అమెరికా-భారత్ బంధం బలోపేతం
అమెరికా-భారత్ సంబంధాల బలోపేతంలో హైదరాబాద్లో నిర్మించిన నూతన కాన్సులేట్ కార్యాలయం నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నారు.
యూఎస్ రాయబారి ఎరిక్ గార్సెట్టి
కాన్సులేట్ కార్యాలయం లాంఛనంగా ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: అమెరికా-భారత్ సంబంధాల బలోపేతంలో హైదరాబాద్లో నిర్మించిన నూతన కాన్సులేట్ కార్యాలయం నూతన అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుందని భారత్లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నారు. రాయబారిగా బాధ్యతలు చేపట్టిన తరవాత తొలిసారిగా ఆయన హైదరాబాద్కు వచ్చారు. నానక్రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నిర్మించిన నూతన కాన్సులేట్ కార్యాలయాన్ని శుక్రవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. అమెరికా 247వ స్వాతంత్య్ర వేడుకలను కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలకు సేవలను అందించేందుకు ఇక్కడ కాన్సులేట్ ఏర్పాటు చేశాం. నూతన భవన నిర్మాణానికి రూ.340 మిలియన్ డాలర్లు వెచ్చించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, భారత్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి డాక్టర్ ఔసఫ్ సయీద్ పాల్గొన్నారు. అంతకుముందు కాన్సులేట్కు వచ్చిన గవర్నర్ తమిళిసైతో ఎరిక్, లార్సన్లు వివిధ అంశాలపై చర్చించారు.
మోదీ-బైడెన్ బంధంపై ప్రపంచం ఆసక్తి
‘అమెరికా-భారత్ సంబంధాలను యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా చూస్తోంది. రానున్న నాలుగు నెలల్లో రెండు దేశాల అగ్రనాయకులు మూడుసార్లు ముఖాముఖి కలవనుండటం విశేషం. ఇరు దేశాల సంబంధాల బలోపేతానికి ఇదే సూచిక’ అని భారత్లోని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి అన్నారు. హైదరాబాద్ వచ్చిన ఆయన శుక్రవారం టి-హబ్లో విలేకరులతో మాట్లాడారు. ‘అమెరికాకు భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇటీవల కాలంలో ప్రపంచంలో ఎక్కడా ఏర్పాటు చేయకపోయినా.. అమెరికా తన కాన్సులేట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో నెలకొల్పడం భారత్కు ఇచ్చే ప్రాధాన్యానికి నిదర్శనం. వీసాల కోసం డిమాండు అనూహ్యంగా ఉంది. హైదరాబాద్ కాన్సులేట్ పరిధిలో వీసా కోసం గతంలో వెయ్యి రోజులపాటు వేచి ఉండాల్సి వచ్చేది. ప్రస్తుతం ఆ వ్యవధిని ఏడాదికి తగ్గించగలిగారు. జూన్, జులై, ఆగస్టు నెలల్లో విద్యార్థి వీసా (ఎఫ్-1)లకు అధిక ప్రాధాన్యమివ్వాలని నిర్ణయించాం. ఈ ఏడాదిలో ఒక మిలియన్ వీసా దరఖాస్తులను పరిశీలించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని ఎరిక్ తెలిపారు.
ఆయన నోట తెలుగు మాట..
