Marriages: ఒక పెళ్లి.. వంద అబద్ధాలు
‘పెళ్లి చేయాలంటే కాళ్లరిగేలా తిరగాలి’ అనేది ఒకనాటి నానుడి. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఆన్లైన్లో వివరాలు చూసి చూసి కళ్లు తిరిగినంత పనవుతోంది.
వధూవరుల ప్రొఫైల్స్లో తప్పుడు సమాచారం
మ్యారేజ్బ్యూరోల మోసాలూ బోలెడు..
తల్లిదండ్రులు తనిఖీ చేసుకోకపోతే దారుణ నష్టాలు
ఈనాడు, హైదరాబాద్ : ‘పెళ్లి చేయాలంటే కాళ్లరిగేలా తిరగాలి’ అనేది ఒకనాటి నానుడి. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఆన్లైన్లో వివరాలు చూసి చూసి కళ్లు తిరిగినంత పనవుతోంది. విచ్చలవిడిగా పుట్టుకొస్తున్న కొన్ని మ్యారేజ్బ్యూరోల అవకతవకలు, తల్లితండ్రులు అత్యాశతో పొందుపరిచే తప్పుడు వివరాలే దీనికి కారణం. ఈ బ్యూరోలపై ప్రభుత్వపరమైన నియంత్రణ కూడా లేదు. వాటి సంపాదనపై చెల్లించాల్సిన 18 శాతం జీఎస్టీని కూడా నిర్వాహకులు ఎగవేస్తున్నారని వాణిజ్య పన్నులశాఖ వర్గాలు తెలిపాయి. బ్యూరోల్లో ఇచ్చే వధూవరుల వివరాల్లో చాలా వరకు తప్పుడు సమాచారం ఉంటోంది. ఒక బ్యూరోలో ఇచ్చిన వివరాలు మరికొందరికి వ్యాప్తి చెందుతూ గందరగోళానికి, మోసాలకు కారణమవుతున్నాయని బాధితులు వాపోతున్నారు. ఐఐటీలో చదివారు, నెలకు రూ.లక్షల వేతనం, అమెరికాలో ఉద్యోగం, హైదరాబాద్లో లగ్జరీ ఫ్లాట్.. తదితర ఆకర్షణీయ వివరాలు చూసి మోసపోవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ఒకటికి పదిసార్లు బాగా విచారణ చేసుకున్నాకే తల్లిదండ్రులు బిడ్డ పెళ్లిపై నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
కంపెనీ మూతపడింది.. ఉద్యోగం పోయింది..
ఇటీవల విజయవాడలో ఉన్న ఒక కుటుంబం తమ కుమారుడు హైదరాబాద్ హైటెక్సిటీలోని పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాడని మ్యారేజ్బ్యూరోలో వివరాలిచ్చింది. అది చూసి వరంగల్కు చెందిన అమ్మాయి తండ్రి ఆకర్షితులయ్యారు. పెళ్లి చూపులు పూర్తిచేసి.. నిశ్చితార్థం తేదీని కూడా నిర్ణయించుకున్నారు. మరోవైపు.. మాదాపూర్ వెళ్లి ఆ అబ్బాయి పనిచేసే కంపెనీ గురించి ఆరా తీయమని హైదరాబాద్లో తన మిత్రుడికి పురమాయించారు. తీరా ఆ మిత్రుడు వెదికితే చిన్న అపార్టుమెంటులో ఉన్న ఆ కంపెనీని ఆ రోజే మూసివేస్తున్నట్లు తెలిసింది. అక్కడే కనిపించిన పెళ్లికొడుకును పలకరిస్తే ఈ కంపెనీ మూతపడిందని, మరో ఉద్యోగం వెదుక్కోవాలని చెప్పాడు. దీంతో అమ్మాయి తండ్రి ఖిన్నుడై సంబంధాన్ని రద్దు చేసుకున్నారు.
పేరు అదే.. నక్షత్రం, పుట్టినతేదీ మార్చేశారు..
హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్న అమ్మాయికి పెళ్లి సంబంధం కోసం తండ్రి మ్యారేజ్బ్యూరోలో రూ.10 వేలు చెల్లించి రాజమహేంద్రవరానికి చెందిన అబ్బాయి ప్రొఫైల్ తీసుకున్నారు. అతను ఒక సాధారణ కాలేజీలో బీటెక్ చదివాడు. పుట్టినతేదీ, నక్షత్రం నప్పలేదని పురోహితులు చెప్పడంతో అమ్మాయి తండ్రి వదిలేశారు. కొంతకాలం తరువాత మరో మ్యారేజ్బ్యూరోలో రూ.10 వేలు చెల్లిస్తే కొందరు వరుల వివరాలిచ్చారు. అక్కడ తాము తిరస్కరించిన అబ్బాయి వివరాలు చూసి అమ్మాయి తండ్రి షాక్ తిన్నారు. అదే అబ్బాయి జాతీయస్థాయి ప్రముఖ ఐఐటీలో బీటెక్ చదివినట్లు, పుట్టినతేదీ, నక్షత్రం వివరాలు మారిపోయి కనిపించాయి. మ్యారేజ్బ్యూరో మారేసరికి విద్యార్హతలు, జాతకాలు ఎలా మారిపోయాయని ఆయన నివ్వెరపోయారు.
