తీసుకెళ్లాలన్నది లక్ష్యం
4 పంపుహౌస్లలో కొనసాగుతున్న విద్యుదీకరణ పనులు
ఈనాడు, హైదరాబాద్: పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయడానికి నీటిపారుదల శాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా భూ సేకరణ, ఎలక్ట్రిఫికేషన్ లాంటి కీలకమైన పనులపై దృష్టిసారించింది. వచ్చే జూన్ వరకు వట్టెం జలాశయానికి, జులైలో కర్వెన జలాశయానికి నీటిని చేర్చాలన్నది ప్రధాన లక్ష్యం. సెప్టెంబరు నాటికి ఉదండాపూర్ జలాశయానికి నీళ్లు చేరాలని తుది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు తాగునీటి పనులు త్వరగా పూర్తి చేయాలని ఇటీవల సీఎం కేసీఆర్ లక్ష్యాన్ని నిర్దేశించారు. ఉదండాపూర్ నుంచి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు నీటిని ఇచ్చేందుకు కాలువల పనుల నిధుల విడుదల దస్త్రంపైనా ఆయన సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు పనులపై ఇంజినీర్లు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అవరోధాలు అధిగమించడంపై దృష్టి సారించారు. ప్రస్తుతం నాలుగు పంపుహౌస్లలో హైటెన్షన్ విద్యుత్ సరఫరాకు సంబంధించి ట్రాన్స్ఫార్మర్లు, ప్యానెల్ బోర్డుల పనులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్యాకేజీల కింద భూ సేకరణ నిలిచిపోయి ఉంది. ఉదండాపూర్ జలాశయం కింద ముంపు గ్రామాల తరలింపు, పరిహారం చెల్లింపులు వంటివి చేపట్టాల్సి ఉంది. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోని 12.22 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును నిర్మిస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలంలోని నార్లాపూర్ వద్ద శ్రీశైలం వెనుక జలాలను తీసుకుంటారు. 90 టీఎంసీలను వివిధ దశల్లో ఎత్తిపోసి తరలించేందుకు మొత్తం 18 ప్యాకేజీలవారీగా పనులను విభజించి నిర్మిస్తున్నారు.
ప్యాకేజీల వారీగా పనుల పురోగతి ఇదీ..
ప్యాకేజీ 1, 2
మొదటి పంపుహౌస్లో తొమ్మిది పంపులు ఏర్పాటుచేయాల్సి ఉండగా ఇప్పటికే రెండు పూర్తికావొచ్చాయి. ఎలక్ట్రిఫికేషన్ పనులు కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి నీటిని నార్లాపూర్ జలాశయంలోకి ఎత్తిపోస్తారు. ఈ రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం 6.40 టీఎంసీలు. జూన్ చివరి నాటికి 30 శాతం నీటిని నిల్వ చేసేందుకు పనులు వేగవంతం చేస్తున్నారు. ఇరవై ఎకరాల వరకు భూ సేకరణ పూర్తి చేయాల్సి ఉండగా 90 శాతానికిపైగా పనులు పూర్తికావొచ్చాయి.
ప్యాకేజీ 3, 4
నార్లాపూర్ జలాశయం, ఏదుల జలాశయానికి మధ్య ప్రధాన కాలువ, రెండు సొరంగాల పనులు చేపట్టాల్సి ఉండగా ఒక సొరంగం నిర్మిస్తున్నారు. మరో పది ఎకరాల వరకు భూ సేకరణ చేయాల్సి ఉంది.
ప్యాకేజీ 5, 6
ఏదుల పంపుహౌస్ పనులు 80 శాతం వరకు పూర్తయ్యాయి. ఇక్కడ తొమ్మిది పంపులు ఏర్పాటు చేయాల్సి ఉండగా ప్రస్తుతం రెండింటి పనులు చేపడుతున్నారు. 6.55 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న జలాశయం పనులు కొలిక్కివచ్చాయి. ఇంకా 11 ఎకరాల భూ సేకరణ పెండింగ్లో ఉంది.
ప్యాకేజీ 7, 8
ఏదుల జలాశయం నుంచి నిర్మిస్తున్న రెండు సొరంగాలలో ఒకటి జూన్ చివరికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వట్టెం లిఫ్టులో 10 పంపులు బిగించాల్సి ఉండగా రెండు సిద్ధం చేస్తున్నారు. పనులు కొనసాగుతున్నాయి. 30 ఎకరాల వరకు భూ సేకరణ పెండింగ్లో ఉంది.
ప్యాకేజీ 9, 10, 11
1.33 లక్షల కొత్త ఎకరాల ఆయకట్టుకు సాగునీటితోపాటు దిగువకు నీటిని అందించేందుకు 16.74 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న వట్టెం జలాశయం పనులు కూడా కొలిక్కివచ్చాయి. జూన్ ఆఖరుకు పూర్తి చేయాలనేది లక్ష్యం.
ప్యాకేజీ 12
వట్టెం జలాశయం నుంచి కర్వెన జలాశయానికి వెళ్లే 12 కిలోమీటర్ల కాలువ నిర్మాణం జరుగుతోంది. వంద మీటర్ల మేర నిర్మాణానికి భూ సేకరణ పూర్తి చేయాల్సి ఉంది. పరిహారం చెల్లింపునకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. మట్టి పనులు పెండింగ్ ఉన్నాయి. జులై నాటికి నీటిని ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్యాకేజీ 13, 14, 15
19 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నిర్మిస్తున్న కర్వెన జలాశయం పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. ఈ జలాశయం కింద 1.51 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు ఉంది. సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేసి నాలుగు టీఎంసీలు నిల్వ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు. సిమెంటు కాంక్రీటు పనులు కూడా పెండింగ్లో ఉన్నాయి.
ప్యాకేజీ 16, 17, 18
కర్వెన జలాశయం నుంచి ఉదండాపూర్నకు నీటిని తరలించేందుకు ఎనిమిది కిలోమీటర్ల పొడవున రెండు సొరంగాలు నిర్మిస్తున్నారు. అయిదు పంపుల పంపుహౌసులో రెండు ఏర్పాటు చేసేందుకు పనులు జరుగుతున్నాయి. 16.3 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఉదండాపూర్ జలాశయానికి సంబంధించి సామాజిక ఆర్థిక సర్వే పూర్తి చేశారు. 1948 ముంపు బాధిత కుటుంబాలకు పునరావాసం, గ్రామాల తరలింపు ప్రక్రియ కొనసాగుతోంది. సెప్టెంబరు నాటికి పనులు పూర్తి చేసి జలాశయంలో నీటిని నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.
* ఉదండాపూర్ జలాశయం నుంచి వికారాబాద్ జిల్లా చేవెళ్ల వరకు ఒక కాలువ తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం రూ.5,680 కోట్లకు ఇటీవల ఆమోదం తెలిపింది. కొత్తగా 9.38 లక్షల ఎకరాల ఆయకట్టును ఈ కాలువ కింద తీసుకురానున్నట్లు తెలిసింది. త్వరలోనే టెండర్లు పిలవనున్నట్లు సమాచారం. కర్వెన, వట్టెం జలాశయాల నుంచి కూడా రెండు కాలువలు తవ్వేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
పెద్ద సంఖ్యలో తరలిరండి.. ఓటర్లకు ప్రధాని మోదీ పిలుపు
-
కిడ్నాప్ చేయించి.. 30 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్
-
పద్మవ్యూహంలో ఉన్నా.. నావైపూ చూడండి
-
నాడు అధికారులు.. నేడు అభ్యర్థులు!
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