‘హైదరాబాద్లో ట్రాన్స్జెండర్ల కోసం ఏర్పాటు చేసిన ఆసుపత్రితోపాటు చౌమొహల్లా ప్యాలెస్, టీ-హబ్లను సందర్శించాను. 1985 తర్వాత మళ్లీ ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. ఈ నగరం అభివృద్ధికి సంకేతంగా ఉంది’ అన్నారు ఎరిక్. అమెరికన్ అయినా.. మహాకవి శ్రీశ్రీ రాసిన ‘మరో ప్రపంచం, మరో ప్రపంచం, మరో ప్రపంచం పిలిచింది..’ కవితను ఆయన తెలుగులో ప్రస్తావించడం విశేషం. ఈ కవిత మన ఆకాంక్షలను, ఆశయాలను చెబుతోందంటూ ఆయన ఆ కవిత భావాలను ఆంగ్లంలో వివరించారు. తాను హాలీవుడ్ నుంచి వచ్చినా ఇక్కడి నాటు... నాటు.. పాట ఆస్కార్ను దక్కించుకోవటం ఆనందంగా ఉందని ఎరిక్ గార్సెట్టి అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బోన్మ్యారో మార్పిడితో యువకుడికి పునర్జన్మ
ఓ రకమైన రక్త క్యాన్సర్తో బాధపడుతున్న యువకుడికి హైదరాబాద్లోని ప్రభుత్వ ఎంఎన్జే ఆసుపత్రి పునర్జన్మ ప్రసాదించింది. -
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
సైబర్ నేరాల దర్యాప్తులో దేశానికే మార్గదర్శకంగా ఉన్న తెలంగాణ పోలీసుశాఖ మరో ముందడుగు వేసింది. -
మా వాళ్లు ఏం చెబితే.. అది చేయ్.. అన్నీ నేను చూసుకుంటా..
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. -
జగన్ భక్త ఐపీఎస్లపై వేటు
అధికార వైకాపాతో అంటకాగుతూ... గత ఐదేళ్లుగా ఆ పార్టీ అరాచకాలకు అడుగడుగునా కొమ్ముకాస్తూ వచ్చిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఎన్నికల సంఘం ఎట్టకేలకు బదిలీ వేటు వేసింది. -
ఆస్తులు వేల కోట్లు.. చూపింది వందల కోట్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పులివెందుల నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్న ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన అఫిడవిట్లో ఆస్తుల విలువ తక్కువగా చూపించారు. -
ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్పై క్యాట్ విచారణ 29కి వాయిదా
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ వివాదంపై హైదరాబాద్లోని కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ (క్యాట్) విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. -
తాగునీటికి.. మూసీ శుద్ధికి
ఒక్క ప్రాజెక్టుతో రెండు ప్రయోజనాలు నెరవేరబోతున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి పైపులైను ద్వారా తాగునీటిని హైదరాబాద్కు తరలించడం ద్వారా రాజధాని పరిధిలో తాగునీటి అవసరాలను సంపూర్ణంగా తీర్చడంతోపాటు, మురికి కూపంగా మారిన మూసీని ప్రక్షాళన చేయబోతున్నారు. -
గరం.. గరం
రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట రోజూ 45 గరిష్ఠ ఉష్ణోగ్రత డిగ్రీలకు తాకుతుండటం ఆందోళన కలిగిస్తోంది. మంగళవారం మిర్యాలగూడలో 45.1 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. -
కూలిన మానేరు వాగు వంతెన గడ్డర్లు
పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలను అనుసంధానిస్తూ మానేరు వాగుపై నిర్మాణంలో ఉన్న వంతెన గడ్డర్లు సోమవారం రాత్రి నేలకూలాయి. -
ఎక్సైజ్ అధికారుల బదిలీల్లో మినహాయింపులెందుకు?
ఎన్నికల సందర్భంగా నిర్వహించే బదిలీల్లో ఎక్సైజ్ అధికారులకు మినహాయింపు ఎందుకు ఇచ్చారో తెలపాలని హైకోర్టు మంగళవారం ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది. -
ఆశలు ఆవిరి.. మూగజీవాలకు వదిలి..