ఎస్సైనే బురిడీ కొట్టించి సొమ్ము వసూలు...
ఆయన ఒక ఎస్సై. తన కుమారుడికి పెళ్లి సంబంధాలు వెతుకుతూ హైదరాబాద్లోని ఒక మ్యారేజ్బ్యూరోలో వివరాలిచ్చారు. నాలుగు రోజుల తరువాత తిరుపతిలోని మ్యారేజ్ బ్యూరో నుంచి ఫోన్ వచ్చింది. ఒక అమ్మాయి మాట్లాడుతూ.. మీ అబ్బాయికి సరిపడే ప్రొఫైల్స్ పంపుతామని చెప్పింది. నెలకు రూ.లక్ష వేతనం పొందుతున్న అమ్మాయి ఉందని, ఆమె తండ్రితో మాట్లాడమని కాన్ఫరెన్స్ కాల్ కలిపింది. అనంతరం ఎస్సై.. వధువు తండ్రి ఫోన్ నంబరు, చిరునామా అడిగారు. అందుకోసం రూ.15 వేలు ఇవ్వాలని బ్యూరో కోరడంతో ఆయన వెంటనే ఆన్లైన్ ద్వారా చెల్లించారు. తరువాత ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని ఎస్సైకి అర్థమైంది.
ఇదీ ధోరణి..
* మంచి అందం, అధిక వేతనం వచ్చే సాఫ్ట్వేర్ ఉద్యోగం, సొంత ఇల్లు, కొద్దో గొప్పో ఆస్తి ఉన్న అబ్బాయిలకే డిమాండ్ ఉంది. దీంతో కొందరు వరుల తల్లిదండ్రులు బోగస్ సమాచారం పొందుపరిచి.. ఏదోలా పెళ్లి అయితే చాలని ప్రయత్నిస్తున్నారు. వధూవరులకు సంబంధించి తప్పుడు వివరాలిస్తే.. నిజానిజాలు తమకు తెలిసే అవకాశం లేదని.. వారే స్వయంగా విచారణ చేసుకుని సంబంధం కుదుర్చుకోవాల్సి ఉంటుందని ఒక బ్యూరో ప్రతినిధి చెప్పారు.
* అమెరికా సంబంధాలు మరీ దారుణంగా ఉంటున్నాయని హైదరాబాద్లోని మ్యారేజ్బ్యూరోకి చెందిన సీనియర్ ప్రతినిధి ఒకరు ఉదాహరణలతో చెప్పారు. అమెరికాలో ఉండే కొందరు అబ్బాయిలు అక్కడ పెళ్లి చేసుకోవడం లేదా మరో యువతితో సహజీవనం చేస్తున్నారు. ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి.. తల్లిదండ్రుల ఒత్తిడితో ఇక్కడికి వచ్చి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నారు. భర్త వెంట ఎన్నో కలలతో అమెరికా వెళ్లిన కొత్త పెళ్లికూతురికి కొద్దిరోజులకే ఈ విషయం అర్థమై దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోందని ఆయన చెప్పారు.
* మెడిసిన్, ఎంటెక్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యావంతులకు అదేస్థాయి అమ్మాయి లేదా అబ్బాయి తేలిగ్గా దొరకడం లేదు. వీరిని ఆకట్టుకోవాలని కొన్ని బ్యూరోల వారు బోగస్ ప్రొఫైల్స్ ఇస్తున్నారు.
* అమ్మాయికిచ్చే కట్నం లేదా అబ్బాయికున్న ఆస్తి విలువలో 2 నుంచి 3 శాతం కనీసం ఒక శాతమైనా కమీషన్ ఇవ్వాలని పలు మ్యారేజ్బ్యూరోలు నిబంధనలు పెడుతున్నాయి. ఈ సొమ్ము ఇవ్వకపోతే పెళ్లి తరువాత కూడా గొడవలకు దిగుతున్నాయి.
ఆన్లైన్ వేదికలతో కొంత ఊరట
ఇటీవలి కాలంలో వివిధ సామాజికవర్గాల వారు ఫేస్బుక్, వాట్సప్లలో తమ బంధువులు, మిత్రులతో ‘మ్యారేజ్గ్రూప్’ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇందులో తల్లిదండ్రులు తమ ఫోన్ నంబరు, పిల్లల వివరాలు పోస్టు చేస్తే ఆసక్తి ఉన్న ఇతరులు వారిని నేరుగా సంప్రదిస్తున్నారు. దీనివల్ల మ్యారేజ్బ్యూరోల బెడద కొంత తప్పిందని ఒక గ్రూప్ అడ్మిన్ ‘ఈనాడు’కు చెప్పారు.
* ఇలా వాట్సప్ గ్రూప్లు, ఆన్లైన్ పోర్టళ్లలో ఉన్న వధూవరుల ప్రొఫెల్స్, ఫోన్ నంబర్లు తస్కరించి.. వాటిని ఇతరులకు చూపి రుసుం వసూలు చేసే మ్యారేజ్ బ్యూరోలు కూడా లేకపోలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్లో మే 1 నుంచి కొత్త సర్వీస్ ఛార్జీలు!
-
విజయ్ మాల్యా అప్పుడు అలా అనడంతోనే..: కుంబ్లే
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు