అపార ఖనిజ సంపద అన్వేషణ
అత్యాధునిక సాంకేతికత.. అపారమైన మానవ వనరులతో.. ఖనిజ సంపదలో దేశం స్వయంసమృద్ధి లక్ష్యంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.రాజు తెలిపారు.
ఆత్మనిర్భర్ భారత్ దిశగా జీఎస్ఐ తోడ్పాటు
‘ఈనాడు’తో డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.రాజు
ఈనాడు, హైదరాబాద్: అత్యాధునిక సాంకేతికత.. అపారమైన మానవ వనరులతో.. ఖనిజ సంపదలో దేశం స్వయంసమృద్ధి లక్ష్యంగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) కొత్త ఒరవడితో ముందుకు సాగుతోందని డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఎస్.రాజు తెలిపారు. దేశంలో మొదటిసారిగా జమ్మూ ప్రాంతంలో లిథియం నిల్వలను గుర్తించి నివేదిక అందజేసినట్లు చెప్పారు. కీలకమైన ఖనిజాలను గుర్తించి దేశాభివృద్ధికి దోహదపడేందుకు జీఎస్ఐ కృషి చేస్తోందని వివరించారు. లిథియంతో పాటు రాగి, బంగారం, వజ్ర నిక్షేపాలు, కీలకమైన ఖనిజాలను గుర్తించి దేశ అవసరాలకు ఉపయోపడేలా జీఎస్ఐ ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందన్నారు. మైనింగ్ బ్లాక్లను గుర్తించే బాధ్యతను కేంద్రం జీఎస్ఐకి అప్పగించిందని.. 400కు పైగా బ్లాక్లను గుర్తించి వివరాలను అందించామన్నారు. 170 ఏళ్ల చరిత్ర కలిగిన జీఎస్ఐ ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భూమి లోపలి ఖనిజ వనరులతో పాటు సముద్రంలో నిక్షేపమైన ఖనిజాలను గుర్తించి దేశ అవసరాలకు అండగా నిలుస్తోందని వివరించారు. ‘ఈనాడు’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు.
లిథియం నిల్వలు..
విద్యుత్ వాహనాల బ్యాటరీలకు కీలకమైన లిథియంను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఈ నేపథ్యంలో దేశంలోనే మొదటిసారిగా జమ్మూ ప్రాంతంలో లిథియం నిల్వలను జీఎస్ఐ గుర్తించింది. ఇవి 5.9 మిలియన్ టన్నుల మేర ఉంటాయని అంచనా. పూర్తి వివరాలను జమ్మూ పాలన యంత్రాంగానికి అందజేశాం. లిథియం గనులపై కేంద్రం కూడా దృష్టి సారించింది. ఎంత వెలికి తీయవచ్చనే అంశంపై ఇండియన్ బ్యూరోఆఫ్ మైన్స్ అధ్యయనం చేస్తోంది. త్వరలో ఈ గనుల్లో తవ్వకాలు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దేశంలో ఇంకా ఎక్కడెక్కడ లిథియం నిల్వలు ఉన్నాయో.. గుర్తించే పనిలో జీఎస్ఐ ఉంది. రాజస్థాన్లోని పలు ప్రాంతాల్లో లిథియం నిల్వలను గుర్తించే పరిశోధనలు కొనసాగుతున్నాయి. రాగి నిల్వలు మనవద్ద పూర్తిగా తగ్గిపోయాయి. రాగి, టంగ్స్టన్ వంటి ఖనిజాలను గుర్తిస్తున్నాం. గతంలో ధాతువులో 2 శాతం మేర రాగి ఉంటేనే మైనింగ్ చేసేవారు.. ఇప్పుడు 0.4 శాతం ఉన్నా మైనింగ్కు అవకాశం ఉండటంతో తక్కువ పరిమాణంతో ఉన్న నిల్వలను గుర్తిస్తున్నాం.
నిక్షేపంగా బంగారం..
