ప్రపంచ పర్యాటక గమ్యంగా భారత్
ప్రపంచంలో కొవిడ్ నుంచి వేగంగా కోలుకుని మెరుగైన స్థితికి చేరింది భారతదేశ పర్యాటకమేనని.. ప్రపంచ పర్యాటకానికి భారత్ను గమ్యస్థానంగా మారుస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు.
వంద శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి
త్వరలో కొత్త టూరిజం పాలసీ
రామప్పకు వచ్చే పర్యాటకుల కోసం హెలీ ట్యాక్సీ
‘ఈనాడు’ ముఖాముఖిలో కేంద్ర పర్యాటక మంత్రి కిషన్రెడ్డి
ఈనాడు - హైదరాబాద్
ప్రపంచంలో కొవిడ్ నుంచి వేగంగా కోలుకుని మెరుగైన స్థితికి చేరింది భారతదేశ పర్యాటకమేనని.. ప్రపంచ పర్యాటకానికి భారత్ను గమ్యస్థానంగా మారుస్తామని కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తెలిపారు. నూతన పర్యాటక విధాన ముసాయిదా సిద్ధమై ప్రధాని కార్యాలయానికి చేరిందని.. త్వరలోనే కొత్త దశ, దిశను అందిస్తామన్నారు. తెలుగు రాష్ట్రాల్ని కలిపే కృష్ణా నదిపై సోమశిల వద్ద నిర్మించనున్న భారీ కేబుల్ బ్రిడ్జి శంకుస్థాపనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రి నితిన్గడ్కరీలలో ఒకరు వస్తారని చెప్పారు. శ్రీనగర్లో సోమవారం నుంచి ప్రారంభం కానున్న జీ-20 పర్యాటక సదస్సు నేపథ్యంలో కిషన్రెడ్డి ‘ఈనాడు’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
కొవిడ్లో తీవ్రంగా దెబ్బతిన్న పర్యాటకం ఇప్పుడెలా ఉంది..?
కొవిడ్ వల్ల బాగా ప్రభావితమైనవి పర్యాటక, ఆతిథ్య రంగాలే. ఇప్పుడిప్పుడే ఇవి మళ్లీ ఊపందుకుంటున్నాయి. ఉదాహరణకు 2022లో కశ్మీర్లో 1.84 కోట్ల మంది పర్యటించారు. 2022 మార్చిలో శ్రీనగర్ ఎయిర్పోర్టులో రోజుకు 90 విమానాలు రాకపోకలు సాగించాయి. లేహ్లో 2020 జనవరిలో వారానికి 74 విమానాలు రాకపోకలు సాగించగా.. 2022 అక్టోబరులో ఆ సంఖ్య 160కి చేరింది. ఇతర ప్రాంతాల్లోనూ వృద్ధి కనిపిస్తోంది. సమగ్ర, సుస్థిర పర్యాటకం కోసం కొత్త విధానాన్ని తీసుకొస్తున్నాం. 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతివ్వడం, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, ప్రకృతి పర్యాటకానికి డిమాండ్ నేపథ్యంలో ప్రత్యేక ఏర్పాట్లు, పోచంపల్లి వంటి గ్రామీణ పర్యాటక ప్రాంతాలకు ప్రోత్సాహం వంటి అంశాలపై దృష్టి సారించాం.
కశ్మీర్లో జీ20 పర్యాటక సదస్సు పెట్టడంలో ప్రత్యేకత..?
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో నిర్వహించే జి-20 సదస్సులకు దాదాపు లక్షమంది విదేశీ ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ సదస్సులు విదేశీ పర్యాటకుల రాక పెరిగేందుకు దోహదం చేస్తాయి. 34 సంవత్సరాల తర్వాత కశ్మీర్లో అంతర్జాతీయ సదస్సును నా అధ్యక్షతన నిర్వహించబోతున్నాం. అక్కడి పరిస్థితుల వల్ల కొన్నాళ్లు కుంటుపడిన పర్యాటకం మళ్లీ పుంజుకుంటోంది. ఆర్ఆర్ఆర్ సినిమా హీరో రాంచరణ్ మంగళవారం శ్రీనగర్ సదస్సులో పాల్గొంటున్నారు. సదస్సుకు రావద్దని చైనా, పాకిస్థాన్లు జీ 20 దేశాలకు లేఖలు రాసి ఒత్తిడి చేశాయి. అలా చెప్పడానికి వాటికి ఎలాంటి హక్కు లేదు. ఈ సదస్సుకు 29 దేశాల నుంచి విచ్చేస్తున్న 100 మంది విదేశీ ప్రతినిధుల్లో భద్రతపరంగా విశ్వాసం కల్పించాం.
