ఊరు పట్టించుకుంది.. సగర్వంగా నిలబడింది
విద్యార్థులు రాకపోవడంతో ఒకనాడా ప్రభుత్వ పాఠశాల మూతపడింది. ఇప్పుడందులో ప్రవేశం లభించడమే అదృష్టం అనేంతగా పరిస్థితి మారిపోయింది.
ఆదర్శంగా ఒంటిమామిడిపల్లి ప్రభుత్వ పాఠశాల
ఐనవోలు (హనుమకొండ), న్యూస్టుడే: విద్యార్థులు రాకపోవడంతో ఒకనాడా ప్రభుత్వ పాఠశాల మూతపడింది. ఇప్పుడందులో ప్రవేశం లభించడమే అదృష్టం అనేంతగా పరిస్థితి మారిపోయింది. ఇదంతా తల్లిదండ్రులు తీసుకున్న చొరవ ఫలితమే. వారే తమ గ్రామ పాఠశాలను తెరిపించారు. బాగు చేసుకునే బాధ్యతనూ తీసుకున్నారు. ఫలితంగా ఇక్కడ అయిదేళ్లుగా ‘నో అడ్మిషన్’ బోర్డును ఏర్పాటు చేస్తుండటం గమనార్హం. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం ఒంటిమామిడిపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి 2009లో మూతపడింది. నాలుగేళ్లపాటు తలుపులు కూడా తెరవలేదు. దీంతో తమ పిల్లలకు ప్రైవేటుకు పంపించొద్దని, ప్రభుత్వ బడిని తెరిపించాలని గ్రామసభలో స్థానికులంతా తీర్మానించుకున్నారు. బాల వికాస స్వచ్ఛంద సంస్థ సహకారం, అప్పటి ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి ప్రోత్సాహంతో 2015లో ఆంగ్లమాధ్యమంలో నర్సరీ నుంచి ఏడో తరగతి వరకు పాఠశాలను పునఃప్రారంభించుకున్నారు. ప్రతి ఏడాది ఒక్కో తరగతిని పెంచుకున్నారు.
తల్లిదండ్రులు ఒక్కో విద్యార్థికి నర్సరీ నుంచి అయిదో తరగతి వరకు రూ.5 వేలు, ఆరు నుంచి పదో తరగతి వరకు రూ.6 వేల చొప్పున విద్యాకమిటీకి చెల్లిస్తున్నారు. ఇలా తొమ్మిదేళ్లలో రూ.2 కోట్లు వసూలైంది. విద్యాకమిటీ చొరవతో 2015లో రేకుల షెడ్లతో అయిదు గదులను నిర్మించారు. 2016లో సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేశారు. డిజిటల్ తరగతుల కోసం 10 కంప్యూటర్లను, ప్రొజెక్టర్లను కొన్నారు. ఆడిటోరియం నిర్మించారు. ఇటీవల స్థలాన్ని కొని, నరేగా నిధులతో 19 యూనిట్ల మరుగుదొడ్లు, మూత్రశాలల నిర్మాణం చేపట్టారు. పాఠశాలలో ప్రస్తుతం 498 మంది ఉండగా తొమ్మిది మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. అదనంగా 11 మంది వాలంటీర్లను నియమించిన విద్యాకమిటీ... ప్రతినెలా రూ.2 లక్షలను వేతనాలుగా చెల్లిస్తోంది. ఎస్సెస్సీలో ప్రతి ఏడాది శతశాతం ఫలితాలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్