బంగారం నిక్షేపాలు ప్రధానంగా కర్ణాటకలో ఉన్నాయి. హట్టి బంగారు నిల్వలపై ఆ రాష్ట్రానికి జీఎస్ఐ నివేదికను అందజేసింది. శంకరిగొప్ప, బుడపనపల్లి, కార్వార్ సహా మొత్తం అయిదు బ్లాక్ల వివరాలను అందించాం. బిహార్, ఝార్ఖండ్, ఒడిశా, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా నిల్వలు ఉన్నాయి. అవి అటవీ లేదా నివాస ప్రాంతాల్లో ఉండటం వల్ల వెలికితీయడం అంత సులభం కాదు.
వజ్ర ‘సంపద’
ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా వజ్రకరూర్ ప్రాంతంలో వజ్ర నిక్షేపాలకు అవకాశం ఉంది. జీఎస్ఐ, హైదరాబాద్లోని ఎన్జీఆర్ఐ సంయుక్తంగా అక్కడ అధ్యయనం చేస్తున్నాయి. వజ్రాల లభ్యతకు అవకాశం ఉన్న కింబర్లైట్ పైపులను ప్రాథమికంగా గుర్తించాం. పూర్తిస్థాయి అధ్యయనం జరుగుతోంది.
జోషిమఠ్లో అధ్యయనం
జోషిమఠ్లో నేల కుంగిన ప్రాంతంలోని ఇళ్లలోని వారికి ప్రత్యామ్నాయంగా సురక్షితమైన ప్రాంతాల్లో ఇళ్లను నిర్మించేందుకు అనువైన స్థలాలను గుర్తించే బాధ్యతను జీఎస్ఐకి కేంద్రం అప్పగించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో అధ్యయనం చేసి అయిదు అనువైన ప్రదేశాలను గుర్తించి వివరాలను అందజేశాం.
కొండచరియలపైనా సమాచారం..
వాతావరణ సమాచారం మాదిరిగా కొండచరియలు విరిగిపడే సమాచారాన్ని ముందస్తుగా అందించనున్నాం. 2025 నుంచి జీఎస్ఐ ఈ సమాచారాన్ని అందిస్తుంది. హిమాలయ ప్రాంతాలు సహా మొత్తం 17 రాష్ట్రాలకు ఈ సమాచారం అందుబాటులోకి రానుంది. ఈమేరకు అధ్యయనాలు సాగుతున్నాయి.
భూమిలోపల నిక్షేపాలు..
చాలా రాష్ట్రాల్లో భూ ఉపరితలంలో ఉన్న ఖనిజ వనరుల నిల్వలు దాదాపు ఉపయోగించుకోవడం పూర్తి కావస్తోంది. ఈమేరకు భూమి లోపల ఉండే ఖనిజ నిక్షేపాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. 40-50 కిలోమీటర్ల లోతున ఉన్న ఖనిజ వనరులను గుర్తించగలిగే అత్యాధునిక సాంకేతిక ప్రాజెక్టును అమలు చేస్తున్నాం. వీటిని గుర్తించి వినియోగించడం ద్వారా దేశాభివృద్ధికి తోడ్పడేలా కార్యక్రమం అమలవుతోంది. భూమి లోపల రెండు కిలోమీటర్ల వరకు ఉన్న నిక్షేపాలను గుర్తించేందుకు ప్రత్యేక విమానాలను సమకూర్చుకున్నాం.
సాగర గర్భంలోనూ..
జీఎస్ఐ వద్ద అత్యాధునిక సాంకేతిక పరికరాలతో ఉండే రత్నాకర్ నౌక ఉంది. రూ.800 కోట్లతో ఈ నౌకను కేంద్రం సమకూర్చింది. ఈ నౌక తూర్పు, పశ్చిమ తీర ప్రాంతాల్లోని సముద్రంలో ఉండే ఖనిజ సంపదతో పాటు విలువైన సమాచారాన్ని సేకరిస్తోంది. ప్రధానంగా తూర్పు తీరంలోని అండమాన్ ప్రాంతంలోను.. పశ్చిమతీరంలోను.. పనిచేస్తోంది. సముద్రంలో 2 కిలోమీటర్ల వరకు లభించే ఇల్మెనైట్, మోనజైట్, సిలిమనైట్, జిర్కాన్ సహా మొత్తం 8 ఖనిజ నిక్షేపాలను గుర్తిస్తున్నాం. ఫాస్ఫేట్, నిర్మాణాలకు పనికివచ్చే ఇసుక, లైమ్స్టోన్ నిక్షేపాలపైనా అధ్యయనం జరుగుతోంది. సముద్ర భూభాగంలో నిల్వలను గుర్తించడంతో పాటు సముద్రం లోపల భూప్రకంపనలను నమోదు చేస్తున్నాం. దీంతో పాటు దేశ రక్షణకు సంబంధించి కీలక తోడ్పాటు అందిస్తున్నాం.
