కరెంటుతో కాసుల పంట
సింగరేణి సంస్థ ప్రధాన వ్యాపారం గనుల నుంచి బొగ్గు తవ్వి థర్మల్ విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అమ్ముకోవడం.
1,200 మె.వా. ప్లాంట్లతో సింగరేణికి లాభాలు
800 మె.వా. సామర్థ్యంతో కొత్త విద్యుత్కేంద్రం
రూ.6,500 కోట్ల వ్యయం.. ‘భెల్’కు టెండరు ఖరారు
విద్యుత్ కొనుగోలుకు డిస్కంల అంగీకారం
మరో 800 మె.వా. ప్లాంటు నిర్మాణానికీ కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: సింగరేణి సంస్థ ప్రధాన వ్యాపారం గనుల నుంచి బొగ్గు తవ్వి థర్మల్ విద్యుత్కేంద్రాలు, ఇతర పరిశ్రమలకు అమ్ముకోవడం. దీని కంటే విద్యుదుత్పత్తి ద్వారా అధిక లాభాలు వస్తుండడంతో సంస్థ ఆ దిశగా దృష్టి సారిస్తోంది. సొంత బొగ్గు అందుబాటులో ఉండడంతో ప్రయోగాత్మకంగా తొలుత మంచిర్యాల జిల్లా జైపూర్లో ఒక్కోటి 600 మెగావాట్ల చొప్పున రెండు (మొత్తం 1200 మె.వా.) విద్యుత్కేంద్రాలను నిర్మించింది. రాష్ట్రంలో రోజువారీ విద్యుత్ గరిష్ఠ డిమాండు 15,485 మెగావాట్లకు చేరడంతో ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో కరెంటు కొంటోంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి విద్యుత్కేంద్రాల్లో 90 శాతానికి పైగా కరెంటు ఉత్పత్తి చేస్తూ రాష్ట్రానికి సరఫరా చేస్తోంది. దీనిపై ఏటా రూ.500 కోట్లకు పైగా లాభాలొస్తున్నాయని సంస్థ వర్గాలు తెలిపాయి. ఉదాహరణకు 2022-23లో బొగ్గు వ్యాపార టర్నోవర్ రూ.28,459 కోట్లుంటే సుమారు రూ.500 కోట్ల లాభాలొస్తాయని అంచనా వేయగా, అదే సమయంలో రూ.4,371 కోట్ల విలువైన విద్యుత్తు విక్రయంపై రూ.500 కోట్లు మిగలనున్నాయి. దీంతో విద్యుత్తు వ్యాపారం మరింత లాభదాయకమని సింగరేణి అటువైపు మొగ్గు చూపిస్తోంది. జైపూర్లో కొత్తగా తలపెట్టిన 800 మె.వా. విద్యుదుత్పత్తి ప్లాంటు నిర్మాణ టెండరు రూ.6,500 కోట్లతో కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘భెల్’కు ఖరారైంది. ఈ విద్యుత్తు కొనుగోలుకు డిస్కంల నుంచి సూత్రప్రాయ ఆమోదం సైతం లభించింది. ఇక్కడే మరో 800 మె.వా. ప్లాంటు ఏర్పాటుకు కూడా సింగరేణి కసరత్తులు ప్రారంభించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపితే భూమి ఇప్పటికే అందుబాటులో ఉన్నందున మొత్తం 1,600 మె.వా. ప్లాంట్లను నాలుగైదేళ్లలోగా పూర్తిచేయాలనేది సంస్థ ప్రణాళిక. సౌరవిద్యుత్ ప్లాంట్లను సైతం 550 మెగావాట్లతో నెలకొల్పుతున్నందున రానున్న అయిదేళ్లలో మొత్తం సింగరేణి విద్యుదుత్పత్తి సామర్థ్యం 3,350 మెగావాట్లకు చేరనుంది.
