రేపట్నుంచి పలు రైళ్ల రద్దు.. మరికొన్ని దారి మళ్లింపు
దక్షిణ మధ్య రైల్వే ఈనెల 21 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది.
మూడో లైను పనులే కారణం: దక్షిణ మధ్య రైల్వే
డోర్నకల్ (మహబూబాబాద్), న్యూస్టుడే: దక్షిణ మధ్య రైల్వే ఈనెల 21 నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని దారి మళ్లించింది. కాజీపేట-కొండపల్లి సెక్షన్లోని చింతలపల్లి, నెక్కొండ రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైను పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. రద్దయిన రైళ్లలో మెమూ రైళ్లతో పాటు కాకతీయ, శాతవాహన సూపర్ఫాస్టు ఎక్స్ప్రెస్ రైళ్లున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఉత్తర్వులు జారీ చేసింది.
రద్దయిన రైళ్లు
* ఈనెల 21 నుంచి జూన్ 7వ తేదీ వరకు కాజీపేట-డోర్నకల్ (07753), డోర్నకల్-కాజీపేట (07754), విజయవాడ-డోర్నకల్ (07755), డోర్నకల్-విజయవాడ (07756) మెమూ రైళ్లు, భద్రాచలం రోడ్-సికింద్రాబాద్(17660), సికింద్రాబాద్-భద్రాచలం రోడ్(17659) కాకతీయ ఎక్స్ప్రెస్, విజయవాడ-సికింద్రాబాద్(12713), సికింద్రాబాద్-విజయవాడ(12714) శాతవాహన సూపర్ఫాస్టు ఎక్స్ప్రెస్.
* ఈనెల 23, 30, జూన్ 6 తేదీలలో కాజీపేట-తిరుపతి (07091), తిరుపతి-కాజీపేట (07092) తిరుపతి స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్..
* ఈనెల 21, 28, జూన్ 4 తేదీలలో మచిలీపట్నం-సికింద్రాబాద్ (07185), సికింద్రాబాద్-మచిలీపట్నం (07186) మచిలీపట్నం స్పెషల్ ఫేర్ ఎక్స్ప్రెస్..
పాక్షికంగా రద్దయినవి
* ఈనెల 20 నుంచి జూన్ 6 వరకు సిర్పూర్ టౌన్-భద్రాచలం రోడ్(17034) సింగరేణి ఎక్స్ప్రెస్.. వరంగల్-భద్రాచలం రోడ్ మధ్య రద్దు.
* ఈనెల 21 నుంచి జూన్ 7 వరకు భద్రాచలం రోడ్-బలార్షా(17033) సింగరేణి ఎక్స్ప్రెస్.. భద్రాచలం రోడ్-వరంగల్ మధ్య రద్దు.
* ఈనెల 20 నుంచి జూన్ 6 వరకు బెళగవి-మణుగూరు(07335) బెళగవి ఎక్స్ప్రెస్ కాజీపేట-మణుగూరు మధ్య రద్దు.
* ఈనెల 21 నుంచి జూన్ 7 వరకు మణుగూరు-బెళగవి(07336) బెళగవి ఎక్స్ప్రెస్ మణుగూరు-కాజీపేట మధ్య రద్దు.
గోల్కొండ రీషెడ్యూల్
* ఈనెల 23, 25, 27, 28, 30, జూన్ 1, 3, 4, 7 తేదీల్లో గుంటూరు-సికింద్రాబాద్ మధ్య నడిచే నంబరు 17201 గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలును రీ-షెడ్యూల్ చేశారు.
నెక్కొండలో ఆగని రైళ్లు
* డోర్నకల్-వరంగల్ మార్గంలోని వరంగల్ జిల్లా నెక్కొండ స్టేషన్లో ఈనెల 21 నుంచి 28 వరకు తిరుపతి-ఆదిలాబాద్ (17405) కృష్ణా ఎక్స్ప్రెస్, 27,28 తేదీలలో ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ప్రెస్, 28న సికింద్రాబాద్-తిరుపతి (12764) పద్మావతి ఎక్స్ప్రెస్, 27,28 తేదీలలో లింగంపల్లి-కాకినాడ పోర్టు(12738) గౌతమి ఎక్స్ప్రెస్.
* 22 నుంచి 28 వరకు గుంటూరు-సికింద్రాబాద్ (17201) గోల్కొండ ఎక్స్ప్రెస్, 27,28 తేదీలలో సికింద్రాబాద్-గుంటూరు (17202) గోల్కొండ ఎక్స్ప్రెస్ ఆగదు.
దారి మళ్లింపు
* ఈనెల 21 నుంచి జూన్ 7 వరకు విశాఖ-ఎల్టీటీ (18519).. గుంటూరు మీదుగా వెళుతుంది.
* ఈనెల 24, 31 తేదీలలో షాలిమార్-సికింద్రాబాద్(22849).. గుంటూరు మీదుగా నడుస్తుంది.
* ఈనెల 21, 28, జూన్ 4 తేదీల్లో యశ్వంత్పూర్-టాటానగర్(18112).. గుంటూరు మీదుగా మళ్లింపు.
* ఈనెల 28, జూన్ 7 తేదీలలో హైదరాబాద్-షాలిమార్(18046) ఈస్టుకోస్టు.. గుంటూరు మీదుగా ప్రయాణిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్