జియోహెరిటేజ్ సైట్లు..
చారిత్రక సంపద గురించి భవిష్యత్ తరాలకు అందించేలా అనేక కార్యక్రమాలు చేపట్టాం. జియోహెరిటేజ్ సైట్లను గుర్తించి వాటి చారిత్రక వివరాలను అందుబాటులో ఉంచాం. ఇలాంటివాటిని దేశంలో 90 వరకు గుర్తించాం. ఉదాహరణకు తిరుమలలోని శిలాతోరణం, షిల్లాంగ్ గుహలు వంటివి. వీటితో జియో టూరిజం మ్యాప్ను అందుబాటులోకి తెస్తాం. స్థలం గొప్పతనం, చారిత్రక విశేషాలు, అక్కడ ఉన్న సౌకర్యాలు, అక్కడికి చేరుకోవడం ఎలా వంటి అనేక అంశాలు అందులో ఉంటాయి. బద్రీనాథ్, కేదార్నాథ్ల టన్నెళ్ల ఎలైన్మెంట్పై బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్తో కలిపి జీఎస్ఐ పనిచేస్తోంది.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీ టెన్త్ ఫలితాల్లో నాగసాయి మనస్వీ 599/600
100, 99, 100, 100, 100, 100.. ఇవేంటని సందేహిస్తున్నారా? ఇవి పదో తరగతిలో ఓ విద్యార్థినికి వచ్చిన మార్కులు. ఏలూరు జిల్లా ముసునూరు మండలం రమణక్కపేటకు చెందిన వెంకట నాగసాయి మనస్వీకి ఈ మార్కులు వచ్చాయి. -
ఒంటిమిట్టలో రాములోరి వైభవం
వైయస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి సీతారాముల కల్యాణం వైభవంగా జరిగింది. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాద్యాల నడుమ జానకీరాముల పరిణయ ఘట్టాన్ని కనులపండువగా నిర్వహించారు. -
30న తెలంగాణ పదో తరగతి ఫలితాలు
తెలంగాణలో పదో తరగతి పరీక్ష ఫలితాలు ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు పాఠశాల విద్యా కమిషనర్ కార్యాలయంలో ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నారు. -
సాగర్ టెయిల్పాండ్ నుంచి నీటి తరలింపు అభ్యంతరకరం
కృష్ణా బోర్డుకు సమాచారం ఇవ్వకుండా నాగార్జునసాగర్ టెయిల్పాండ్ నుంచి నాలుగు టీఎంసీల నీటిని ఆంధ్రప్రదేశ్ తరలించుకుపోవడంపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. -
వెంకయ్యనాయుడికి పద్మవిభూషణ్ ప్రదానం
మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సోమవారం ఇక్కడి రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము చేతులమీదుగా పద్మ విభూషణ్ పురస్కారం అందుకున్నారు. -
జోరున కురిసి.. భగ్గున మండి
రాష్ట్రంలో ఎండ, వానలు రైతులను, సామాన్యులను ఆగమాగం చేస్తున్నాయి. సాయంత్రం నుంచి తెల్లవారుజాము వరకు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తుండగా.. ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. -
దువ్వూరి అనుభవాలకు అక్షర రూపం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తన వ్యక్తిగత, వృత్తిపరమైన అనుభవాలకు అక్షరరూపం ఇచ్చారు. ‘జస్ట్ ఏ మెర్సినరీ? నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరీర్’ పేరుతో ఆంగ్లంలో పుస్తకం రాశారు. -
ఎన్నికలు సజావుగా జరిగేలా పనిచేయాలి
పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ, సమన్వయంతో పనిచేయాలని డీజీపీ రవిగుప్తా పోలీసు అధికారులకు సూచించారు. -
తిరుమలలో వసంతోత్సవ వైభవం
శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు సోమవారం ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామి స్వర్ణ రథంపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. -
శ్రీశైల మల్లన్న సేవలో చంద్రబాబు దంపతులు
తెదేపా అధినేత చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు సోమవారం నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రాన్ని సందర్శించారు. ఉదయం 11.52 గంటలకు హైదరాబాద్ నుంచి సున్నిపెంటకు వచ్చిన వారికి హెలిప్యాడ్ వద్ద మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, -
చిత్ర వార్త
బ్రిటన్లోని కోవెంట్రీ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో విలెన్ హాల్ సోషల్ క్లబ్ ప్రాంగణంలో ఇటీవల ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. -
కాలువలో నాటేసినట్లు..
