పాలిసెట్లో 82 శాతం ఉత్తీర్ణత
రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు ఉద్యాన, పశువైద్య, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్ల భర్తీకి నిర్వహించిన పాలిసెట్-2023 ఫలితాల్లో సుమారు 82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.
తొలి 5 ర్యాంకర్లలో ముగ్గురు సూర్యాపేట జిల్లా విద్యార్థులు
జూన్ 14 నుంచి ప్రవేశాల కౌన్సెలింగ్
జులై 15 నుంచి తరగతుల ప్రారంభం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ పరిధిలోని పాలిటెక్నిక్ కళాశాలలతోపాటు ఉద్యాన, పశువైద్య, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా సీట్ల భర్తీకి నిర్వహించిన పాలిసెట్-2023 ఫలితాల్లో సుమారు 82 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్ డిప్లొమాల్లో ప్రవేశానికి ఎంపీసీ.. ఉద్యాన, పశువైద్య, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో నాన్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు ఎంబైపీసీగా విభజించి పరీక్ష నిర్వహించారు. ప్రశ్నపత్రం ఒకటే అయినా విద్యార్థులకు రెండు వేర్వేరు ర్యాంకులు కేటాయించారు. మొత్తం 1,05,742 మంది దరఖాస్తు చేసుకోగా.. మే 17వ తేదీన జరిగిన పరీక్షను 98,274 మంది రాశారు. పరీక్ష రాసినవారిలో ఎంపీసీ విభాగంలో 80,358 మంది(81.77 శాతం), ఎంబైపీసీ విభాగంలో 80,752 మంది(82.17 శాతం) కౌన్సెలింగ్కు అర్హత సాధించారు. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్బీటెట్) కార్యదర్శి, పాలిసెట్ కన్వీనర్ ఎ.పుల్లయ్య, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనాథ్ తదితరులు శుక్రవారం ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా నవీన్ మిత్తల్ మాట్లాడుతూ రెండు విభాగాల్లో తొలి అయిదు ర్యాంకర్లలో ముగ్గురు సూర్యాపేట జిల్లా విద్యార్థులు ఉన్నారని తెలిపారు.
ఈ ఏడాది నుంచి ‘పాలిక్వెస్ట్’
పాలిటెక్నిక్ కోర్సులపై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ ఏడాది నుంచి ‘పాలిక్వెస్ట్’ పేరిట కొత్త కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నామని నవీన్ మిత్తల్ తెలిపారు. అందులో భాగంగా విద్యార్థులు తమకు సమీపంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలకు వెళ్లి ప్రయోగశాలలను, ఇతర సౌకర్యాలను చూడొచ్చన్నారు. ఈసారి కౌన్సెలింగ్ కేంద్రాల్లో విద్యార్థులకు దరఖాస్తులు నింపడం, ఆన్లైన్లో పంపడం లాంటి అంశాల్లో సహకారం అందిస్తామని తెలిపారు.
మరో మూడు ప్రభుత్వ కళాశాలలకు అనుమతి
రాష్ట్ర ప్రభుత్వం ఈసారి మణుగూరు, మహేశ్వరం, షాద్నగర్లలో ప్రభుత్వ కళాశాలల ఏర్పాటుకు అనుమతి ఇచ్చిందని మిత్తల్ తెలిపారు. గత ఏడాది వరకు 54 ప్రభుత్వ, 64 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో మొత్తం 29,690 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. కొత్త కళాశాలల్లో సీట్లపై త్వరలో స్పష్టత వస్తుందన్నారు. కార్యక్రమంలో టాస్క్ సీఈఓ శ్రీకాంత్ సిన్హా, ఎస్బీటెట్ అదనపు కార్యదర్శి పీవీ రఘు, జాయింట్ డైరెక్టర్ బి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మెరిసిన రైతు బిడ్డ
కాటారం, న్యూస్టుడే: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన ఆకాశ్ పాలిసెట్ ఎంబైపీసీ విభాగంలో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంకు సాధించి సత్తా చాటాడు. తండ్రి చీర్ల రమేశ్, తల్లి రజిత వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. వీరికి ఆకాశ్, అక్షిత సంతానం. హనుమకొండలోని ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదివిన ఆకాశ్ 10 జీపీఏ సాధించాడు. పాలిసెట్లో ఎంబైపీసీ విభాగంలో 120 మార్కులకు 116 సాధించి రాష్ట్రస్థాయిలో తొలి ర్యాంకు కైవసం చేసుకున్నాడు. ‘ప్రతిభను పరీక్షించుకోవడానికే పాలిసెట్ రాశా. ప్రత్యేకంగా ఎలాంటి శిక్షణ తీసుకోలేదు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం’ అని తెలిపాడు.
