Gold Loan: సులభతరం.. బంగారంపై రుణం
రోజురోజుకూ బంగారం విలువ పెరుగుతుండగా.. దీనిపై రుణాలు తీసుకోవడం కూడా సులభంగా మారుతోంది. గతంలో బంగారం ధరల పెరుగుదలను నెలకోసారి పరిశీలించి నెలవారీ సగటు ధర ఆధారంగా ఒక గ్రాముపై ఎంత రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయించేవి.
ఆంక్షలు సడలిస్తున్న బ్యాంకులు
పెరుగుతున్న తాకట్టు రుణాలు
ఈనాడు - హైదరాబాద్
రోజురోజుకూ బంగారం విలువ పెరుగుతుండగా.. దీనిపై రుణాలు తీసుకోవడం కూడా సులభంగా మారుతోంది. గతంలో బంగారం ధరల పెరుగుదలను నెలకోసారి పరిశీలించి నెలవారీ సగటు ధర ఆధారంగా ఒక గ్రాముపై ఎంత రుణం ఇవ్వాలో బ్యాంకులు నిర్ణయించేవి. కానీ, ఇటీవలి కాలంలో వారానికోసారి సగటు ధరను నిర్ణయించి దాని ఆధారంగా రుణ పరిమితిని పెంచుతున్నాయి. ఉదాహరణకు హైదరాబాద్లో పంజాబ్ నేషనల్ బ్యాంకు శాఖలో ఒక గ్రాము బంగారంపై రూ.4,730 వరకూ రుణాన్ని తక్షణం ఇస్తున్నారు. వ్యవసాయ పనుల పద్దు కింద రుణం రూ.3 లక్షల వరకూ తీసుకుంటే ఎలాంటి ప్రాసెసింగ్ రుసుం కూడా వేయడం లేదు. ఈ రుణాలకు నెలకు వంద రూపాయలపై 71 పైసలు మాత్రమే వడ్డీ తీసుకుంటున్నట్లు పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజర్ సంతోష్రెడ్డి ‘ఈనాడు’కు వివరించారు. హైదరాబాద్లో ఉండేవారైనా బంగారం తాకట్టు పెట్టి వ్యవసాయ పనులకు రుణం కావాలని డిక్లరేషన్ ఇస్తే ప్రాసెసింగ్ రుసుం లేకుండా రూ.3 లక్షలు ఇచ్చేస్తామన్నారు. వ్యవసాయ భూమి పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ సమర్పిస్తే రూ.10 లక్షల వరకూ ఇస్తామని చెప్పారు.
సాధారణంగా బంగారాన్ని కొందరు బ్యాంకు లాకర్లలో భద్రపరుస్తుంటారు. కానీ, అదే బ్యాంకులో తాకట్టు పెట్టి ‘ఓవర్ డ్రాఫ్ట్’(ఓడీ) పద్దు రుణం తీసుకుంటే సులభంగా తిరిగి కట్టే సదుపాయాన్నీ బ్యాంకులు ప్రవేశపెట్టాయి. ఉదాహరణకు ఒక వ్యక్తి 100 గ్రాముల బంగారాన్ని తాకట్టు పెడితే దాని విలువలో 75 శాతం ఓడీ రుణం కింద బ్యాంకు మంజూరుచేసి అతని పొదుపు ఖాతాలో సొమ్ము జమ చేస్తుంది. ఈ సొమ్మునంతా వెంటనే తీసుకుంటేనే మొత్తానికి వడ్డీ వేస్తారు. అలా కాకుండా బ్యాంకు ఖాతాలోనే సొమ్ము ఉంచేసి తనకు ఎంత అవసరమో అంత డబ్బునే తీసుకుంటే దానిపై మాత్రమే వడ్డీ వేసేలా ఓడీ రుణాలు ఇస్తున్నట్లు సంతోష్రెడ్డి వివరించారు. ఓడీ రుణాలపై ఏడాదికి 8 శాతం నుంచి 10 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.
తగ్గుతున్న ప్రైవేటు భాగస్వామ్యం..
