Donkey Milk: ఖరము పాలు.. కురిపించు సిరులు
రెస్టారెంట్, హోటల్, లేడీస్ కార్నర్, రెడీమేడ్ దుస్తుల దుకాణం ఇలా ఏ వ్యాపారం చేసినా.. కలిసి రాని ఓ వ్యక్తి వినూత్న రంగాన్ని ఎంచుకున్నారు. గాడిదల ఫాం ఏర్పాటుచేశారు.
గాడిద పాల ఎగుమతితో ఆదాయం
నాగర్కర్నూల్లో వినూత్న ప్రయత్నం
రెస్టారెంట్, హోటల్, లేడీస్ కార్నర్, రెడీమేడ్ దుస్తుల దుకాణం ఇలా ఏ వ్యాపారం చేసినా.. కలిసి రాని ఓ వ్యక్తి వినూత్న రంగాన్ని ఎంచుకున్నారు. గాడిదల ఫాం ఏర్పాటుచేశారు. వాటి పాలను ఎగుమతి చేస్తూ రూ. లక్షల ఆదాయం కళ్లజూస్తున్నారు. నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం వెల్గొండ గ్రామానికి చెందిన పుల్లిగండ నాగేశ్ ప్రయత్నమిది... తన పెద్ద కుమారుడు అఖిల్కు వచ్చిన ఆలోచనతో గాడిదల పెంపకం చేపట్టానని నాగేశ్ చెబుతున్నారు. గాడిదల పాలకు అంతర్జాతీయంగా మంచి డిమాండ్ ఉందని అఖిల్ అంతర్జాలం ద్వారా తెలుసుకున్నారు. యూరప్ దేశాల్లో కాస్మొటిక్స్, ఫార్మా రంగంలో ఉపయోగిస్తున్నట్లుగా తెలుసుకొని గాడిదల పెంపకం, ధర, మార్కెటింగ్పై తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో పర్యటించి వివరాలు సేకరించారు. కొద్ది రోజులు తమిళనాడులో శిక్షణ కూడా పొందారు. తర్వాత తండ్రి నాగేశ్తో కలిసి ఫాం ఏర్పాటుచేశారు. అందులోనే ప్రస్తుతం 110 గాడిదలను పెంచుతున్నారు.
పెట్టుబడి, ఆదాయం ఇలా..
గాడిదల ఫాం ఏర్పాటు కోసం బిజినేపల్లి శివారులో 16 ఎకరాలను ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున లీజుకు తీసుకున్నారు. ఇందులో ఆరెకరాలను రూ.1.20 కోట్లు ఖర్చుచేసి పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారు. చుట్టూ కంచె, షెడ్లు, సిబ్బంది ఉండేందుకు నివాసాలు ఏర్పాటుచేశారు. గాడిదలు తిరగడానికి రెండు ఎకరాలు కేటాయించారు. మిగిలిన భూమిలో జొన్న రకం గడ్డి, మొర్రగడ్డ తీగ పెంచుతున్నారు. వీటితో పాటు గోధుమ, మొక్కజొన్న దాణా, వేరుశెనగ పొట్టు, ఎండు గడ్డిని ఆహారంగా ఇస్తున్నారు. ఒక్కో గాడిదకు రోజూ 25 కిలోల ఆహారం అందిస్తున్నారు. ప్రస్తుతం 60 గాడిదల నుంచి పాలను సేకరిస్తున్నారు. వాటిని ఫ్రిజ్లో నిల్వ ఉంచుతారు. రెండు నెలలైనా అవి చెడి పోకుండా ఉంటాయి. ఈ పాలను నెలకోసారి తమిళనాడుకు చెందిన కంపెనీ వారు వచ్చి తీసుకెళతారు. మార్కెట్లో ప్రస్తుతం లీటరు ధర రూ.2,500 నుంచి రూ.5వేలు పలుకుతోంది. నెలకు 400 లీటర్ల నుంచి 550 లీటర్ల వరకు సేకరిస్తున్నారు. తద్వారా ప్రతి నెలా రూ.10 లక్షల వరకు ఆదాయం వస్తోంది. ఫాం వద్దనే నిత్యం 8 మంది పనిచేయాల్సి ఉంటుంది. వారికి వేతనాలు, దాణా, మందులు, పర్యవేక్షణకు ప్రతి నెలా రూ.3 లక్షల వరకు ఖర్చు చేస్తున్నారు. ఖర్చులు పోను రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు మిగులుతోందని నాగేశ్ చెబుతున్నారు. గాడిద పాల అమ్మకానికి కంపెనీలతో ఒప్పందం చేసుకున్న తర్వాతనే ఫాం ప్రారంభించాలని నాగేశ్ సూచిస్తున్నారు.