సివిల్సే లక్ష్యం
సూర్యాపేట (మహాత్మాగాంధీ రోడ్డు), న్యూస్టుడే: సూర్యాపేట పట్టణానికి చెందిన సురభి శరణ్య పాలిసెట్లో రాణించింది. ఎంపీసీ విభాగంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లి కవిత గృహిణి కాగా, తండ్రి భిక్షం ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. పాలిసెట్లో ఎంపీసీ విభాగంలో రాష్ట్రస్థాయిలో ప్రథమ ర్యాంకు రావడం సంతోషంగా ఉందని సురభి శరణ్య తెలిపింది. పదో తరగతిలో 9.8 జీపీఏ వచ్చినట్లు తెలిపింది. ఇంటర్మీడియట్ పూర్తయిన తర్వాత ఇంజినీరింగ్ చదువుతానని.. ఆ తర్వాత సివిల్స్కు సిద్ధమవుతానని వివరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వలకు చిక్కిన 30 కిలోల చేప
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రాజరాజేశ్వర జలాశయంలో నీటి నిల్వ తగ్గడంతో మత్స్యకారుడి వలకు గురువారం భారీ చేప చిక్కింది. -
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే ప్రారంభమైన వేడి మధ్యాహ్నానికి తీవ్రస్థాయికి చేరింది. -
ఈపీఎస్ ఆదాయం పెరుగుతున్నా.. కనీస పింఛను రూ.వెయ్యేనా?
ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా.. లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు వృద్ధాప్య పింఛను కింద నెలకు రూ.2 వేలు ఇస్తుండగా.. ఈపీఎఫ్వో పింఛనుదారులు దాదాపు 75 శాతం మంది నెలకు రూ.వెయ్యితో జీవితాలను నెట్టుకువస్తుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. -
ఏపీ సీఎస్, డీజీపీలపై.. ఈసీఐ నిర్ణయం కోసం చూస్తున్నాం
ఆంధ్రప్రదేశ్లోని సీనియర్ అధికారులపై అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) తీసుకునే నిర్ణయం కోసం వేచిచూస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్కుమార్ మీనా చెప్పారు. -
వైకాపాకు ప్రచారం చేసిన వెంకట్రామిరెడ్డిపై ఈసీ వేటు
వైకాపాతో అంటకాగుతూ.. ఆ పార్టీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఎట్టకేలకు వేటు పడింది. -
గులకరాయి కేసులో ఏ2 ఎవరు..?
సీఎం జగన్పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్సింగ్నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. -
భల్లూకం దెబ్బకు పెద్దపులి పరుగో పరుగు
పెద్దపులిని చూస్తే అడవిలో జంతువులు హడలిపోతాయి. ఒక్క ఎలుగుబంటి తప్ప. భల్లూకానికి కోపం వస్తే పెద్దపులిని సైతం పరుగులు పెట్టిస్తుంది. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ తెలిపారు. -
ఆ 106 ఎకరాలు రక్షిత అటవీభూమే
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలోని సర్వే నం.171/3 నుంచి 171/7ల్లో ఉన్న రూ.వందల కోట్ల విలువైన 106.34 ఎకరాలు అటవీభూమేనని, అది ప్రైవేటు వ్యక్తులది కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
రూ.800 కోట్ల బియ్యం ఏమయ్యాయి?