రివర్స్ బిడ్డింగ్లో ముందుకొచ్చిన ‘భెల్’
జైపూర్లో 800 మె.వా. కొత్త విద్యుత్కేంద్రం నిర్మాణ కాంట్రాక్టు ‘భెల్’కు దక్కనుంది. తొలి టెండర్లో ‘భెల్’ కన్నా తక్కువ ధర కోట్ చేసి ఎల్ అండ్ టీ కంపెనీ అర్హత పొందినా రివర్స్ బిడ్డింగ్లో భెల్ మళ్లీ ముందుకొచ్చింది. త్వరలో భెల్కు కాంట్రాక్టును అప్పగించి ఒప్పందం చేసుకునేందుకు సింగరేణి కసరత్తు చేస్తోంది. జైపూర్లో 1,200 మె.వా. ప్లాంట్ల నిర్మాణ సమయంలో రెండు వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి అప్పగించింది. ఈ భూమిలో ఇంకా 600 ఎకరాలు ఖాళీగా ఉంది. 800 మె.వా. విద్యుత్కేంద్రాలకు 200 ఎకరాల చొప్పున భూమి సరిపోతుందని తేల్చారు. దీంతో జైపూర్లోనే కొత్త ప్లాంట్లను నిర్మించాలన్నది ప్రణాళిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పతి దేవుడికి గుడి కట్టింది!
కరోనా మహమ్మారి ఆమె జీవితంలో అంతులేని విషాదాన్ని నింపింది. కళ్లల్లో పెట్టుకుని చూసుకునే భర్తను తన నుంచి దూరం చేసింది. మూడేళ్ల క్రితం భర్త కొవిడ్తో మృతి చెందడంతో ఆమె ఒంటరిగా మారారు. -
కొత్తవారొచ్చారు
ఆంధ్రప్రదేశ్ నిఘా విభాగాధిపతిగా సీనియర్ ఐపీఎస్ అధికారి కుమార్ విశ్వజిత్ను, విజయవాడ నగర పోలీసు కమిషనర్గా పీహెచ్డీ రామకృష్ణను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది. -
జేఈఈ మెయిన్స్లో తెలుగోళ్ల సత్తా
జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా 56 మందికి 100 పర్సంటైల్ రాగా.. ఇందులో ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారే 22 మంది ఉన్నారు. జేఈఈ మెయిన్స్ తుది ఫలితాలను జాతీయ పరీక్షల విభాగం (ఎన్టీఏ) బుధవారం అర్ధరాత్రి విడుదల చేసింది. -
కాళేశ్వరంపై కమిషన్ విచారణ షురూ
కాళేశ్వరం ఎత్తిపోతల్లోని బ్యారేజీలపై న్యాయ విచారణకు ఏర్పాటు చేసిన కమిషన్ కార్యాచరణ మొదలుపెట్టింది. బుధవారం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ఆయన సతీమణి దేబ్జానీ ఘోష్తో కలిసి హైదరాబాద్కు చేరుకున్నారు. -
ఫస్టియర్లో 60.01%.. సెకండియర్లో 64.19%
ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 60.01 శాతం, రెండో సంవత్సరంలో 64.19 శాతం మంది విద్యార్థులు (ఒకేషనల్ కోర్సులతో కలిపి) ఉత్తీర్ణత సాధించారు. -
కవిత బెయిల్పై మే 6న తీర్పు
ఈడీ కేసులో బెయిల్ కోసం భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్పై తీర్పును ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 6కి వాయిదా వేసింది. -
చదువుల ‘సిరి’.. రెండు కిడ్నీలు పాడైనా మొక్కవోని పట్టుదల
వారానికి రెండుసార్లు డయాలసిస్.. ఒంట్లో సత్తువ లేక కళాశాలకూ వెళ్లలేని పరిస్థితి.. అయినా మొక్కవోని పట్టుదలతో చదివిన పేదింటి బిడ్డ ప్రతిభ చాటింది. -
విజన్-2026కు డోర్నకల్ ఉపాధ్యాయుల శ్రీకారం
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు విజన్-2026 పేరిట ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. -
ఇంటర్ ఫలితాల్లో కవలల ప్రతిభ
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్(ఎస్) మండల కేంద్రానికి చెందిన డేగల వీరభద్రయ్య, మంజుల దంపతుల కవల పిల్లలు డేగల రామ్, లక్ష్మణ్ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రతిభ చూపారు. -
రాష్ట్రంలో వంతెనల పరిశీలన..!