విత్తనోత్పత్తి వరి సాగు చేపట్టిన రైతులకు కన్నీళ్లే మిగిలాయి. పంట పొట్టదశలో నీటి తడులు అందక ఎదుగుదల లోపిస్తోంది. -
26న ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ రాక
ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ఈ నెల 26న రాష్ట్రానికి రానున్నారు. పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు. ఇందుకు ఏర్పాట్లు చేయాలని సీఎస్ ఎ.శాంతికుమారి ఉన్నతాధికారులను ఆదేశించారు. -
రక్షణ చర్యలు లేకపోవడం వల్లే ఎస్బీ ఆర్గానిక్స్లో పేలుడు
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని ఎస్బీ ఆర్గానిక్స్లో ఇటీవల జరిగిన ప్రమాదానికి సరైన భద్రతా చర్యలు లేకపోవడమే కారణమని ఐఐసీటీ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ) మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ బాబురావు అభిప్రాయపడ్డారు. -
టీ-సాట్ ఆధ్వర్యంలో నేడు, రేపు ‘నీట్’ పాఠ్యాంశాల ప్రత్యక్ష ప్రసారం
మే 5న నిర్వహించే ‘నీట్’ పరీక్షపై టీ-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ప్రత్యేక పాఠ్యాంశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నట్లు టీ-సాట్ సీఈవో బి.వేణుగోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. -
ఇదీ సంగతి!
ఆదాయంలోనే కాదు సార్.. కేసుల్లో కూడా ఏ సీఎం మీ దరిదాపుల్లోకి రాలేరు సార్! -
నేడు ఇంటర్ ఫలితాలు
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. -
రుణం ఎగవేత కేసులో రూ.55.73 కోట్ల ఆస్తుల జప్తు
వ్యాపారం కోసం రుణం తీసుకొని సొంత ఖాతాల్లోకి మళ్లించుకొని బ్యాంకుల్ని మోసం చేసిన కేసులో వీఎంసీ సిస్టమ్స్ లిమిటెడ్కు చెందిన రూ.55.73 కోట్ల స్థిర, చరాస్తులను హైదరాబాద్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
నేటి నుంచి కాళేశ్వరంపై న్యాయ విచారణ
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంపై బుధవారం నుంచి జ్యుడిషియల్ విచారణ ప్రారంభం కానుంది. -
బాబ్లీ కేసు విచారణ మే 7కు వాయిదా
బాబ్లీ ప్రాజెక్టు ముట్టడి కేసు విచారణ వచ్చే నెల 7కు వాయిదా పడింది. -
పుట్టుకతోనే కాలేయ వ్యాధి.. మా బాబును ఆదుకోండి!
రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం.. లేక లేక కలిగిన సంతానం.. పెళ్లైన తొమ్మిదేళ్లకు బాబు పుట్టాడు. కూలి పనులు చేసుకుని జీవనం సాగించే ఆ దంపతులకు బిడ్డ పుట్టాడన్న ఆనందం ఎంతోసేపు నిలవలేదు. -
యాదాద్రిలో వైభవంగా తెప్పోత్సవం
చైత్ర పౌర్ణమిని పురస్కరించుకొని యాదాద్రి దివ్యక్షేత్రంలో మంగళవారం తెప్పోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. శ్రీలక్ష్మీనరసింహులను ముస్తాబు చేసి మంగళ వాయిద్యాల నడుమ కొండపైన ఉన్న విష్ణు పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారు.
తాజా వార్తలు (Latest News)
-
‘మా పేరుతో తప్పుడు ప్రచారం’.. ప్రజలకు ఎల్ఐసీ అలర్ట్!
-
సభలో మాట్లాడుతూ.. స్పృహ కోల్పోయిన నితిన్ గడ్కరీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ బర్త్డే ఎంతో స్పెషల్.. వారి నుంచే నాకు ఫస్ట్ విషెస్: సచిన్
-
మోదీ పనితీరు అద్భుతం.. కొనియాడిన జేపీ మోర్గాన్ సీఈఓ
-
రూ. 120 కోట్లకు పైగా అక్రమార్జన.. ఎట్టకేలకు చిక్కిన స్క్రాప్ మాఫియా డాన్