రైస్మిల్లులకు వెళ్లిన ధాన్యం కస్టమ్ మిల్లింగ్(సీఎంఆర్) తర్వాత తిరిగిరావడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. అనేక వాయిదాలు ఇచ్చినప్పటికీ పలు జిల్లాల్లో మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతున్నారు. -
జర్మనీలో ఘనంగా హిందూ నూతన సంవత్సర వేడుకలు
హిందూ నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని జర్మనీలోని మైంజ్-విస్బాడెన్లో భారత్ వాసి జర్మనీ అసోసియేషన్ ఘనంగా వేడుకలు నిర్వహించింది. -
ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ ఏర్పాటు
యాదాద్రి భువనగిరి జిల్లాలోని బీబీనగర్ ఎయిమ్స్లో హీమోడయాలసిస్ యూనిట్ను డైరెక్టర్ వికాస్ భాటియా గురువారం ప్రారంభించారు. -
ఇథనాల్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి
పంట పొలాలకు తీవ్ర నష్టం కలిగిస్తూ పర్యావరణ విధ్వంసానికి కారణమవుతున్న 28 ఇథనాల్ కంపెనీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. -
జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 30కి వాయిదా
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసులతోపాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన 9 కేసుల విచారణను హైదరాబాద్ సీబీఐ కోర్టు ఈ నెల 30వ తేదీకి వాయిదా వేసింది. -
ఓటేద్దాం.. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసుకుందాం
దేశంలోని పర్యాటక ప్రాంతాల్లో వివిధ సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ‘దేఖో అప్నాదేశ్ పీపుల్ ఛాయిస్’ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. -
మంచి పుస్తకం మనో వికాసం
తెలుగు బాల సాహిత్య ప్రచురణలో ‘మంచి పుస్తకం’ది ఒక ప్రత్యేక ఒరవడి. డిజిటల్ యుగంలోనూ ఆ సంస్థది చెరగని సంతకం. -
శ్రీవారి ఆలయంలో ఘనంగా శ్రీరామపట్టాభిషేకం
శ్రీవారి ఆలయంలో గురువారం రాత్రి శ్రీరామపట్టాభిషేకం ఘనంగా జరిగింది. సాయంత్రం 4నుంచి శ్రీ సీతారామలక్ష్మణ ఆంజనేయ స్వామివారి ఉత్సవమూర్తులకు విశేష సమర్పణ.. సహస్ర దీపాలంకారణ సేవ చేశారు. -
కనుమరుగవుతున్నా.. కనిపిస్తూనే ఉండాలని..!
డీజిల్ రైలు ఇంజిన్లు కనుమరుగవుతున్న నేపథ్యంలో.. ఎప్పటికీ అందరికీ గుర్తుండిపోయేలా కాజీపేట డీజిల్ లోకోషెడ్ కార్మికులు ఓ వారసత్వపు డీజిల్ రైలు ఇంజిన్ను రూపొందించారు. -
మావోయిస్టుల ఏరివేతలో సింగం
ఏ పోలీసుకైనా తన సర్వీసులో ఒకసారి రాష్ట్రపతి శౌర్య పురస్కారం అందుకోవడమే గొప్ప. అలాంటిది 17 ఏళ్ల తన సర్వీసులో ఆయన ఏకంగా ఆరుసార్లు ఆ పురస్కారాన్ని అందుకున్నారు. -
ముగిసిన సిరిపెల్లి ప్రస్థానం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల విప్లవ ప్రస్థానం ముగిసింది. -
ఆసుపత్రికి మంత్రి కోమటిరెడ్డి 32 ఏసీల వితరణ
నల్గొండ జిల్లా ఆసుపత్రిలోని మాతాశిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో 32 ఏసీలు ఏర్పాటు చేయించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఉదారత చాటుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య