ఎక్కువ మందికి ఉపాధినిచ్చే పర్యాటకానికి కేంద్రం ఎలాంటి సహకారమిస్తోంది?
ఆతిథ్యరంగ అనుబంధ విభాగాలకు ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీం పరిమితిని రూ. 4.50 లక్షల కోట్ల నుంచి రూ.5 లక్షల కోట్లకు పెంచడంతో దీనిపై ఆధారపడిన వారందరికీ లబ్ధి చేకూరింది. పర్యాటకాభివృద్ధికి రూ. లక్షల కోట్లు కావాలి. ఇందుకోసం ప్రైవేటు పెట్టుబడులు రావాలి. దేశ చరిత్రలో తొలిసారిగా ‘గ్లోబల్ టూరిజం ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్’ త్వరలో దిల్లీలో నిర్వహిస్తాం. సింగపూర్లో వాటర్ టూరిజం కంపెనీ, యూనివర్సల్ స్టూడియో వంటి వారిని పెట్టుబడులకు పిలుస్తున్నాం. టాటా వంటి కంపెనీలతో కొత్త ప్రాంతాల్లో హోటళ్లకు ప్రణాళికలు రచిస్తున్నాం.
తెలుగు రాష్ట్రాల్లో పర్యాటకాభివృద్ధికి ప్రణాళికలేమిటి..?
రామప్పకు యునెస్కో గుర్తింపులో కేంద్రం పాత్ర కీలకం. ఏపీలో లేపాక్షిని గత ఏడాది యునెస్కోకు పంపించాం. రవీంద్రనాథ్ ఠాగూర్ నెలకొల్పిన శాంతినికేతన్కు ఈ ఏడాది యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్నాం. రామప్ప ఆలయ అభివృద్ధికి కేంద్రం రూ.67 కోట్లు ఇస్తోంది. అలంపూర్ జోగులాంబ శక్తిపీఠంలో సౌకర్యాలకు రూ.37 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులు సెప్టెంబరులో పూర్తవుతాయి. భద్రాచలంలో రూ.42 కోట్లతో పనులు చేపట్టాం. ఏపీలో రెండు కోస్తా సర్క్యూట్లకు రూ.117.39 కోట్లు, బుద్ధిస్ట్ సర్క్యూట్కు రూ.24.14 కోట్లు ఇచ్చాం. ఏపీలో గండికోట, లంబసింగి, అరకు ప్రాంతాల్లో రూ.100 కోట్ల చొప్పున పర్యాటకాభివృద్ధికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. తెలంగాణలో భువనగిరి కోట, అనంతగిరిలో రూ.100 కోట్ల చొప్పున ఖర్చు చేస్తాం. రామప్పకు వచ్చే విదేశీ పర్యాటకుల కోసం హైదరాబాద్ నుంచి హెలీ ట్యాక్సీ ప్రవేశపెట్టే ఆలోచన ఉంది. తెలంగాణ ప్రభుత్వం సహకరిస్తే రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధికి ఎంతమేరకైనా సహకరించడానికి కేంద్రం సిద్ధం.
దూరప్రాంత పర్యాటకానికి రైళ్లలో రిజర్వేషన్లు దొరకట్లేదు.. విమానాల్లో భారీ ఛార్జీలుంటున్నాయి..?
అప్పటికప్పుడు వెళ్లే పర్యాటకులకు రిజర్వేషన్లో ప్రత్యేక కోటాపై రైల్వే మంత్రితో మాట్లాడతా. ప్రజావసరాల కోసం కేంద్రం పెద్దసంఖ్యలో విమానాశ్రయాలు నిర్మిస్తోంది. అవి 2014కి ముందు 70 ఉంటే మోదీ ప్రధాని అయ్యాక 147కి పెరిగాయి. 2025 నాటికి కొత్తగా మరో 78 వస్తాయి. ఉడాన్ పథకంలో 51 కొత్త టూరిజం రూట్లను వినియోగంలోకి తెచ్చాం. ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే, విమాన నెట్వర్క్ని అభివృద్ధి చేస్తున్నాం. భారత్ గౌరవ్ రైళ్లు.. రామాయణ్, బుద్ధ, అంబేడ్కర్ సర్క్యూట్లతో రవాణా సౌకర్యం కల్పిస్తున్నాం. కొండ ప్రాంతాల్లో సొరంగమార్గాలు నిర్మిస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
భారాస అధినేత కేసీఆర్ కాన్వాయ్లో ప్రమాదం
-
మూడోసారి అంతరిక్షంలోకి.. సిద్ధమవుతోన్న సునీతా విలియమ్స్
-
Sunetra Pawar: ఎన్నికల వేళ.. రూ.25 వేల కోట్ల స్కామ్ కేసులో సునేత్ర పవార్కు క్లీన్ చిట్