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న చిన్నా, పెద్ద వంతెనలను పరిశీలించేందుకు అధికారులు ఆయత్తం అవుతున్నారు. జిల్లాల వారీగా నిర్మాణ స్థితిగతులపై జాబితాలను రూపొందించే పనిలో ఉన్నారు. -
యాదాద్రి విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి
యాదాద్రి థర్మల్ విద్యుత్కేంద్రానికి పర్యావరణ అనుమతి (ఈసీ) ఇవ్వడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఆమోదం తెలిపింది. -
మెట్రో రైలు శబ్దకాలుష్యంపై వివరణివ్వండి
మెట్రో రైల్వే లైను వంపుల్లో రైలు వెళ్లినపుడు పరిమితికి మించి వస్తున్న శబ్దకాలుష్యంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, మెట్రో రైల్వే ఎండీకి బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఆర్జేసీ, మోడల్, కేజీబీవీ విద్యార్థుల ప్రతిభ
టీఎస్ఆర్జేసీ నేరెళ్ల గురుకుల విద్యార్థిని ఎంపీసీలో 991 మార్కులు, బైపీసీలో తాటిపల్లి విద్యార్థిని 990 మార్కులు సాధించినట్లు యాజమాన్యం తెలిపింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసు.. రాధాకిషన్రావుకు మధ్యంతర బెయిలు నిరాకరణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్టయిన టాస్క్ఫోర్స్ మాజీ ఓఎస్డీ రాధాకిషన్రావుకు ఎల్ఎల్ఎం పరీక్షలు రాసేందుకు వీలుగా మధ్యంతర బెయిలు ఇచ్చేందుకు నాంపల్లి కోర్టు నిరాకరించింది. -
పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు
లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజును వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
జస్టిస్ రామలింగేశ్వరరావుకు హైకోర్టు ఘన నివాళి
గుండెపోటుతో ఇటీవల మృతి చెందిన ఉమ్మడి హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వరరావుకు బుధవారం హైకోర్టు ఘన నివాళి అర్పించింది. -
శనగ విత్తనోత్పత్తి రైతుల ఆందోళన
‘పంట విక్రయించి నెల రోజులవుతోంది. డబ్బులు ఎప్పుడు ఇస్తారో.. క్వింటాకు ఎంత కట్టిస్తారో ఇప్పటికీ తెలియదు. -
విచారణ నుంచి తప్పుకొన్న జస్టిస్ శేషసాయి ధర్మాసనం
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై మాట్లాడొద్దంటూ కడప జిల్లా కోర్టు(పీడీజే) ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత, పులివెందుల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎం.రవీంద్రనాథ్రెడ్డి అలియాస్ బీటెక్ రవి దాఖలు చేసిన వ్యాజ్యాల విచారణ నుంచి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి నేతృత్వంలోని ధర్మాసనం తప్పుకొంది. -
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇంటర్ ప్రవేశాలు
రాష్ట్రంలోని ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పేరిట డొనేషన్లు, అధిక రుసుముల వసూళ్లు, ఇతరత్రా అక్రమాలను నిరోధించేందుకు వీలుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఆన్లైన్ ప్రవేశాల విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు. -
మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
ష్ట్రంలో మే 24 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. షెడ్యూలును విద్యాశాఖ బుధవారం విడుదల చేసింది. -
సంక్షిప్త వార్తలు (4)
రాష్ట్రంలో వచ్చే నెల 6వ తేదీన జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఇంజినీరింగు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ఈసెట్)ను మే చివరి వారానికి వాయిదా వేయాలని పలువురు అభ్యర్థులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కోరారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?