దేశంలో ప్రజల వద్ద 27 వేల టన్నుల బంగారం నిల్వలున్నట్లు అంచనా. దీనిలో 6 వేల టన్నుల వరకూ తాకట్టు రుణాల కింద బ్యాంకుల్లో పెడుతున్నారు. గతేడాదికన్నా ఈ ఏడాది 16 శాతం తాకట్టు రుణాలు పెరిగాయని రిజర్వు బ్యాంకు తాజా నివేదికలో వెల్లడించింది. మనదేశంలో బంగారం తాకట్టు పెట్టుకుని ఇచ్చే రుణాల్లో ప్రైవేటు వ్యక్తులు, సంస్థల భాగస్వామ్యం 2010-11లో 76 శాతం ఉంటే 2021-22 నాటికి 65 శాతానికి తగ్గింది. దీన్ని బట్టి తాకట్టు రుణాలు ఇవ్వడంలో బ్యాంకుల భాగస్వామ్యం పెరుగుతున్నట్లు స్పష్టమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!
సాధారణంగా ఓటరు ఒక్కసారే ఓటు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల కమిషన్(ఈసీ) కూడా అదే చెబుతుంది. -
సమస్య ఓ చోట.. సమర్పించేది మరోచోట.. పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం
ధ్రువపత్రాల సమర్పణలో పొరపాట్లతో తిరస్కరణకు గురైన పాస్పోర్టు దరఖాస్తుదారుల్లో గందరగోళం నెలకొంటోంది. పాస్పోర్టు సేవాకేంద్రాల్లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలను రీజనల్ సేవా కేంద్రంలో సమర్పిస్తుండడమే దీనికి కారణం -
50 ఏళ్ల తరువాత.. నవమి రోజున సీతారాముల కల్యాణం
దేశంలోని ప్రధాన రామాలయాల్లో ఏటా శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు (శ్రీరామ నవమి) శుభ ఘడియల్లో సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. -
సీతమ్మను మనువాడె భద్రాద్రి రామయ్య
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వార్షిక కల్యాణోత్సవం అశేష భక్తజనుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం వైభవోపేతంగా సాగింది. -
చెలమల నీళ్లే గొంతు తడుపుతున్నాయ్
రాష్ట్రంలోని ఏజెన్సీ గ్రామాలు, ఆవాసాల్లో తాగునీటి కటకట నెలకొంది. తాగునీటి సరఫరా ప్రాజెక్టుల నిర్మాణం, నిర్వహణలో లోపాలు, ప్రణాళిక లేమితో గిరిజనులకు రక్షిత జలం అందక.. కాలువలు, చెలమల్లోని నీళ్లే దిక్కయ్యాయి. -
సొమ్ము వెనక్కి వచ్చేది ఎప్పుడో?
ఏదన్నా కారణంతో ధరణి సేవలను రద్దు చేసుకున్న వారు అప్పటికే ప్రభుత్వానికి చెల్లించిన రుసుం తిరిగి పొందడానికి అష్ట కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది. -
బంగారం బిస్కెట్లుగా ఆలయాల ఆభరణాలు
రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాల్లో దేవతామూర్తుల అలం -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో 21న పెయింటింగ్ వర్క్షాప్
ఔత్సాహిక చిత్రకారుల కోసం వేసవి సెలవుల్లో ఒక ప్రత్యేక వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
అమరావతిపై ఇంత కక్షా!
అమరావతిపై వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యానికి, కక్ష సాధింపునకు పరాకాష్ఠ ఇది. రాజధానికి శంకుస్థాపన జరిగిన ప్రాంతంలో అమరావతి నమూనాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. -
గురుకుల విద్యార్థి ప్రశాంత్ మరణానికి బాధ్యులపై తగిన చర్యలు
భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థి ప్రశాంత్ మరణం బాధాకరమని ఆ శాఖ కార్యదర్శి సీతాలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
పదేళ్ల తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం ఎన్నికలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీడీఏ)ఎన్నికలకు హైకోర్టు అనుమతించిన నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం కోర్ కమిటీ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
విద్యుదుత్పత్తి చేసి.. బయట అమ్ముకోవచ్చు!
దేశంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో గ్యాస్ ఆధారిత విద్యుదుత్పత్తి కేంద్రాలకు కేంద్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. -
శ్రీవారి ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో శ్రీరామనవమి ఆస్థానాన్ని పురస్కరించుకుని శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంతులవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనాన్ని బుధవారం వైభవంగా నిర్వహించారు. -
సాగర్లో అత్యవసర మోటార్ల ట్రయల్ రన్ ప్రారంభం
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా తాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ (జలమండలి) ఆధ్వర్యాన ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన (ట్రయల్ రన్) బుధవారం ప్రారంభమైంది. -
నదుల అనుసంధానంపై దిల్లీలో టాస్క్ఫోర్స్ సమావేశం రేపు
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నదుల అనుసంధాన ప్రాజెక్టులో భాగంగా గోదావరి-కావేరి లింక్పై శుక్రవారం నదుల అనుసంధాన టాస్క్ఫోర్స్ కమిటీ చర్చించనుంది. -
సమస్య గుర్తించక ముందే మరమ్మతులెలా నిర్ణయిస్తారు..?
మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతు పనులను గుత్తేదారులకు అప్పగించేందుకు నీటిపారుదలశాఖ నిర్ణయించినట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్లు తెలిసింది. -
సివిల్స్ విజేతలకు కేటీఆర్ శుభాకాంక్షలు
సివిల్స్లో విజయం సాధించిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులంతా పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించి.. దేశ భవిష్యత్ నిర్మాణంలో ప్రధానపాత్ర పోషిస్తారని ఆశిస్తున్నట్లు భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. -
సివిల్స్లో సత్తా చాటిన తెలుగువారికి చంద్రబాబు అభినందనలు
సివిల్స్కు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంపికైన అభ్యర్థులకు తెదేపా అధినేత చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రైవేటు బడుల ఫీ‘జులుం’!
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో రుసుములు ఆకాశాన్నంటుతున్నాయి. ప్లేస్కూల్, ఎల్కేజీ, యూకేజీ, మొదటి తరగతి నుంచి పదో తరగతి వరకు.. డొనేషన్లు, అభివృద్ధి ఛార్జీలు, రుసుములతో పాటు పుస్తకాలు, దుస్తులు, బూట్లు, బెల్టుల పేరిట తల్లిదండ్రుల జేబులకు భారీగా చిల్లులు పెడుతున్నాయి. -
రోజుకు రూ.కోటి ఆదాయం పెరగాలి!
ప్రయాణికుల నుంచి మరింత ఆదాయం రాబట్టుకునేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) సిద్ధమవుతోంది. ఇందుకోసం డీలక్స్, సూపర్లగ్జరీ, ఏసీ బస్సుల సేవలపై దృష్టిపెట్టబోతోంది. -
ద.మ రైల్వేకు రూ.20,339 కోట్ల రికార్డు ఆదాయం
దక్షిణ మధ్య రైల్వే రికార్డు స్థాయిలో ఆదాయాన్ని గడించింది. తొలిసారి రూ.20 వేల కోట్ల మైలురాయిని దాటింది.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పుకొనే పనుల్లేక.. ‘కప్పు’డు ప్రచారం!
-
యూట్యూబర్ దుస్సాహసం.. రన్వేపై వీడియో చిత్రీకరించి యూట్యూబ్లో అప్లోడ్
-
ఎమ్మెల్యేకు వాలంటీరు సత్కారం... ఎన్నికల అధికారులకు తెదేపా ఫిర్యాదు
-
విశాఖ ఎంపీ, గాజువాక శాసనసభ స్థానానికి పోటీ: పాల్
-
ఐరాసలో భారత్కు వీటో అధికారం.. మస్క్ ప్రతిపాదనపై అమెరికా స్పందనిదే..
-
రెండు రాష్ట్రాలు.. రెండు ఓట్లు!