వరిపైరు కాదిది.. కాళేశ్వరం ప్రాజెక్ట్ గ్రావిటీ కాల్వ.. అచ్చం వరి నాటు వేసినట్లు కనిపిస్తోంది కదూ... జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌస్ నుంచి అన్నారం బ్యారేజీకి.. -
కొత్త వంగడాలను రూపొందించాలి
వాతావరణ మార్పులను తట్టుకోవడంతో పాటు పౌష్టికాహార భద్రత కల్పించే కొత్త వంగడాల రూపకల్పనపై వ్యవసాయ శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ వెంకటరమణ పిలుపునిచ్చారు. -
ఇదీ సంగతి!
-
మిరప రైతుకు మిగిలింది కన్నీళ్లే..
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గిట్టుబాటు ధర లభించకపోవటంతో మిరప రైతులు ఆవేదన చెందుతున్నారు. విపణికి సోమవారం సుమారు 13 వేల బస్తాల ఎండు మిరప, 2 వేల బస్తాల తాలు మిరపను తెచ్చారు. -
రాహిల్ బెయిల్ రద్దుపై హైకోర్టు నిర్ణయం వాయిదా
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితుడైన మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్ను అరెస్ట్ చేయరాదన్న మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ పోలీసులు దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్పై నిర్ణయాన్ని హైకోర్టు సోమవారం వాయిదా వేసింది. -
అన్నారం బ్యారేజీలో ఇసుక తొలగింపు ప్రారంభం
అన్నారం బ్యారేజీ ఎగువన ఇసుక మేటల తొలగింపు ప్రారంభమైంది. గతేడాది నవంబరులో బ్యారేజీకి దిగువన కొన్ని పియర్స్ వద్ద సీపేజీ ఏర్పడంతో మరమ్మతులు చేపట్టారు. -
మే నెలాఖరు వరకు తాగునీటికి లోటు లేదు
రాష్ట్రంలో మే నెలాఖరు వరకు తాగునీటికి ఎలాంటి కొరత లేదని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. నీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని, అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. -
సివిల్స్ ర్యాంకర్ అక్షయ్ను అభినందించిన సీఎం
సివిల్స్-2023 ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 196వ ర్యాంకు సాధించిన జి.అక్షయ్ దీపక్ను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభినందించారు. -
జేఈఈ మెయిన్-2లో పది ప్రశ్నలకు ‘కీ’ మార్పు
జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షల తుది ‘కీ’ని జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ(ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. పది ప్రశ్నలకు ‘కీ’లో మార్పు ఉండగా.. నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపనున్నారు. -
పూడికతీతపై నీటిపారుదల శాఖ దృష్టి
జలాశయాలలో పూడిక మేటలతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గుతున్న నేపథ్యంలో సిల్ట్ తొలగింపునకు ఉన్న విధానాలపై తెలంగాణ అధ్యయనం చేపట్టింది.