నాలుగు రకాల జాతుల పెంపకం
వివిధ రాష్ట్రాల్లో పరిశీలించిన నాగేశ్, అఖిల్ నాలుగు రకాల జాతుల గాడిదలను ఎంపిక చేశారు. హలారీ, కతియావడి, పోయూట్, దేశవాళి రకాలను ఫాం తీసుకొచ్చారు. రూ.50 వేల నుంచి రూ.70 వేలకు ఒక్కో గాడిదను కొనుగోలు చేశారు. హలారీ రకం రోజుకు అర లీటరు, కతియావడి రకం 750 మిల్లీలీటర్ల నుంచి లీటరు, పోయూట్ రకం లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు పాలనిస్తాయి. దేశవాళీ గాడిద 250 మీ.లీటర్ల పాలు మాత్రమే ఇస్తుంది. అన్ని రకాలు కలిపి నెలకు 500 లీటర్ల వరకు పాలను సేకరించి నిల్వ చేస్తున్నారు. రోజూ ఒక్క పూట మాత్రమే పాలను పితుకుతారు. ఫాం చూసేందుకు వచ్చే వారి తాకిడి దృష్ట్యా రూ.వెయ్యి ప్రవేశ రుసుం వసూలు చేస్తున్నామని నాగేశ్ పేర్కొన్నారు.
న్యూస్టుడే, నాగర్కర్నూల్, బిజినేపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది. -
అనారోగ్య క్లెయిమ్ పరిమితి రూ.లక్షకు పెంపు: ఈపీఎఫ్ఓ
ఉద్యోగులు, కార్మికులు, వారి కుటుంబ సభ్యుల అనారోగ్య చికిత్సల కోసం ఉద్యోగుల భవిష్య నిధి నుంచి తీసుకునే అనారోగ్య అడ్వాన్సు క్లెయిమ్ పరిమితిని రూ.50 వేల నుంచి రూ.లక్షకు ఈపీఎఫ్వో పెంచింది. -
ఉపాధి హామీకి కూలీలను పెంచాలి
రాష్ట్రంలో ఎండలు మండుతుండటంతో జాతీయ ఉపాధి హామీ పథకానికి వచ్చే కూలీల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. ఈ నేపథ్యంలో తక్షణ చర్యలు చేపట్టాలని... కూలీల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం అధికారులకు తాజాగా ఆదేశాలు జారీచేసింది. -
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
రాజ్భవన్లో సీతారామ కల్యాణం
రాజ్భవన్లోని కమ్యూనిటీ హాలులో బుధవారం సీతారామ కల్యాణ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇన్ఛార్జి గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, సతీమణి సుమతి రాధాకృష్ణన్తో కలిసి కల్యాణంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. -
చెరువుల కబ్జాలతో ముప్పే
చెరువులు, కుంటలు కబ్జాలతో కుచించుకు పోతున్నాయని.. వాటిలో నీటినిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని.. జల వనరులను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో ప్రమాదం పొంచి ఉందంటూ న్యాయమూర్తి జస్టిస్ ఇ.వి.వేణుగోపాల్ హైకోర్టుకు లేఖ రాశారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం